-
48 గంటలు నిషేధిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తరు: కేసీఆర్
సాక్షి, మహబూబాబాద్: ‘‘నా మీద ఎలక్షన్ కమిషన్ నిషేధం పెట్టింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయవద్దని నిషేధం విధించింది. అందరికీ మనవి చేస్తున్నా.. రేవంత్రెడ్డి నన్ను ఉద్దేశించి.. నీ పేగులు మెడలో వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ నిషేధం పెట్టలేదు. నామీద నిషేధం పెట్టింది. 48 గంటలు నా ప్రచారం నిషేధిస్తే.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు 96 గంటలు అవిశ్రాంతిగా పనిచేస్తరు..’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం మహబూబాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ ఉన్నదే తెలంగాణ కోసం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నేనేం చేశానో మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లకాలంలో తెలంగాణ ఎలా ఉండేది? కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లో తెలంగాణను ఆగం చేసింది. ఊరుకునే ప్రసక్తే లేదు.. సాగునీరు, తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త ఆగమైంది. ప్రధాని మోదీ గోదావరి జలాలు తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించారు. ఇంత జరిగినా సీఎం రేవంత్రెడ్డి నోరు మెదపడం లేదు. వారేం చేస్తారో.. రాష్ట్రానికి ఏ నష్టం తీసుకొస్తారో..! ఎంతకాలం చూస్తాం? రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. అరచేతిలో వైకుంఠం చూపించి.. ఎన్నికల సమయంలో ఇది ఇస్తాం.. అది ఇస్తామంటూ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసింది. ఒక్క ఉచిత బస్సు మినహా మరేదైనా వచ్చిందా? రైతుబంధు లేదు. కల్యాణలక్ష్మి లేదు. తులం బంగారం లేదు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన చొప్ప దొండి రైతు అక్కడ ఇబ్బందులకు తట్టుకోలేక గుండె ఆగి చనిపోయారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది పదేళ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చింది.. కరువు వచ్చింది. సాగు, తాగునీరు లేక రాష్ట్రం ఎడారిగా మారింది. కాళేశ్వరం నీళ్లు ఎందుకు రావడం లేదో ఆలోచించాలి. ఖమ్మం జిల్లాలో మురికి నీరు తాగుతున్నారు. మహ బూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గా ల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన కరెంట్, మిషన్ భగీ రథ నీళ్లు ఎటుపోయాయి? ఆటో కార్మీకుల జీవితాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.గిరిజనులను అక్కున చేర్చుకున్నది బీఆర్ఎస్సే..తరతరాలుగా వెనుకబడిన గిరిజనులను అక్కున చేర్చుకుని, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు నిధులు కేటాయించింది. ఏడు దశాబ్దాలుగా ఏ పార్టీ చేయని విధంగా వారి అస్తిత్వానికి నిదర్శనమైన సేవాలాల్ బంజారా భవనం కట్టుకున్నాం. రిజర్వేషన్ పెంచి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాం. బీఆర్ఎస్కు గిరిజనులు, ఆదివాసీలు అండగా ఉండాలి. ప్రతీ క్షణం, ప్రతీ అడుగు, ప్రతీ మాట ప్రజల కోసమే పనిచేసే బీఆర్ఎస్ను దీవించాలి. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..’’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. -
మంత్రులు ఏమన్నారంటే..
