ఉత్తమ రైతు రఘుకు ఉగాది పురస్కారం | Sakshi
Sakshi News home page

ఉత్తమ రైతు రఘుకు ఉగాది పురస్కారం

Published Thu, Mar 23 2023 1:16 AM

- - Sakshi

గుంటూరులో వీసీ నుంచి అవార్డు అందుకుంటున్న రైతు రఘు

బుచ్చెయ్యపేట : మండలంలోని బంగారుమెట్టకు చెందిన రైతు సాయం రఘు రాష్ట్ర ఉత్తమ రైతుగా ఉగాది పురస్కారం దక్కించుకున్నారు. బుధవారం ఉగాది పర్వదినాన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం గుంటూరులో జరిగిన వేడుకల్లో వైస్‌ చాన్సలర్‌ విష్ణువర్థన్‌రెడ్డి చేతుల మీదుగా రఘు ఈ అవార్డును అందుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక మెలకువలు పాటించి, సమగ్ర సస్య రక్షణ చేస్తూ, శాసీ్త్రయ పద్ధతుల్లో అధిక పంట దిగుబడులు సాధించడంతో రఘును రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న రఘును మండల నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు అభినందించారు.

Advertisement
Advertisement