-
ముగిసిన టెన్నిస్ పోటీలు
భువనగిరి పట్టణంలో కొనసాగుతున్న జాతీయస్థాయి డబుల్స్ విభాగం టెన్నిస్ పోటీలు శుక్రవారం ముగిశాయి. - IIలోశుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా.. మండలం ప్రాంతం ఉష్ణోగ్రత త్రిపురారం కామారెడ్డిగూడెం 46,6 హాలియా ఇబ్రహీంపేట 46.5 కట్టంగూర్ కట్టంగూర్ 46.5 దామరచర్ల తిమ్మాపూర్ 46.3 చందంపేట తెల్దేవర్పల్లి 46.3 నిడమనూరు నిడమనూరు 46.2 తిరుమలగిరిసాగర్ తిరుమలగిరిసాగర్ 46.2 మాడ్గులపల్లి మాడ్గులపల్లి 46.0 -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
దేవరకొండ, నిడమనూరు: ఎన్నికల విధుల్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన హెచ్చరించారు. దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిడమనూరులో రెండు నియోజకవర్గాల పీఓలు, ఏపీఓలకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం ఆమె వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా రెండుచోట్ల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఆరు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలింగ్ విధుల నిర్వహణలో తప్పులు చేస్తే సస్పెండ్ చేయడమే కాకుండా ఎన్నికల నిబంధనల మేరకు కేసులు నమోదు అవుతాయన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు తప్పని సరిగా పాటించాలని అన్నారు. ఆ తర్వాత దేవరకొండ పట్టణంలోని పాత సత్యసాయి కాలేజ్ రోడ్డులో 91 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్ బీఎన్ శామ్యూల్ హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోగా వారి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. రెండుచోట్ల ఆమె వెంట అనదపు కలెక్టర్ శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, తహసీల్దార్ సంతోష్కిరణ్ ఉన్నారు. ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన -
ఎనిమిది చోట్ల 46 డిగ్రీలపైనే..
నల్లగొండ టౌన్: ఎండలు మండుతున్నాయి. జిల్లాలో నాలుగు రోజులుగా అత్యధికంగా 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ఉదయం 9గంటల దాటిందంటే ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. 11 గంటల దాటితే వీధులు, రోడ్లు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వేడిగాలులు వీస్తుండడంతో ఉక్కపోతతో తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం అత్యధికంగా త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనుముల హాలియా మండలం ఇబ్రహీంపేట, కట్టంగూర్ మండల కేంద్రంలో 46.5 డిగ్రీలు నమోదుకావడం విశేషం. 21 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 24 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి నమోదైంది. ఇంకా ఐదు చోట్ల 43 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలో మిగతా చోట్ల 42 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండో వారంలో ఎండలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫ అత్యధికంగా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత -
అప్పుడే నకిలీ విత్తనాల దందా!
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో అప్పుడే నకిలీ పత్తి విత్తనాల దందా ప్రారంభమైంది. జిల్లాలో వచ్చే వానాకాలం సీజన్లో 5.40లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయనున్నట్టు, ఇందుకు సుమారు 15లక్షల వరకు పత్తి ప్యాకెట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ ఆరంభానికి నెలరోజుల ముందునుంచే నకిలీ విత్తనాల దందాకు వ్యాపారులు తెరలేపారు. తక్కువ ధరలకు విత్తనాలు ఇస్తామంటూ అమాయక రైతులకు నాసిరకం పత్తి విత్తనాలను అంటగడుతున్నారనే సమాచారం. పల్లెల్లో ఏజెంట్లను నియమించుకొని.. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని దందాను మూడుపువ్వులు ఆరుగాయలుగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. గత వానాకాలంలో సైతం నాసిరకం పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టడంతో సరైన పూత,కాయ రాక దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, నార్కట్పల్లి, చండూరు, మునుగోడు, దేవరకొండ, కొండమల్లేపల్లి, హాలియా, అంగడిపేట, చింతపల్లి, మాల్ వంటి ప్రాంతాల్లో నకిలీలు విత్తనాలు తీసుకొచ్చి గోదాముల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం సమీపంలోని కొన్ని దుకాణాలు, ప్రకాశం బజార్, దేవరకొండ రోడ్డులోని ఒక ఎరువుల దుకాణం, మండలాల్లోని వివిధ గ్రామాల్లో గల దుకాణాల్లోనూ ఈ దందాను జోరుగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వ్యాపారులు మాత్రం తమ వద్ద ఎరువులు, పురుగుల మందులను కొనుగోలు చేసే రైతులకు విత్తనాలను ముందస్తుగా ఉద్దెరకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్కు ముందే విత్తనాల రాక ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండి చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తున్నారు. కానీ, ఎన్నికల కోడ్ వెలువడక ముందే.. అంటే చెక్పోస్టులను ఏర్పాటు చేయకముందే నకిలీ విత్తనాలను జిల్లాకు చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 5లక్షల వరకు విత్తన ప్యాకెట్లు, 8టన్నుటల వరకు లూజ్ విత్తనాలను వ్యాపారులు తెచ్చినట్లు సమాచారం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం నకిలీ పత్తి విత్తనాలను అమ్మకుండా దుకాణాలు, వ్యాపారులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. గతంలో నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారు తిరిగి రెండోసారి పట్టుబడితే పీడీ యాక్టు ప్రయోగిస్తాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను నిర్వహిస్తాం. నకిలీ విత్తనాల అమ్మేవారి సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ ఫ ఏపీతోపాటు మహబూబ్నగర్ జిల్లా నుంచి పత్తి విత్తనాలు దిగుమతి ఫ రహస్య ప్రాంతాల్లో నిల్వచేసిన వ్యాపారులు ఫ ఏజెంట్ల ద్వారా గ్రామాలకు చేరవేసి రైతులకు విక్రయం ఫ నామమాత్రంగా అధికారుల నిఘా విత్తనాలు వచ్చింది ఈ జిల్లాల నుంచే.. ముఖ్యంగా మన రాష్ట్రంలోని మహబూబ్నగర్, ఏపీ రాష్ట్రంలోని కర్నూల్, గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి ఈ నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున వ్యాపారులు తెస్తున్నారు. ప్రస్తుతం చెక్పోస్టులు ఉన్న కారణంగా కార్లు, బైక్లపై ప్రధాన రహదారుల నుంచి కాకుంగా గ్రామాల గుండా జిల్లాకు తీసుకొస్తున్నట్టు సమాచారం. జిల్లా వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున గుట్టుచప్పుడు కాకుండా ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలను తెచ్చి రైతులకు అంటగడుతున్నారు. గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి నకిలీ విత్తనాల దందాను అరికట్టాలని, లేకుంటే తాము తీవ్ర నష్టాలపాలయ్యే అవకాశం ఉందని కొందరు రైతులు అంటున్నారు. -
మహిళా రక్షణ కోసమే షీటీమ్ బృందాలు
ఫ ఎస్పీ చందనా దీప్తి నల్లగొండ క్రైం: మహిళా రక్షణ కోసం షీటీమ్ బృందాలు నిరంతరం పనిచేస్తాయని జిల్లా ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ నెలలో జిల్లా వ్యాప్తంగా 13 ఫిర్యాదులు రాగా వాటిని విచారించి ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు రద్దీ ఉండే బస్టాండ్లు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్ల, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు తదితర ప్రాంతాల్లో మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై రహస్యంగా నిఘా ఉంచినట్లు తెలిపారు. మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లో షీటీమ్ పోలీసులకు, డయల్ 100, వాట్సప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఫొటోలు మార్పింగ్ చేసి యువతులకు పంపి బ్లాక్మెయిల్ చేస్తే షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు నల్లగొండ షీటీమ్ నంబర్ 8712670235, ఎస్పీ 8712670200, షీటీమ్ సీఐ కరుణాకర్ 8712670143, మిర్యాలగూడ షీటీమ్ ఎస్ఐ కోటేష్ 8096004465 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆడిట్ అభ్యంతరాలపై ఆధారాలు సమర్పించాలి మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలంలో 2018–19 నుంచి 2023–24 వరకు నిర్వహించిన సోషల్ ఆడిట్లో తెలిపిన ఆడిట్ అభ్యంతరాలపై మూడు, నాలుగు రోజుల్లో తగిన ఆధారాలు సమర్పించాలని జిల్లా విజిలెన్స్ అధికారి వేణుగోపాల్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్ణీత సమయంలోగా ఆధారాలు సమర్పించకుంటే ఫైనాన్షి యల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోట రికవరీ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ గౌతమి, టీఏ వింధ్యారాణి, ఎంపీడీఓ శేషగిరిశర్మ, ఎంపీఓ పద్మ పాల్గొన్నారు. వైభవంగా ఊంజలి సేవ యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి పర్వం చేపట్టారు. అదే విధంగా ప్రధానాలయంలో అర్చనలు, అభిషేకం, సుదర్శనహోమం, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర కైంకర్యాలు నిర్వహించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement