వృద్ధుడు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వృద్ధుడు ఆత్మహత్య

Published Sun, May 26 2024 3:20 AM

-

కౌటాల: ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్యకు పా ల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ముత్తంపేటకు చెందిన కారెం పెంటు (64) శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఎన్‌.మధుకర్‌ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిర్పూర్‌(టి)సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్ల్లు ఉన్నారు.

పురుగుల మందుతాగి..

కోటపల్లి: పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పార్‌పల్లికి చెందిన నామని సురేశ్‌ (42) కొంతకాలంగా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతుండేవాడు. శనివారం ఇంట్లో పురుగుల మందు తాగడంతో అతని భార్య రజిత గమనించి 108కు సమాచారం అందించింది. ముందుగా చెన్నూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఏఎస్సై కాంతారావు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement