-
'కన్నప్ప' కోసం స్టార్ హీరోను దింపిన మంచు విష్ణు.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' కోసం భారత దిగ్గజ నటలను దింపుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీల స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశాడు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో ఆయన పంచుకున్నాడు. మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం రూపొందుతోంది. 'కన్నప్ప' పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. ఈ బిగ్ ప్రాజెక్ట్లో ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీ మంచి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లయింది. కన్నప్ప సినిమాతో అక్షయ్ కుమార్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. 1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించిన అక్షయ్ ఆ తర్వాత 2018లో రజినీకాంత్ రోబో2.0 సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్ని లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఓ మై గాడ్ 2లో ఇలాంటి పాత్రలో కనిపించిన అక్షయ్ భేష్ అనిపించుకున్నాడు. దీంతో కన్నప్పకు బాలీవుడ్లో మంచి మార్కెట్ వస్తుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కల్కి సినిమాలో శ్రీవిష్ణువు అంశతో కూడిన భైరవగా ప్రభాస్ కనిపించనున్నాడు.. ఇలాంటి సమయంలో కన్నప్పలో మహాశివుడిగా కనిపిస్తే ఇబ్బందవుతుందని భావించిన ప్రభాస్.. మంచు విష్ణును రిక్వెస్ట్ చేసి మార్పులు చేయాలని కోరాడట. దీంతో శివుడి పాత్ర కోసం వేట కొనసాగించిన మంచు విష్ణుకు అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని ప్లాన్ చేశాడట. అలా టాలీవుడ్లోకి తాజాగా అక్షయ్ ఎంట్రీ ఇచ్చేశాడు. త్వరలో షూటింగ్ జరుగుతుందని విష్ణు ప్రకటించాడు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
ఆ దేవుడి ఆశీస్సులతో సీఎం త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత నూతన శక్తితో తిరిగిరావాలని కోరారు. రాబోయే రోజుల్లో మీ పనులను మళ్లీ విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఎన్నికల ప్రచారంలో గాయపడిన సీఎం వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలి. షిర్డీ సాయి బాబా, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉంటాయి. మీరు త్వరగా కోలుకోవాలని తిరిగి రావాలి. మరింత నూతన ఉత్సాహంతో మీ విధులను పునఃప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వడంతో గాయపడిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సైతం సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు విష్ణు ట్వీట్ చేశారు. Sending my best wishes to @ysjagan anna for a speedy recovery after last night's unfortunate incident. Hoping for his quick healing and return to good health. 🙏 — Vishnu Manchu (@iVishnuManchu) April 14, 2024 Wishing Sri @ysjagan a swift recovery from the injury sustained during campaigning. With the. Blessings of Shirdi Sai Baba and Lord Venkateshwara, May you heal quickly and resume your duties with renewed strength. — Mohan Babu M (@themohanbabu) April 14, 2024 -
నా మాటలు అపార్థం చేసుకున్నారు.. కానీ మా నాన్న: మంచు మనోజ్
మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్. ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే తన తండ్రి మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో ఏర్పాటు సమావేశంలో పొలిటికల్ కామెంట్స్ చేశారు. మంచి చేసే వాళ్లకే ఓటేయండి అంటూ యువతకు సలహా ఇచ్చారు మంచు మనోజ్. అయితే అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా మంచు మనోజ్ వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మిత్రులకు, శ్రేయోభిషులకు, మీడియా సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించాలనుకుంటున్నా. నా తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో నేను చెప్పిన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారు. దానిపైనే స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్లో నా ప్రసంగం చుట్టూ కొంత గందరగోళం ఏర్పడింది. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్లో సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వేదికపై ఉన్నప్పుడే అంతరాయం కలిగింది. అందుకే నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయి. ఈ పాక్షిక సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని' అని అన్నారు. నా ప్రసంగంలో ఏ రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టంగా చెబుతున్నా. నా సందేశం కేవలం ఐక్యత, అవగాహనతో సార్వత్రిక విలువలను ప్రోత్సహించడమే లక్ష్యం. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నా. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. పూర్తి అవగాహన కోసం నా ప్రసంగాన్ని ఎవరైనా పూర్తిగా వీక్షించడానికి నా ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశా. ఒక సినిమా నటుడిగా, సినిమా మాధ్యమం ద్వారా ఏకం చేయడం, వినోదం అందించడం నా ముందున్న లక్ష్యం. మీ మద్దతు, నా కుటుంబం, నా పట్ల మీరు చూపే అపారమైన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. కులం, మతం, మతానికి అతీతమైన వసుధైక కుటుంబం విలువలను మా నాన్న నేర్పించారు. ఒక కుటుంబంగా దానిని మేము విశ్వసిస్తాం. మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని పోస్ట్ చేశారు. మనోజ్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్ వివాదానికి దారితీయడంతో ట్వీట్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. Dear Friends, Well-wishers, and Esteemed Members of the Press, I hope this message finds you all in good spirits and health. I wish to address recent events and clarify misunderstandings stemming from my Father’s Birthday Celebrations. Firstly, I want to address the confusion… — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 21, 2024 -
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్బాబు పుట్టినరోజు, మోహన్బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మళ్లీ షురూ అయింది. తాజాగా న్యూజిలాండ్లో రెండో షెడ్యూల్ను ప్రారంభించారు. ఇప్పటికే 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. కాస్తా గ్యాప్ తర్వాత కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు తాజాగా షూటింగ్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన తండ్రి మోహన్ బాబు, విష్ణు మంచు వీడియోలో కనిపించారు. ఈ షెడ్యూల్లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కన్నప్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు. న్యూజిలాండ్, థాయ్లాండ్, ఇండియాకు చెందిన ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. The second schedule of #Kannappa in #NewZealand is in full swing !!@iVishnuManchu #Prabhas #Vishnu pic.twitter.com/UQ67xfJVCS — Aryan (@chinchat09) February 28, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement