దాబాల్లో మద్యం సీసాలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

దాబాల్లో మద్యం సీసాలు స్వాధీనం

Published Thu, Nov 9 2023 12:28 AM

-

గుడిహత్నూర్‌: అక్రమంగా విక్రయిస్తున్న మద్యం సీసాలను ఇచ్చోడ ఎకై ్సజ్‌ సీఐ రాజమౌళి మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆయన వివరాల ప్రకారం.. తనిఖీల్లో భాగంగా సీతాగోంది వద్ద ఉన్న శర్మ దాబాలో సోదాలు నిర్వహించగా 20క్వార్టర్ల మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.3600 ఉంటుందని తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన దాబా యజమానికి ప్రదీప్‌శర్మపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు వేర్‌ఇట్‌ యాప్‌ ద్వారా క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చని, ఇలా గుర్తించిన మద్యం సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఎస్సై లక్ష్మణ్‌ కుమార్‌, సిబ్బంది బాపురావ్‌, మహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement