ప్రధాన వార్తలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్రెడ్డి
కె.రాహుల్తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని.. రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ–కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని.. అక్కడక్కడా బీఆర్ఎస్ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. గ్యారంటీలను, హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేకనే.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ప్రచార పర్వం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకే అనుకూల వాతావరణం తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంతో అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ను వెన్నాడుతున్నాయి. దీంతో మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు మించి వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మేం కచ్చితమైన ఎన్నికల కార్యాచరణతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలోని ఒక్కో ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు, టీమ్లు ఏర్పాటు చేశాం. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఒక్కో అసెంబ్లీకి పంపించాం. ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇంకా ఏ పార్టీ, ఎంపీ అభ్యర్థులు కూడా పోలింగ్బూత్ స్థాయి వరకు చేరుకోలేదు. మేం మాత్రం కచ్చితమైన ప్రణాళికతో బూత్ స్థాయి వరకు ఓటర్లను చేరుకున్నాం. బీజేపీ బలాన్ని పెంచుకుంటున్నాం.. హైదరాబాద్ నుంచి బరిలో ఉన్న మాధవీలత, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న వినోద్రావు బీజేపీలో ఉన్నవారే, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నవారే. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని సీట్లలో ఇతర పార్టీల వారికి, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ ఇంకా చిన్న పార్టీ. పెరగాల్సిన అవసరం ఉంది. సంకీర్ణమైతే దేశం ష్టుపడుతుంది రాబోయేది సంకీర్ణ యుగమంటూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ సంకీర్ణంలో చేరుతారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదు. సంకీర్ణమంటే దేశమైనా, రాష్ట్రమైనా ష్టుపడతాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎవరికి వారు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పరిస్థితి పట్ల ప్రజలు విసిగి వేసారాకే.. 2014లో, 2019లో బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్డీయేను అందలం ఎక్కించారు. ఈసారి గెలిచాక జమిలి ఎన్నికలే.. మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానంతో ముందుకెళతాం. వచ్చే ఎన్నికలు కలిసే జరుగుతాయి. దేశంలో జనగణనతోపాటు నియోజకవర్గాల పునరి్వభజన జరగాల్సి ఉంది. ఇందులో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటూ దుష్ఫ్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. సీఎం, మాజీ సీఎం స్థాయివాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు! ప్రస్తుతం రాజకీయ వాతావరణమంతా కలుషితమై పోయింది. గతంలో ఎన్నికలంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ మాత్రం సంబంధం లేని విషయాలు ప్రస్తావించడం, అబద్ధాలు మాట్లాడటం, ఉపయోగించే భాషపై నియంత్రణ లేకపోవడం పెరిగింది. కొడతా, తిడుతా, చంపుతా, పాదాల కింద నలిపేస్తా అంటూ సీఎం, మాజీ సీఎం స్థాయిల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రచారంలో, మాట్లాడే మాటల్లో నైతికత లేకుండా పోయింది. హైదరాబాద్ లోక్సభ స్థానం సహా అన్నిచోట్లా డబ్బులే కీలకపాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. రాముడి పేరిట కాదు.. అభివృద్ధిని చూపి వస్తున్నాం బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా రాముడి ప్రస్తావన ఉందా? మీడియా, వార్తాపత్రికల్లో దీని ప్రాతిపదికన ఎక్కడైనా ఓట్లు అడిగామా? పదేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశాం, ఏయే రంగానికి ఎన్నెన్ని నిధులిచ్చామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎంత మందికి బియ్యం ఇస్తున్నాం, రైతులకు ఏం చేశామనేది చెప్తున్నాం. మేం రాముడి పేరిట ఓట్లు అడుగుతున్నామని విమర్శిస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి దేశంలో సుస్థిర ప్రభుత్వం రావడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్పెట్టవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. ఇక ముందు మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరుతున్నాను. రేవంత్కు ముందుంది ముసళ్ల పండుగ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదంటున్నాం. మా ఇంటింటి ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్తుంటే మంచి స్పందన వస్తోంది. రేవంత్రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలు ఎలా చేస్తారు? ఇప్పుడు తొందరపడి ఎగిరెగిరి పడితే సరిపోతుందా? భూములు అమ్మి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు? ఏం చేస్తారనేది ప్రజల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ఫ్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం.
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జైళ్లకు భయపడనని, ప్రాణాలైనా బలిపెట్టి పోరాడుతా కానీ తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయని చెప్పారు. తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శనివారం సాయంత్రం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. మోదీ గోదావరిని ఎత్తుకపోతుండు ‘గోదావరి నదిని ప్రధాని మోదీ ఎత్తుకొనిపోతున్నాడు. అన్యాయం చేస్తామంటున్నాడు. ఊకుందామా? కృష్ణానదిని అప్పగించినా ఈ ముఖ్యమంత్రికి కుయ్యి, కుట్కు లేదు. గోదావరిని తమిళనాడుకు అప్పగిస్తే నోరు తెరుస్తలేడు. అడ్డగోలుగా మాట్లాడుతూ గుడ్లు పీకుతా, పేగులు మెడలేసుకుంటా, లాగుల తొండలు జొర్రగొడుతా, జైల్లో వేస్తా అంటున్నాడు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన. ఈ జైళ్లకు నేను భయపడతానా? భయపడితే ఈ రాష్ట్రమొచ్చేదా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. శిఖలు పట్టుకుని కొట్టుకుంటున్నారు ‘రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. కరెంట్ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. కరెంటు ఎందుకు పోతోంది. పట్టణాల్లో ఒక రూపాయికే పరిశుభ్రమైన నీరు, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి ఎందుకు రావడం లేదు? విదేశీ విద్యా రుణం లేదు.. మెడికల్ కాలేజీల పర్మీషన్లు లేవు. వసతిగృహాల్లో విద్యార్థులు కలుíÙతాహారంతో చనిపోతున్నారు. నాలుగు నెలల దాకా వచ్చినవన్నీ ఇప్పుడు యాడికి పోయినయి. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ ఏడపాయె. రైతులకు బోనస్ రూ.500, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడితే ఆడవాళ్లు శిఖలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆటో కార్మీకులు ఆగమయ్యారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం నోటికి ఏది వస్తే అది చెబుతున్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్లు పెడుతున్నారు. రుణమాఫీ చేయాలని అడిగితే డిసెంబర్ 9, వంద రోజులు, ఆగస్టు 15 అంటున్నారు..’ అని మాజీ సీఎం ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు ‘మేం పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసినం. ఇప్పుడు హరితహారాల్లో చెట్లు ఎండిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోతోంది. బీఆర్ఎస్ పనులన్నీ నిలిపివేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పుడు పంటలను కొనే దిక్కులేదు. ఐదెకరాలకే రైతుబంధు అంటున్నారు. ఆరు, ఏడు ఎకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారు?’ అని కేసీఆర్ నిలదీశారు. బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్లే.. ‘నరేంద్ర మోదీ నా మెడపై కత్తిపెట్టి ఆ్రస్టేలియా బొగ్గు కొనాలన్నా నేను కొనలే. కానీ ఈ ముఖ్యమంత్రి దావోస్, స్విట్జర్లాండ్ వెళ్లి మాట ముచ్చట చేసుకుని వచ్చాడు. మోదీ పదేళ్ల కిందట గెలిచినప్పుడు ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. బేటీ బచావో బేటీ పఢావో, సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. ఏదీ జరగలేదు. మోదీది అంతా ఉత్త ‘గ్యాస్’ కంపెనీ తప్ప మరేం లేదు. కాంగ్రెస్ అన్నిట్లో వైఫల్యం చెందింది. బీజేపీతోటి ఒరిగిందేమీ లేదు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లే. బీఆర్ఎస్తోనే తెలంగాణకు శ్రీరామరక్ష. మోసపోయి, గోసపడొద్దు..’ అని బీఆర్ఎస్ అధినేత కోరారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాల్నా? ‘పాత ఆదిలాబాద్లో కొత్తగా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎలక్షన్ తెల్లారే ముఖ్యమంత్రి ఆ కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటున్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవల్నా? ఇక్కడ ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడు పోటీలో ఉన్నారు. కార్మీకుడు గెలవాలా? శ్రీమంతుడు గెలవాల్నా? జిల్లా ఉండాలంటే ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలవాలి. ఈశ్వర్ 26 ఏళ్లు కార్మీకుడిగా పని చేశారు. బ్యాలెట్ యుద్ధంలో మంచిర్యాల గుండెను చీల్చి ఈశ్వర్ను గెలిపించాలి..’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు, పుట్ట మధు, నాయకులు విజిత్రావు పాల్గొన్నారు.కౌశిక్రెడ్డి ఇంట్లో కేసీఆర్ బస నేడు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం వీణవంక (హుజూరాబాద్): మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్ శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడే రాత్రి బస చేయనున్న మాజీ సీఎం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యకర్తలు, ప్రజలతో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కౌశిక్రెడ్డి ఇంటి పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 20 వేల మంది పాల్గొనేలా సమీకరణ జరుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనం తర్వాత కౌశిక్రెడ్డి ఇంటి నుంచి మెయిన్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ తదితర నేతలు ఉన్నారు.గోదావరికి కేసీఆర్ పూజలుచీరసారె సమర్పించి మొక్కులు గోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నదికి పూజలు నిర్వహించారు. బస్సుయాత్రలో పాల్గొనడానికి శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్లో గోదావరిఖని చేరుకున్న కేసీఆర్.. స్థానిక ప్రధాన చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం సింగరేణి ఇల్లెందు అతిథి గృహంలో బస చేశారు. శనివారం సాయంత్రం వరకు అక్కడే సేదదీరిన కేసీఆర్.. బస్సుయాత్ర కోసం మంచిర్యాల బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో గోదావరినది వంతెన వద్ద కాన్వాయ్ ఆపారు. గోదావరి నదిలో పూలు జల్లి పూజలు చేసి.. చీరసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులున్నారు. మంచిర్యాలలో బస్సుయాత్ర ముగించుకున్న తర్వాత కేసీఆర్ గోదావరిఖనిలో కాసేపు ఆగారు. పోలీస్హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దామోదర్ కుటుంబ సభ్యులతో ముచ్చటించి తేనీటివిందు స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ బయలుదేరి వెళ్లారు.
ఈ నెల 8లోగా రైతు భరోసా... లేకుంటే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 8వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని.. లేకుంటే 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాస్తానని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. మరి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. ఆగస్టు 15 నాటికల్లా రైతుల రుణమాఫీ చేస్తామని.. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ రెడీ పెట్టుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ మధ్య ఫైనల్స్ జరగనున్నాయని.. తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభ, వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో రేవంత్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా మీద రూ.ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లారు. ఈరోజు ఆయన రైతు భరోసా ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మేం రైతు భరోసా స్కీంను డిసెంబర్లోనే మొదలుపెట్టాం. రాష్ట్రంలో మొత్తం 69లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటికే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం. మిగతా 4 లక్షల మంది ఖాతాల్లో ఈనెల 8వ తేదీలోగా రైతుబంధు తప్పకుండా జమ చేస్తాం.ఏ ఒక్క రైతు ఖాతాలోనైనా రైతుబంధు జమ కాలేదని నిరూపిస్తే.. అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతా. అర్హులందరికీ రైతుబంధు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సిద్ధమా? రాష్ట్రంలో కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతలరాయుడిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పని అయిపోయింది. దింపుడు కల్లం ఆశలు పెట్టుకోవడం కూడా వృథా. మే 13న ఫైనల్స్డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ లాంటివి. ప్రజలు బీఆర్ఎస్ను మట్టికరిపించి కాంగ్రెస్ను ఆదరించారు. మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచి తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి.హరీశ్ రాజీనామాతో రెడీగా ఉండు.. బీఆర్ఎస్ పాలనలో 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడేళ్లయినా ఇవ్వలే. తునకలుగా ఇస్తే ఆ పైసలు మిత్తికి కూడా చాలలేదు. నేను అలా సోయి లేనోడిని కాదు. కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తా. హరీశ్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండు. రైతులకు బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వాతంత్య్రం ఇప్పిస్తా.. సిద్దిపేటకు నీ నుంచి విముక్తి కల్పిస్తా. బీజేపీకి వాత పెట్టాలి రాష్ట్ర విభజనపై ప్రధాని హోదాలో మోదీ మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ట్రిపుల్ ఐటీ, గిరిజన వర్సిటీ.. ఇలా ఏమీ ఇవ్వకుండా గాడిద గుడ్డు చేతిలో పెట్టిన బీజేపీ ఓటేద్దామా..? లేక కర్రు కాల్చి వాతపెడదామా ప్రజలే చెప్పాలి. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తూనే ఉంది. అందుకే కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్ఎస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయి. ఎవరిని చెప్పుతో కొట్టాలి? రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్లని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు అంటున్నారు. నిన్ననే బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం ప్రియాంబుల్ (ప్రవేశిక)ను మార్చేస్తామన్నారు. మరి ఇప్పుడు దుష్యంత్™ కుమార్ను చెప్పుతో కొట్టాలా? అబద్ధాలు చెప్తున్న నేతలను చెప్పుతో కొట్టాలా? ఎవర్ని కొట్టాలో బీజేపీ నేతలే చెప్పాలి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. ఆ పార్టీ దేశ ప్రజల నెత్తిపై వేలాడుతున్న కత్తి లాంటిది. పాలమూరు బిడ్డపై కుట్ర.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పాలమూరు బిడ్డను సీఎంగా ఎన్నుకుని 150 రోజులు కాలేదు. అప్పుడే దిగిపొమ్మని అంటున్నారు. ఢిల్లీ నుంచి పడగొడతామని బయలుదేరుతున్నారు. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండని డీకే అరుణమ్మ అంటోంది. నీకు, నాకు గెట్టు పంచాయతీ ఏముంది? ప్రజల దీవెన, సోనియమ్మ ఆశీర్వాదంతో నాకు సీఎం పదవి వచ్చింది. కానీ నన్ను దించేందుకు, ఢిల్లీ పోలీసులతో అరెస్ట్ చేసేందుకు అమిత్ షాతో మాట్లాడి స్కెచ్ వేస్తోంది. నేనేం తప్పు చేశా? బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్నదని చెప్పిన. ఆ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను లోపలేసి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటున్నారు.’’ ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రసంగించారు. – బ్రిటీషర్లకు ఎదురు నిలిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని, తెలంగాణ సీఎంపై బెదిరింపులకు పాల్పడుతున్న ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. – బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి తెచ్చి నాలుగు అక్షింతలు చల్లి ఊరుకుందే తప్ప చేసిందేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎంగా ఏనాడూ ఖమ్మం జిల్లాకు రాని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చి కల్లి»ొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. – రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నవారికి ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దమ్ముంటే యోధుడైన రేవంత్ను టచ్ చేసి చూడాలని ప్రత్యర్థి పారీ్టలకు సవాల్ విసిరారు. – పాలమూరు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్నికలు జరగబోతున్నాయని కొత్తకోట కార్నర్ మీటింగ్లో మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని, ర్మాణరంగంపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునపడ్డారని విమర్శించారు. సీఎం బీజేపీలో చేరుతారని ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారని, పార్టీ మార్పు విషయమై బీజేపీ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదని నిలదేశారు.హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. మోదీ ఆశీర్వాదం కావాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని,8 సీట్లలో బీజేపీ గెలుపునకు రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారని. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదని అన్నారు.‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యం. ముస్లింలు, క్రైస్తవులు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలి. బీజేపీతో కలిస్తే జోడీ.. లేకుంటే ఈడీ. అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు.కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చింద,దిప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారు. కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఒక్క మోటర్ కూడా కాలలేదు. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు కాలిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రతిపక్షాలతో జైళ్లను నింపడంలో మార్పు మొదలైంది. కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయి.ఆరు గ్యారంటీల్లో ఒక్కటైనా అమలయ్యిందా?. ఐదు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం. కాంగ్రెస్ మోసం చేయని మనిషి లేడు.రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పట్ల రేవంత్ భాషను ప్రజలు ఆమోదించడం లేదు. యువతకు, భవిష్యత్ తరానికి రేవంత్ ఏం సందేశం ఇస్తున్నారు?. కేసీఆర్ చేసినవాటికి వ్యతిరేకంగా చేయడమే రేవంత్ ఉద్దేశం. రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. మొదటి రోజు తప్ప మళ్లి కనిపించలేదు. 3.50 లక్షల దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కరించారో చెప్పలేదు. పార్టీలు మారినవారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటి?. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ, బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలున్న వేదికపైనే మేనిఫెస్టో ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తెలంగాణ పాలిటిక్స్
వీడియోలు
వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
లోకేష్ 'రెడ్ బుక్' బెదిరింపులు.. నేడు ఏసీబీ కోర్టులో విచారణ
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ చేరికపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
నా తిరుపతి మహిళలకు మాటిస్తున్న..మైండ్ బ్లోయింగ్ స్పీచ్
వాలంటీర్లపై చంద్రబాబు,పవన్ ఏడుపు: కొడాలి నాని