-
హెచ్బీఐఎస్ గ్రూపుతో టాటా స్టీల్ కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: టాటా స్టీల్ ఆగ్నేయ ఆసియాలోని తన వ్యాపారాల్లో మెజారిటీ వాటాను చైనాకు చెందిన హెచ్బీఐఎస్ గ్రూపునకు విక్రయించనుంది. ఇందుకు సంబంధించి హెచ్బీఐఎస్ గ్రూపు కంపెనీతో టాటా స్టీల్ అనుబంధ కంపెనీ టీఎస్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్లోని నాట్స్టీల్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్, టాటా స్టీల్ (థాయ్లాండ్) పబ్లిక్ కంపెనీ లిమిటెడ్లో 70% వాటాలను హెచ్బీఐఎస్ గ్రూపు కంపెనీకి 480 మిలియన్ డాలర్ల(రూ.3,408 కోట్లు) మొత్తానికి విక్రయించనుంది. ఇందులో టాటా స్టీల్కు 327 మిలియన్ డాలర్ల మేర నగదును హెచ్బీఐఎస్ గ్రూపు కంపెనీ చెల్లిస్తుంది. మరో 150 మిలియన్ డాలర్ల మేర రుణ భారాన్ని తనకిందకు తీసుకుంటుంది. దేశీయ మార్కెట్పై ప్రధానంగా దృష్టి సారించాలన్న టాటా స్టీల్ వ్యూహంలో భాగమే ఈ విక్రయ ఒప్పందం. ఈ ఒప్పందం తర్వాత కూడా సదరు రెండు కంపెనీల్లో టాటా స్టీల్కు 30% వాటా ఉంటుంది. ఓ ప్రత్యేక కంపెనీకి ముందుగా టాటా స్టీల్ తన కంపెనీల్లోని 100% వాటాలను బదలాయిస్తుంది. ఆ కంపెనీలో టాటా స్టీల్కు 30%, హెచ్బీఐఎస్ గ్రూపు కంపెనీకి 70 శాతం వాటా ఉంటుంది. -
రతన్ టాటాకు కొత్త చిక్కు!
టాటా స్టీల్ యూకే మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై యూకే ట్రేడ్ యూనియన్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సంస్థ తీసుకున్న వైఖరిపై తన అభిప్రాయం ఏమిటో స్పష్టంచేయాలని టాటా గ్రూప్ చైర్మన్ రతన్టాటాను నేషనల్ ట్రేడ్ యూనియన్ స్టీల్ కోఆర్డినేటింగ్ కమిటీ(ఎన్టీయూఎస్సీసీ) ఆదేశించింది. శుక్రవారం ఇదే విషయంపై ఎన్టీయూఎస్సీసీ టాటా స్టీల్ యూకే మేనేజ్మెంట్తో భేటీ అయింది. పెన్షన్ స్కీమ్లో మార్పులు, కంపెనీ భవిష్యత్తు మూలధన పెట్టుబడుల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆఫీసర్లు పేర్కొన్నారు. దీన్ని ట్రేడ్ యూనియన్లు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించవని ఎన్టీయూఎస్సీసీ తెలిపింది. యూకే స్టీల్ వ్యాపారాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ మంచి పెన్షన్ ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ భారీ పరిశ్రమలో ఎంతో కష్టించి పనిచేసిన తమకు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రామాణికమైన జీవనం గడిపేందుకు, ప్రశాంతంగా ఉండేందుకు కంపెనీ పెన్షన్ స్కీమ్ను కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. యూకే బిజినెస్ వ్యవహారాల్లో రతన్ టాటా తీసుకోబోయే వ్యూహాత్మకంగా నిర్ణయాలను స్పష్టంచేయాలని ట్రేడ్ యూనియన్లు పేర్కొంటున్నాయి. ఏడు నెలలకు పైగా ఈ వ్యాపారాల్లో పనిచేసే ఉద్యోగులు, వారి జీవనోపాధి, కుటుంబాల పరిస్థితి గురించి ఏదో తెలియని భయంతోనే పనిచేస్తున్నారని, ఇది ఇలానే కొనసాగకూడదని ఎన్టీయూఎస్సీసీ తెలిపింది. నష్టాల్లో ఉన్న యూకే వ్యాపారాలను అమ్మివేస్తున్నట్టు టాటా స్టీల్ మార్చిలో ప్రకటించింది. అయితే ఆ డీల్ సైరస్ మిస్త్రీ ఆధ్వర్యంలో జరిగింది. సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా చైర్మన్ పదవి నుంచి తీసివేయడంతో , తమ ఉద్యోగ భద్రతపై హామీ ఇవ్వాలని యూకే ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. టాటా స్టీల్ వ్యాపారాలను విక్రయించడమే మిస్త్రీ తొలగింపుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement