-
ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు పార్టీ కూడా మారారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. భంగపడ్డ నేతలు పార్టీకి వ్యతిరేకంగా అడుగు వేస్తారా? కలిసి నడుస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇక టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హస్తం’ నేతలు అలక వీడేదెప్పుడో! ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్లో చేరారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హస్తం నాయకత్వం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాగా, టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్జాదవ్ ఇంకా ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేయనున్నారు. ఇదేరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఆదిలాబాద్ పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం సమావేశం కానుండగా, అప్పటికైనా నేతలు అలక వీడుతారో.. లేదో వేచి చూడాలి. కమలంలో ‘తిరుగుబాటు’ తప్పదా? బీజేపీ గోడం నగేశ్కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో అసమ్మతి చోటుచేసుకుంది. ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో చేరారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సైలెంట్గా ఉన్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయి ఆరోజు ఆదిలాబాద్కు రానున్నారు. పార్టీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు పార్టీలో నిరాశ ఎదురు కాగా బీజేపీ రెబెల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 24న ఆయన కూడా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీ–ఫాం అందుకున్న సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరు ఖరారై చాలా రోజులైంది. ఓ దశలో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత గందరగోళం కనిపించింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా అభ్యర్థి మార్పు లేదని స్పష్టమైంది. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆత్రం సక్కు బీ–ఫాం అందుకున్నారు. ఈ నెల 23న లేదా 24వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఆధార్) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్ శ్యామ్లాల్నాయక్ నామినేషన్ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పకడ్బందీ బందోబస్తు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వంద మీటర్ల పరిధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశా రు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంట ల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా కలెక్టరేట్కు వెళ్లే రోడ్డుమార్గాన్ని మూసివేసి ట్రా ఫిక్ను మళ్లించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలు క్షుణ్ణంగా తని ఖీ చేసి ఐదుగురినే లోనికి అనుమతించారు. గడవు ముగిసేవరకూ ముగ్గురు సీఐలు అ క్కడే విధులు నిర్వహించారు. ఆదిలాబాద్ డీ ఎస్పీ జీవన్రెడ్డి బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్ను వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. ఇవి చదవండి: TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్.. ఈసీ కీలక నిర్ణయం -
నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ.. ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ 94 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్లోని భగవాన్గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
జిల్లా కేటగిరీ పోస్టులకు 1:3 నిష్పత్తి!
సాక్షి, హైదరాబాద్: నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్–4 ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఉన్నా యి. దాదాపు 9 వేల ఉద్యోగాలుండగా... వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్మూలానే అమలు చేయనున్నారు. దీంతో పాటు జిల్లాస్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకూ ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు సమాచారం. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తోంది. ఇక జోనల్, మలీ్టజోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మథనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆమేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)లను కూడా కమిషన్ విడుదల చేసింది. జీఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్స్థాయి, మలీ్టజోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్ఎస్ఆర్బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. నోటిఫికేషన్లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యరి్థకి రెండు, అంతకేంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం: టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)లను కూడా కమిషన్ విడుదల చేసింది. జీఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్స్థాయి, మలీ్టజోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్ఎస్ఆర్బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. నోటిఫికేషన్లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యరి్థకి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement