నియోజకవర్గానికి స్వాతంత్య్రం ఇంకా రాలేదు
పెంబి: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు గడుస్తున్నా సందర్భంలో ఊరురా దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గానికి ఇంకా స్వాతంత్య్రం రాలేదని మాజీ ఎంపీ, నియోజకవర్గ బీజేపీ నాయకులు రాథోడ్ రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షులు సైనికుడిలా పనిచేయాలని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే పాలిస్తుందన్నారు. దీనికోసం గ్రామాల్లోని బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు, కరెంట్, కనీస నీటి సౌకర్యం లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జానుబాయి, నియోజకవర్గ నాయకులు పడాల రాజశేఖర్, మండల అధ్యక్షుడు సదాశివ్ ఉన్నారు.