రేపు కొయ్యూరులోజగనన్నకు చెబుదాం | Sakshi
Sakshi News home page

రేపు కొయ్యూరులోజగనన్నకు చెబుదాం

Published Thu, Nov 9 2023 12:24 AM

-

సాక్షి,పాడేరు: కొయ్యూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఈనెల 10వతేదీ శుక్రవారం జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరుగుతుందన్నారు. మండలంలో ప్రజలు ఈప్రత్యేక స్పందనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నిశాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. స్పందన ముగిసిన అనంతరం ఆయా శాఖల సిబ్బందితో అధికారులు సమావేశాలు నిర్వహించాలన్నారు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం జరగాల్సిన స్పందన రద్దు చేశామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement