ఎవర్నీ నమ్మకండి: మరో నటి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఎవర్నీ నమ్మకండి : మరో నటి ఆత్మహత్య

Published Fri, Aug 7 2020 7:47 AM

Bhojpuri actress Anupama Pathak commits suicide in Mumbai - Sakshi

సాక్షి, ముంబై : ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన  సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.  సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్  స్వాధీనం చేసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరణానికి ఒకరోజు ముందు, ఫేస్‌బుక్ (ధృవీకరించని ఖాతా) లైవ్ లో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరినీ నమ్మొద్దనీ, మోసపోయానంటూ అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. "అందరికీ విశ్వాసపాత్రులుగా ఉండండి..కానీ ఎవరినీ ఎప్పటికీ నమ్మకండి..ఇది నా జీవితంలో నేర్చుకున్న పాఠం. ప్రజలు చాలా స్వార్థపరులు ఇతరులను పట్టించుకోరు" అని ఆమె వీడియోలో  పేర్కొన్నారు.  మలాడ్‌లోని విజ్ డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే సంస్థలో 10వేల రూపాయల పెట్టుబడి పెట్టారు. 2019 డిసెంబర్‌లో మెచ్యూరిటీ తేదీ తర్వాత కూడా ఆ డబ్బును చెల్లించలేదు. అలాగే మనీష్  ఝా అనే వ్యక్తి, లాక్ డౌన్ సమయంలో అనుపమ ద్విచక్ర వాహనాన్ని తీసుకొని తిరిగి ఇవ్వలేదని కూడా సూసైడ్  నోట్ ద్వారా తెలుస్తోంది. కాగా బిహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ ఉపాధి నిమిత్తం ముంబైలో ఉంటున్నారు.

Advertisement
Advertisement