మహబూబాబాద్: కాంగ్రెస్పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అధ్యక్షతన నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. రెండుసార్లు పీఎంగా రాహుల్గాంధీకి అవకాశం వచ్చినా తీసుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్.. సీఎం రేవంత్రెడ్డిని లిల్లిపుట్టు అని సంభోదించారు.. వరంగల్ మిరపకాయ కారం కేసీఆర్కు తెలియదు.. రేవంత్రెడ్డికి తెలుసు.. సమయం వచ్చినప్పుడు ఎక్కడపెట్టాలో అక్కడ పెడుతారన్నారు. కేసీఆర్కు చిప్పకూడు తినే రోజులు దగ్గర పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజల స్వేచ్ఛను హరించింది. దానిలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ భవిష్యత్లో శిక్షణ తప్పదు. వంద రోజుల్లోనే రేవంత్ మార్క్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్రెడ్డి అద్భుత పాలన అందిస్తున్నారు. వంద రోజులలోనే తనదైన మార్కు వేసుకున్నారు. సీఎం పట్టుదల దూర దృష్టి ఉన్న నాయకుడు. గత ప్రభుత్వ చేసిన అప్పులు తీర్చలేరు. లోప భూయిష్టమైన పాలన ఉంది.. సాధ్యం కాదని బీఆర్ఎస్ అనుకున్నారు.. దానిని సీఎం గాడిలో పెట్టారు. 15స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం. బలరాంనాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బలరాంనాయక్ భోళా శంకరుడు : మంత్రి ధనసరి సీతక్క గ్యారంటీలకే గ్యారంటీ సీఎం రేవంత్రెడ్డి. అభ్యర్థి బలరాంనాయక్ మోసాలు తెలియని భోళా శంకరుడు. మోదీ ప్రభుత్వం జీఎస్టీల పేరుతో పేదలపై భారం మోపింది. భగవంతుని భక్తుని అనుసంధానమైన అగర్ బత్తిపై కూడా జీ ఎస్టీ విధించింది. దేశం కోసం స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని పీఎం చేయాలి. ఉపాధిహామీ, విద్యాహక్కు, ఆహార భద్రత చట్టాలని కాంగ్రెస్ తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. జన జాతర సభలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, డోర్నకల్, మహబూబాబాద్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, పాలకుర్తి ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, తెల్లం వెంకట్రాం, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, యశస్వినిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, బెల్లయ్య నాయక్, రియాజ్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, మోహన్లాల్, ఘనపురపు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి, అజయ్సారథిరెడ్డి, డాక్టర్ భూక్య ఉమ, చుక్కల ఉదయ్చందర్ పాల్గొన్నారు. -
ముగిసిన సుధాకర్ దంపతుల ప్రస్థానం
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ప్రస్థానం శుక్రవారం నాటికి ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేడ్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, అతని భార్య సుమన అలియాస్ రజిత మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున చల్లగరిగెకు మృతదేహాలను తీసుకొచ్చారు. గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర నాలుగు గంటల పాటు సాగింది. అనంతరం ముచినిపర్తి గ్రామ శివారులో మావోయిస్టు దంపతుల మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. అంత్యక్రియల నేపథ్యంలో పోలీస్ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది.కాగా, 25 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన సుధాకర్ మధ్యలో ఏనాడూ ఊరిలోకి రాలేదని, శవమై తిరిగొచ్చాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులను అన్యాయంగా కాల్చి చంపుతున్నారని ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ప్రజా బిడ్డలకు చావు లేదు ఉద్యమంలో చనిపోయిన సుధాకర్– సుమన దంపతులు ప్రజా బిడ్డలేనని వారికి ఎప్పటికీ చావు లేదని.. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హత్యకాండను పోత్సహిస్తుందని ఆరోపించారు. నివాళులర్పించిన వారిలో శాంతక్క, శోభ, శ్రీపతి రాజగోపాల్, గుమ్మడి కొమురయ్య, అంజన్న, మార్వాది సుదర్శన్, హుస్సేన్, విరసం నేతలు, బంధుమిత్రులు ఉన్నారు. ప్రజా బిడ్డలకు చావులేదు: ప్రజాసంఘాల నాయకులు చల్లగరిగెలో అంత్యక్రియలు పూర్తి -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు8లోu -
సెల్ఫీ పాయింట్
ఓటుహక్కు ప్రాధాన్యం చైతన్యం కల్పించడంలో భాగంగా వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి సెల్ఫీ దిగి ప్రారంభించారు. పబ్లిక్గార్డెన్, వరంగల్ రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి యువకులను ఆకర్షించి ఓటు నమోదు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ శ్రీనివాస్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.– కాళోజీ సెంటర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement