గెలిచినా.. ఓడినా మీవెంటే | Sakshi
Sakshi News home page

గెలిచినా.. ఓడినా మీవెంటే

Published Mon, Nov 20 2023 1:58 AM

మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రీడాభిమానులు  - Sakshi

ప్రపంచకప్‌ ఫైనల్‌మ్యాచ్‌కు అనూహ్య స్పందన

కడప ఆర్ట్స్‌ కళాశాలలో బిగ్‌ స్క్రీన్‌పై వీక్షించిన వేలాదిమంది అభిమానులు

కడప స్పోర్ట్స్‌: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించిన హై ఓల్టేజ్‌ తుదిపోరును వీక్షించేందుకు జిల్లా ప్రజలు తరలివచ్చారు. దీనికి తోడు ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం నుంచే ఆర్ట్స్‌ కళాశాల మైదానం క్రీడాభిమానులతో కళకళలాడగా, కడప నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి.. సాయంసంధ్యవేళ ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో మ్యాచ్‌ను వీక్షిస్తూ సందడి చేశారు.. కాగా భారత్‌ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో ఒక్క అడుగు దూరంలో నిలిచిపోగా..కొందరు క్రీడాభిమానులు నిరాశ చెందగా..యావత్‌ క్రీడాభిమానులు గెలిచినా..ఓడినా.. మీవెంటే అంటూ భారత్‌ జట్టుకు మద్దతుపలికారు. విచ్చేసిన క్రీడాభిమానులకు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వైఎస్‌ఆర్‌ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధులు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటుచేసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో సీఏవైడీ అధ్యక్షుడు ఎం. భరత్‌రెడ్డి, కార్యదర్శి ఎ. రెడ్డిప్రసాద్‌, కోశాధికారి మహేంద్రారెడ్డి, సభ్యులు సంజయ్‌కుమార్‌రెడ్డి, వై. విష్ణుప్రీతంరెడ్డి, ఎల్‌. మునికుమార్‌రెడ్డి, అబ్దుల్‌ ఫరూఖ్‌ రెహమాన్‌, విష్ణుమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కడప ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో 
భారీ స్క్రీన్‌ ద్వారా లైవ్‌స్ట్రీమింగ్‌
1/1

కడప ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో భారీ స్క్రీన్‌ ద్వారా లైవ్‌స్ట్రీమింగ్‌

Advertisement
Advertisement