పెదవేగి : వైఎస్సార్ సీపీలోకి వరుస చేరికలతో నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దెందులూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు పాలడుగు భానుప్రకాష్ ఆధ్వర్యంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వీరందరికి పార్టీ కండువాలు కప్పిన వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, నాయకులు అశోక్గౌడ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడిన జగనన్నను రాజకీయంగా ఎదుర్కోలేక పెత్తందార్లు అమానుషదాడులు చేస్తున్నారని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, జగనన్న సునామీని ఆపడం వాళ్ల తరం కాదని, జగనన్నకు అండగా నిలిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు నెరుసు నాగసత్యం, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, పార్టీ పెదవేగి మండల అధ్యక్షులు జానంపేట బాబు, జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం గంగరాజు, సర్పంచ్ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిక
పెదవేగి: తెలుగుదేశం పార్టీ వికృత చేష్టలకు విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి క్యూ కడుతున్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామానికి చెందిన సైదం గోపి తెలుగుదేశం పార్టీని వీడి దెందులూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. గోపికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.