ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్
పిడుగురాళ్ల రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గెలుపుకు ముదిరాజులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ ముదిరాజ్ అన్నారు. మండలంలోని కామేపల్లి గ్రామంలో గురువారం ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించింది ఏకై క వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. ముదిరాజుల సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించి విడుదల రజినికి మంత్రి పదవి ఇవ్వడంతోపాటు, బీసీ మెంబర్గా పదవి ఇచ్చారన్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్లను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ముదిరాజుల సోదరులు పాల్గొన్నారు.