-
మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..!
మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్ను 'ఎంపాక్స్' అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. మరో ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగిస్తారు. డబ్ల్యూహెచ్ఓ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పేరు మార్పు ఎందుకు? ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్లైన్లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్ఓ కొత్తపేరును ఖరారు చేసింది. చదవండి: 3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా.. -
అప్పుడే అయిపోలేదు.. మంకీపాక్స్పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు. అయితే మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ అని టెడ్రోస్ హెచ్చరించారు. అమెరికా సహా 21 దేశాల్లో గతవారం కొత్త కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికాలోనే 90శాతం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల్లో అమెరికాలోనే అత్యధికంగా 42వేల కేసులు వెలుగుచూశాయి. యూరప్ దేశాల్లో 25వేల మందికి ఈ వైరస్ సోకింది. భారత్లో ఇప్పటివరకు 14మంది మంకీపాక్స్ బారినపడ్డారు. చదవండి: ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్కే! -
చైనా ఆలోచనే డిఫరెంట్.. జిన్పింగ్ సర్కార్ను తిట్టిపోస్తున్న చైనీయులు!
బీజింగ్: మంకీపాక్స్ వైరస్ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ప్రజలకు చైనా వైద్య నిపుణులు సూచించారు. విదేశీయులను, విదేశాల నుంచి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని చెప్పారు. చైనాలోని తొలి మంకీపాక్స్ కేసు చాంగ్ఖింగ్ సిటీలో శుక్రవారం బయటపడింది. ఈ నేపథ్యంలో చైనాలో పేరుగాంచిన అంటువ్యాధుల నిపుణుడు వూ జున్యూ పలు సూచనలు జారీ చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్టు వల్ల మంకీపాక్స్ సోకుతుందని, అందుకే విదేశీయులను, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ముట్టుకోవద్దని తెలియజేశారు. అయితే, వూ జున్యూ సూచనలపై చైనాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవి జాత్యహంకారాన్ని, జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని జనం విరుచుకుపడుతున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. చైనాలో ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, చైనాలో ఇటీవల మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి ఇక్కడి చాంగ్క్వింగ్ నగరానికి చేరుకున్న ఓ వ్యక్తి.. కొవిడ్తో క్వారంటైన్లో ఉన్న సమయంలోనే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విదేశీయులను తాకవద్దంటూ సూచనలు చేశారు. Chief epidemiologist at the Chinese Centre for Disease Control and Prevention, Wu Zunyou, warned people not to touch foreigners after mainland China confirmed its first case of #monkeypox infectionhttps://t.co/enlrbXRqzc — IndiaToday (@IndiaToday) September 19, 2022 -
ఢిల్లీని వణికిస్తున్న మంకీపాక్స్.. 24ఏళ్ల మహిళకు పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశ రాజధానిలో ఈ వ్యాధి బాధితుల సంఖ్య 7కు పెరిగింది. నైజీరియాకు చెందిన 24 ఏళ్ల మహిళ నాలుగు నెలలుగా ఢిల్లీలోని శారదా విహార్లో ఉంటోంది. ఇటీవలే జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో లోక్నాయక్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్కు పంపగా.. రిపోర్టులో మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. వెంటనే బాధితురాలితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని లోక్నాయక్ ఆస్పత్రిలో ఇప్పటివరకు మొత్తం ఏడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ముగ్గురు పురుషులు కాగా.. నలుగురు మహిళలు. ఏడుగురిలో ఆరుగురు నైజీరియాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒక్కరు మాత్రమే ఢిల్లీ వాసి. అయితే ఏడుగురు బాధితుల్లో ఐదుగురు ఇప్పటికే కోలుకున్నారు. మిగతా ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కేరళలో ఇప్పటివరకు ఐదు మంకీపాక్స్ కేసులు నమొదయ్యాయి. చదవండి: భారత్ జోడో యాత్రలో రాహుల్కు పెళ్లి ప్రపోజల్! -
అమెరికాలో మంకీపాక్స్ కలవరం.. 30 మంది చిన్నారులకు సోకిన వైరస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి. వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క టెక్సాస్లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు. ఆ తర్వాత న్యూయార్క్లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే ఈ కేసులు వెలుగుచూశాయి. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement