దువ్వాడ పూర్వ సీఐపై ఫోర్జరీ కేసు | Sakshi
Sakshi News home page

దువ్వాడ పూర్వ సీఐపై ఫోర్జరీ కేసు

Published Wed, May 22 2024 10:20 AM

-

అగనంపూడి: దువ్వాడ పూర్వ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు తెలిపిన వివరాలివీ.. దువ్వాడ సీఐగా గతంలో పనిచేసిన బి.శ్రీనివాసరావు, స్టీల్‌ప్లాంట్‌ సీఐ వి.శ్రీనివాసరావు, గాజువాక ఎస్‌ఐ సతీష్‌ ఈ ఏడాది జనవరిలో టి.దేవాడలో పేకాడ స్థావరంపై దాడి చేశారు. తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అప్పటి దువ్వాడ సీఐ బి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఈ సమయంలో దాడిలో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా.. వారి సంతకాలు ఎఫ్‌ఐఆర్‌పై లేకుండానే వేరే సంతకాలతో కేసు నమోదు చేశారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌ సీఐ వి.శ్రీనివాసరావు, గాజువాక ఎస్‌ఐ సతీష్‌ ఫిర్యాదు మేరకు సీఐ ఎర్రంనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement