-
మైనార్టీలు కాంగ్రెస్ వైపే
జనగామ: మైనార్టీలు కాంగ్రెస్ వైపే ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి తనయుడు, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి గెలుపు కోరుతూ ఆదివారం డీసీసీ కార్యాలయంలో పట్టణ మైనారీ మహిళా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ చామలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మైనార్టీలు కలిసి రావాలని పి లుపునిచ్చారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. కాగా పట్టణంలోని 29, 30వ వార్డులో కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ అన్వర్, ముస్లిం మైనార్టీ చైర్మన్ ఎండీ జాఫర్ షరీఫ్, నాయకులు ఎండీ హయుబ్, మున్ని బేగమ్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వంగాల కళ్యాణి మల్లారెడ్డి, తిరునగిరి అండాలు, రజియా, నజీమా బేగం పాల్గొన్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి -
పోలింగ్ సమయం గంట పెంపు
● వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.కేజీబీవీలో అడ్మిషన్లు ప్రారంభంజనగామ రూరల్: జిల్లాలోని కేజీబీవీ పాఠశాల, ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని డీఈఓ కె. రాము ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించారన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. 6వ తరగతిలో అడ్మిషన్లు తీసుకోవాలని పరిమిత సీట్లు ఉన్నాయని, కావాల్సిన విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణజనగామ: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి చాపకింద నీరులా ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. నెల్లుట్లలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. నేడు(సోమవారం) భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్లో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తరఫున ప్రచారం చేసేందుకు జరిగే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జనగామ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా కావ్యను గెలిపించండిచిల్పూరు: మీ ఇంటి ఆడబిడ్డగా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని టీపీసీసీ కార్యదర్శి సింగపురం ఇందిర, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని పల్లగుట్ట గ్రామంలోని చిల్పూరు ఆలయ శాశ్వత అభివృద్ధి దాత పొట్లపల్లి శ్రీధర్రావు ఇంటి ఆవరణలో ఆదివారం పల్లగుట్ట క్లస్టర్ గార్లగడ్డతండా, ఫత్తేపూర్, పల్లగుట్ట, దేశాయితండా గ్రామాలకు చెందిన కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోగులుగుతామని, అందుకు కావ్యను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ మీఅందరి ఆశీర్వాదాలతో గెలిపిస్తే మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానన్నారు. మండలంలోని మల్కాపూర్, చిఅల్పూరు, చిన్నపెండ్యాల గ్రామాల్లో కార్నర్ మీటింగ్లను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈవీఎంల పరిశీలన పాలకుర్తి టౌన్: ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఓటింగ్ ఈవీఎంలను జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్యలు పరిశీలించారు. ఆదివారం స్ట్రాంగ్ రూంలను చెక్ చేశారు. మిషన్లు పనితీరు సవ్యంగా ఉందన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్కు ఇవ్వాల్సిన ఈవీఎంలను చెక్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి తహసీల్దార్ వెంకటేశం, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రసన్న కుమార్లు ఉన్నారు. -
మతోన్మాద బీజేపీని ఓడించాలి
జనగామ రూరల్: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మతోన్మాద బీజేపీని ఓడించాలని సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడుగుల భాస్కర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బోట్ల శ్రీనివాస్ అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలు కార్మిక వర్గం కర్తవ్యం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికలు కార్మికులు, ఉద్యోగులకు ఎంతో కీలకమన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తుల దారాదత్తం చేసి నిర్వీర్యం చేసిందన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న ఎంపీ అభ్యర్థి ఎండీ జాహంగీర్ను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాధ్, జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, విజేందర్, యాక య్య, రాజు, సోమన్న, నాగరాజు, ప్రకాష్, ఆనందం, ప్రశాంత్, రామచంద్రం పాల్గొన్నారు. -
1,165 హోం, పోస్టల్ ఓట్లు పోల్
జనగామ: జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో వరంగల్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి లో 1,165 పోస్టల్, హోం ఓటింగ్ ద్వారా ఓట్లు పో లైనట్లు కలెక్టరేట్ ఏఓ రవీందర్ తెలిపారు. ఆదివా రం ఆయన మాట్లాడుతూ పోస్టల్ ఓట్లు 595, హోం ఓటింగ్ (85 ప్లస్, దివ్యాంగులు) ద్వారా 846 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్, హోం ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఇతర జిల్లాకు చెందిన పోస్టల్ ఓట్లు పోలవగా వాటిని ఆయా జిల్లాలకు పంపిస్తామని రవీందర్ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీఓ స్టేషన్ఘన్పూర్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు అర్జున్, రవీందర్ తదితరులు డివిజన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధులు పడిన స్థానికేతర ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందన్నారు. -
మీటర్ మోగుతోంది!
హన్మకొండ: భానుడి భగభగలతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు కూలర్లు, ఏసీల ను వాడుతుండడంతో విద్యుత్ వాడకం పెరిగింది. ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. గతంలో ఫ్యాన్లు వాడిన ప్రజలు, ఆ తర్వాత కూలర్లకు వచ్చారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో కూలర్ల ద్వారా వచ్చే చల్లదనం సరిపోక ఏసీల వైపు మళ్లారు. ఏసీల వాడకం పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ప్రధానంగా హనుమకొండ జిల్లాలో అత్యధికంగా ఏప్రిల్ 30న 322 మెగావాట్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 18న 204 మెగావాట్లకు, ఏప్రిల్ 15న 137 మెగావాట్లు, మహబూబాబాద్ జిల్లాలో గత నెల 18న 269 మెగావాట్లు, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అత్యధికంగా ఏప్రిల్ 16న 201 మెగావాట్లకు చేరింది. అధిక వినియోగం.. హనుమకొండ జిల్లాలో ఏప్రిల్ 19న అత్యధికంగా 4.160 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఈనెల 3న 3.960 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. వరంగల్ జిల్లాలో అత్యధికంగా గతనెల 19న 3.390 మిలియన్ యూనిట్లు, ఈనెల 3న 2.900 మిలియన్ యూనిట్లు, జనగామ జిల్లాలో అత్యధికంగా ఏప్రిల్ 15న 2.690 మిలియన్ యూనిట్లు, ఈనెల 3న 1.890 మిలియన్ యూనిట్లు, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా గత నెల 19న 2.250 మిలియన్ యూనిట్లు, ఈనెల 3న 1.890 మిలియన్ యూనిట్లు, భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఏప్రిల్ 20న 4.190 మిలియన్ యూనిట్లు, ఈనెల 3న 3.740 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు వ్యవసాయ అవసరాలకు ప్రధానంగా వరికి నీరందించేందుకు బావులు, బోరు బావుల నుంచి నీటిని తోడేందుకు పంపుసెట్ల వాడకంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగింది. ఆ తర్వాత వరి చేతికి రావడంతో సాగు నీటి వినియోగం తగ్గింది. గతనెల 20 తర్వాత వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం తగ్గినా, గృహ, ఇతర అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో గృహ వినియోగం భారీగా పెరిగింది. రాత్రింబవళ్లు కూలర్లు, ఏసీలు వాడుతుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. పెరిగిన లోడ్.. విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో సబ్స్టేషన్లు, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పెరిగింది. ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నా రు. యుద్ధప్రాతిపదికన సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని పెంచుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ల సామర్థ్యం పెంచడంతో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రింబవళ్లు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రధానంగా గ్రేటర్ పరిధి హనుమకొండ టౌన్, వరంగల్ టౌన్ డివిజన్ పరిధిలో అధికారులు, ఉద్యోగులు నిరంతరం పని చేస్తున్నారు. వినియోగదారులకు విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఉమ్మడి జిల్లాలో భారీగా పెరిగిన విద్యుత్ వాడకం మండుతున్న ఎండలు చల్లదనానికి ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు రెట్టింపైన విద్యుత్ వినియోగంగతేడాది, ప్రస్తుత మే నెలలో జిల్లాల వారీగా విద్యుత్ డిమాండ్ ఇలా..(మెగావాట్లలో)జిల్లా మే1 మే2 మే3 (2023 / 2024) (2023 / 2024) (2023 / 2024) హనుమకొండ 164.51 / 212.21 166.46 / 229.1 178.46 / 237.01 వరంగల్ 115.98 / 160.83 103.12 / 177.21 110.89 / 175.72 జనగామ 61.04 / 94.25 59.31 / 92.79 64.21 / 115.5 మహబూబాబాద్ 86.13 / 128.62 85.15 / 139.34 85.52 / 138.1 జయశంకర్–ములుగు 139.32 / 148.02 137.76 / 178.75 137.95 / 149.04జిల్లాల వారీగా విద్యుత్ వినియోగం.. హనుమకొండ జిల్లాలో గతేడాది మే 1న 2.960 మిలియన్ యూనిట్లు, 2న 3.18, 3న 3.59 మిలియన్ యూనిట్లు, ఈ నెల 1న 3.680, 2న 3.830, 3న 3.960 మిలియన్ యూనిట్లు విద్యుత్ను వాడారు. వరంగల్ జిల్లాలో గతేడాది మే 1న 1.490, 2న 2.180, 3న 2.300 మిలియన్ యూనిట్లు, ఈ నెల 1న 2.760, 2న 2.820, 3న 1.890 మిలియన్ యూనిట్లు వినియోగించారు. జనగామ జిల్లాలో గతేడాది మే1న 1.200, 2న 1.190, 3న 1.310 మిలియన్ యూనిట్లు, ఈ మాసం 1న 1.840, 2న 1.860, 3న 1.890 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది మే 1న 0.970, 2న 1.040, 3న 1.130 మిలియన్ యూనిట్లు, ఈ నెలలో 1న 1.810, 2న 1.890, 3న 1.890 మిలియన్ యూనిట్లు.. భూపాలపల్లి, ములుగు జిల్లాలో గతేడాది మే 1న 2.400, 2న 2.790, 3న 2.780 మిలియన్ యూనిట్లు, ఈ నెల 1న 3.200, 2న 3.230, 3వ తేదీన 3.740 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement