సికిల్సెల్పై అవగాహన అవసరం
ఆదిలాబాద్టౌన్: సికిల్సెల్పై వైద్య సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఎంఎల్హెచ్పీలతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్ర రక్త కణాల ఇమొలైసిస్ కారణంగా సికిల్సెల్ వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. రక్తహీనత, అలసట దీని లక్షణాలని తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల్లో కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్ మెట్పెల్లివార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వైసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.