విశాఖ స్పోర్ట్స్: విశాఖ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణంగా ఉందని అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ తెలిపింది. హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న ఆమెకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. వివిధ పాఠశాలల విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జ్యోతి ‘సాక్షి’తో మాట్లాడుతూ తన లక్ష్యం ఒలింపిక్స్లో పతకం సాధించడమేనని చెప్పింది. అయితే ఇంకా ఎటువంటి ప్రిపరేషన్ మొదలు కాలేదని, కోచ్ నిర్ణయం మేరకు ప్రాక్టిస్ సెషన్ ప్రారంభిస్తానంది. విశాఖ నుంచి ఒలింపిక్స్లో అందునా అథ్లెటిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందన్నారు.