![‘కడెం’ మరమ్మతుల్లో వేగం పెంచాలి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25knp151-340107_mr.jpg.webp?itok=DFljmPRo)
● ఈఎన్సీ నాగేందర్రావు
కడెం: కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని అపరేషన్ అండ్ మెంటెనెన్స్ ఇంజనీరింగ్ చీఫ్(ఈఎన్సీ) నాగేందర్రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు మరమ్మతు ప నులను శనివారం పరిశీలించారు. పనులను జూన్ 10లోగా పూర్తి చేయాలన్నారు. రెండేళ్లుగా భారీ వరదలతో ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయించి, వానాకాలం సీజన్కు ప్రాజెక్టును సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈఎన్సీ వెంట ఎస్ఈలు సంజీవ్, రవీందర్రావు, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ఏఈఈలు రవినాయక్, సర్వర్, ప్రాజెక్టు సిబ్బంది ఉన్నారు.