-
వ్యక్తి అస్థిపంజరం లభ్యం
● తాంసి(కె) అటవీ ప్రాంతంలో.. ● నిపాని వాసి భూమన్నగా గుర్తింపు తాంసి: భీంపూర్ మండలం తాంసి(కె) శివారు పిప్పల్కోటి రిజర్వాయర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ దివారం వ్యక్తి అస్థిపంజరా న్ని గుర్తించారు. అటవీ ప్రాంతంలో దీన్ని చూసిన మేకల కాపరి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రదీప్కుమార్ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని కుక్కలు, అడవి జంతువులు పీక్కుతిన్నాయి. కేవలం ఆస్థిపంజరం, ముఖ భాగం ఉండడంతో ఆనవాళ్లు తెలిసేలా చేసింది. అస్థిపంజరం పక్కన దీక్షమాలతోపాటు పురుగుల మందు డబ్బా పడి ఉంది. మృతదేహం నిపాని గ్రామానికి చెందిన పూదరి భూమన్న(40)గా పోలీసులు గుర్తించి కుటుంబీకులకు తెలియజేశారు. భూమన్న వారం క్రితం హనుమాన్ మాలధరించి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు. తల్లి గంగమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదర్శనీయం
సామూహిక వివాహాలు ఇంద్రవెల్లి: సంత్ సద్గురు పూలాజీబాబా అడుగుజాడలో నడుస్తూ అంద్ ఆదివాసీలు సామూహిక వివాహాలు చేపట్టడం ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని దస్నాపూర్ గ్రామంలో గల సంత్ సద్గురు పూలాజీబాబా ధ్యాన్ కేంద్రంలో ఆదివారం సామూహిక వివాహ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అంద్ ఆదివాసీ సేవాసంఘం, గ్రామ సామూహిక వివాహ వేడుక నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 11 నూతన జంటలు ఏకమయ్యాయి. మంత్రి సీతక్కతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి, ఎంపీపీ శోభాబాయి, జెడ్పీటీసీ పుష్పలత, జెడ్పీ కోఅప్షన్ సభ్యుడు మహ్మద్ అంజద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడారు. సామూహిక వివాహాల ద్వారా నిరుపేదల పెళ్లిళ్ల ఖర్చు తగ్గడంతో పాటు గ్రామంలో ఐక్యత పెరుగుతుందన్నారు. నిర్వాహకులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో దస్నాపూర్ గ్రామ పటేల్ కోటుడే పుండలిక్, అంద్ ఆదివాసీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖడే విష్ణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాడే మారుతి, అంద్ ఆదివాసీ సమాజ్ పెద్దలు వామన్రావ్, రాందాస్, దశరథ్, పాండురంగ్, ముఖడే ఉత్తం, సాయినాథ్, కేశవ్, ఆయా పార్టీల నాయకులు, బంధువులున్నారు.హాజరైన బంధువులు దస్నాపూర్లో ఒక్కటైన 11 జంటలు వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క -
ఓటు వినియోగంపై వినూత్న అవగాహన
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూ చిపూడి నృత్య శిక్షణ పొందుతున్న చిన్నారులు ఓటు హక్కు వినియోగంపై ఆదివారం వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. స్థానిక శ్రీరామచంద్రా గోపాలకృష్ణమఠం ఆవరణలోని శిక్షణ శిబిరంలో శిక్షకురాలు గండ్రత్ అవంతిక ఆధ్వర్యంలో చిన్నారులు ఓటు (వీఓటీఈ) ఆకారంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా అవంతిక మాట్లాడుతూ అర్హులంద రూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ రోజైన మే 13న ఇంట్లో ఉన్న ప్రతి చిన్నారి తమ కుటుంబ సభ్యులను ఓటువేసేలా చూడాలని కోరారు. అందరితో ఓటు వేయించి, అనంతరం కుటుంబ సభ్యులతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్చేసేలా చూడాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఉదయం పూటనే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
No Headline
క్లుప్తంగానేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబా ద్ జిల్లాల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, 6వ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచా రి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్ట ర్ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సా యంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సెమిస్టర్ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్కు 56,899, ఆరో సెమిస్టర్కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఉమ్మడి వరంగల్లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఓక్కో సెంటర్కు ఒక అజ్జర్వర్, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. హాల్టికెట్లు కళాశాలల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అధిక మెజార్టీ
నర్సింహరెడ్డిదే● అత్యధికం 1,81,955 అత్యల్పం 5,912 ● ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల మెజార్టీ తీరు ● ఏడవ లోక్సభ ఎన్నికల్లో నమోదుగడ్డం నర్సింహరెడ్డికై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజ కవర్గానికి ఒక ఉప ఎన్నికతో కలిపి ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 12 మంది ఎంపీలుగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తమ పని తీరుతో ప్రజలను ఆకట్టుకుని పలుమార్లు విజయం సాధించారు. అయితే 1980లో జరిగిన ఏడవ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) పార్టీ అభ్యర్థి జి.నర్సింహరెడ్డి సాధించిన మెజార్టీ యే అత్యధికం. కాగా ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది. ఆ ఎన్నికల్లో నర్సింహరెడ్డికి 2,34,300 ఓట్లు రాగా, జే ఎస్పీ అభ్యర్థి పి.రాజేశ్వర్రా వు 52,345 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో ఆయనపై 1,81,955 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ● ఇక అత్యల్ప మెజార్టీ 1957లో జరిగిన రెండో లోక్సభ ఎన్నికల్లో నమోదైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల ఆశన్న 91,287 ఓట్లు రా గా, పబ్లిక్ సోషలిస్టు పార్టీ అభ్యర్థి సి.మాధవరెడ్డి కి 85,375 ఓట్లు వచ్చాయి. దీంతో ఆశన్న 5,912 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజార్టీగా నమోదైంది. ఇక ఎన్నికలవారీగా నమోదైన మెజార్టీలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ● 1952లో జరిగిన తొలి ఎన్నికలో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి చెరుకు మాధవ్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జేవీ నర్సింగ్రావుపై 25,083 ఓట్ల అఽధిక్యంతో గెలు పొందారు. మాధవరెడ్డికి 90,995 ఓట్లు రాగా, నర్సింగ్రావుకు 65912 ఓట్లు పోలయ్యాయి. ● 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.నారాయణరెడ్డికి 1,29,068 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన విజి. దొరసామి 39,983 ఓట్లు వచ్చాయి. 89,085 ఓట్ల అధిక్యంతో నారాయణరెడ్డి విజయం సాధించారు. ● 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.గంగారెడ్డికి 1,60,494 ఓట్లు రాగా, సీపీఐ అభ్యర్థి డీ ఎస్ రావుకు 86,244 ఓట్లు వచ్చాయి. దీంతో 74,250 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించా రు. అలాగే 1971లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు 1,51,482 ఓట్లు రాగా టీపీఎస్ అభ్యర్థి కేవి.కిషన్రావుకు 1,36, 532 ఓట్లు వచ్చాయి. 14,950 ఓట్ల అధిక్యంతో మరోసారి ఎంపీగా గెలుపొందారు. ● 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు న పోటీచేసిన జి.నర్సింహరెడ్డికి 1,67,410 ఓట్లు రాగా, బీఎల్డీ అభ్యర్థి గోపిడి గంగారెడ్డి 96,244 ఓట్లు వచ్చాయి. దీంతో 71,166 ఓట్ల అధిక్యంతో ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ● 1984లో టీడీపీ అభ్యర్థి సి.మాధవరెడ్డికి 2,38,440 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహరెడ్డికి 1,83,882 ఓట్లు వచ్చాయి. 54,558 ఓట్ల అధిక్యంతో మాధవరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ● 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.నర్సారెడ్డి చేతిలో 44,365 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి సి.మాధవరెడ్డి పరాజయం పాలయ్యా రు. ఈ ఎన్నికల్లో నర్సారెడ్డికి 2,90,072 ఓట్లు రా గా, సి.మాధవరెడ్డికి 2,45,707 ఓట్లు వచ్చాయి. ● 1996లో జరిగిన ఎన్నికల్లో ఎస్. వేణుగోపాలాచారి 2,86,477 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి 1,49,117, ఓట్లు వచ్చాయి. దీంతో 1,37,360 ఓట్ల అధిక్యంతో చారి విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో చారికి 2,91,168 ఓ ట్లు రాగా, ఐకే రెడ్డికి 2,57,634 ఓట్లు వచ్చాయి. దీంతో మరోసారి చారి 33,534 ఓట్ల అధిక్యంతో రెండోసారి ఎంపీగా గెలిచారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సుల్తాన్ అహ్మద్పై టీడీపీ అభ్యర్థి చారి 1,10,023 ఓట్ల అధిక్యంతో మూడోసారి విజ యం సాధించారు. టీడీపీకి 3,90,308 ఓట్లు రా గా, కాంగ్రెస్ పార్టీకి 2,80,585 ఓట్లు వచ్చాయి. ● 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేణుగోపాలాచారిపై టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 40,974 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 4,15,429 ఓట్లు రాగా, టీడీపీకి 3,74,455 ఓట్లు పోలయ్యాయి. ● రెండుసార్లు టీడీపీ అభ్యర్థి వేణుగోపాలాచా రి చేతిలో ఓటమి పాలైన ఇంద్రకరణ్రెడ్డి 2008లో జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి చారిని ఓడించారు. ఈ ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి 3,23,109 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి వేణుగోపాలా చారికి 2,67,139 ఓట్లు వచ్చాయి. దీంతో ఇంద్రకరణ్రెడ్డి 55,970 ఓట్ల అధిక్యంతో టీడీపీపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 1,44,455 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. ● 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కొట్నాక్ రమేశ్పై టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 1,15,087 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 3,72,268 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్కు 257181 ఓట్లు వచ్చాయి. ● 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ కాంగ్రెస్ అభ్యర్థి నరేశ్ జాదవ్పై 1,71,290 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. నగేశ్కు 4,30,847 ఓట్లు రా గా, నరేశ్జాదవ్కు 2,59,557 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి రమేశ్ రాథోడ్ 1,84,198 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు. ● 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సో యం బాపూరావు బీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్పై 58,560 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు.ఎన్నికల్లో బీజేపీకి 3,77,374 ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 3,18,814 ఓట్లు పోలయ్యాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement