సమసమాజ స్థాపకుడు ఆవంత్స | Sakshi
Sakshi News home page

సమసమాజ స్థాపకుడు ఆవంత్స

Published Mon, Nov 20 2023 2:44 AM

సమావేశంలో మాట్లాడుతున్న అరసం జాతీయ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ - Sakshi

పిఠాపురం: సమసమాజ స్థాపనకు 82 ఏళ్ల పాటు తన రచనల ద్వారా పాటుపడిన మహోన్నతుడు ఆవంత్స సోమసుందర్‌ అని అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. ఆవంత్స సోమసుందర్‌ లిటరసీ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆవంత్స శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత గలిగిన రచయితగా సామాజకి మార్పు కోసం ఆవంత్స రచనలు చేసారన్నారు. మరో ముఖ్య అతిథి అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివ ప్రసాద్‌ మాట్లాడుతూ మనిషిని నడిపించేది ఒకటి సైన్సు అయితే రెండోది సాహిత్యం అన్నారు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడంలో సోమసుందర్‌ ఎంతో కృషి చేసారన్నారు. సాహిత్యానికి, కళలకు నేటి యువత దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతరం సోమసుందర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చెలికాని స్టాలిన్‌ పీఆర్‌ ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ భరతలక్ష్మి, సహృదయ మిత్ర మండలి సభ్యులు పి.పావని, యువ రచయిత కిలారి గౌరీనాయుడు, రచయిత గౌరవ్‌, సోమసుందర్‌ లిటరసీ ట్రస్టు సభ్యులు డాక్టర్‌ గజరాజు సీతారామస్వామి, మేకా మన్మధరావు, ఆవంత్స విజయ శేషేంద్ర, శాతకర్ణి, గట్టి శ్రీకృష్ణదేవరాయలు, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, తటవర్తి సుబ్బారావు, సాహిత్య అభిమానులు, కళాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

అరసం జాతీయ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

Advertisement
Advertisement