-
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజం కోరుకునే మొత్తం 23 అంశాలతో లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర మేనిఫెస్టోను రూపొందించామని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడం సహా వివిధ హామీలు అమలు చేస్తామని తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పాంచ్న్యాయ్, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్, ఆల్దాసు జానయ్య, వినోద్కుమార్, కమలాకర్రావు, అనంతుల శ్యాంమోహన్, లింగం యాదవ్, కప్పర హరిప్రసాదరావు, పార్టీ నేతలు మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేక మేనిఫెస్టో విడుదల సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నీతి ఆయోగ్ కార్యాలయాన్ని హైదరాబాద్లో పెట్టాలని నిర్ణయించామన్నారు. అలాగే పలు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని, ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చా రు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శ్రీధర్బాబు విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తెలంగాణకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టామని చెప్పారు. అనంత రం దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలిచి రాజ్యాంగా న్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
చిలకలపూడి (మచిలీపట్నం): ఇటీవల చంద్రబాబు, పవన్కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవటం.. ఇప్పుడు టీడీపీ తరఫున పత్రికల్లో ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్స్లో పవన్కళ్యాణ్ ఫొటో లేకపోవటం చంద్రబాబు దగాకోరు విధానానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అడ్వరై్టజ్మెంట్లో రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్న హామీ కూడా లేకపోవటం చంద్రబాబు మాయమాటలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమి అధినేతల ఫొటోలు మాయమవడంతో పాటు హామీలను కూడా మాయం చేసే చంద్రబాబును ప్రజలు దగాకోరుగా అభివర్ణిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకముందే మోసం మొదలైందని చెప్పుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ హామీలనూ తుంగలోకి తొక్కిన ఘనుడు బాబు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేదం హామీలను అమలు చేస్తే.. కుట్రలు పన్ని, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.50 చేయటంతో పాటు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని పేర్ని నాని గుర్తు చేశారు. 1999లో ఇచ్చిన మేనిఫెస్టోలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ప్రతి పాఠశాలకు పక్కా భవనం నిరి్మస్తామని, మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.. ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు ఆశకు హద్దుండాలని వ్యాఖ్యానించటం ఆయనకే చెల్లిందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్కు మాత్రమే జాబు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, పవన్కళ్యాణ్తో కూటమి కట్టిన చంద్రబాబు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఆటలో అరటిపండులా వదిలేశాడన్నారు. ఎంతటి వారినైనా మోసం చేసే గుణం చంద్రబాబుకే ఉందన్నారు. ఇటువంటి చంద్రబాబు మాయమాటలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గ్రహించి నక్కజిత్తుల మాటలు నమ్మకుండా ఆలోచించాలన్నారు. వైఎస్ జగన్ అంటే నడిచే నమ్మకంగా చంద్రబాబు మాటలు అపనమ్మకంగా భావించి చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలని కోరారు. మే 13న చంద్రబాబుకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా తీర్పును ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయనీయ పరిస్థితిలో పింఛన్ లబ్దిదారులు చంద్రబాబు, ఆయన బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుట్రల కారణంగా పింఛన్ లబ్దిదారులు దయనీయ స్థితిలో ఉన్నారని పేర్ని నాని అన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి పింఛన్ లబ్దిదారులు గడప దాటేలా చేశారన్నారు. బ్యాంకులకు వెళ్లిన లబి్ధదారులకు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను కట్చేసి పింఛన్లు ఇస్తుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబుకు 66 లక్షల మంది పింఛన్దారుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. -
మోసాల బాబు మరో అబద్ధం..
సాక్షి, అమరావతి: నిజం చెప్పకపోవడం.. మాటమీద నిలబడకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం. అందుకే ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీసారి అలవోకగా ఎడాపెడా హామీలిచ్చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటివి ఎన్నో ప్రకటించారు. అందులో మూడ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ‘స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు’ అన్న ఓ అబద్ధపు హామీ కూడా ఇలాంటిదే. నిజానికి.. ఇది ఏ విధంగా చూసినా ఆచరణ సాధ్యంకాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ స్థాయిలో రాష్ట్రంలోని 82.29 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో భారీ మొత్తాన్నే ఈ ఒక్క పథకానికే ఖర్చుచేయాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని వారు వట్టి మాటగా కొట్టిపడేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో చెబుతూ ఏటా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) కింద నివేదికను అందజేస్తుంటాయి. దీని ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో 1–10 తరగతుల్లో 71,77,637 మంది, ఇంటర్మీడియట్లో 10,52,221 మంది కలిపి మొత్తం 82,29,858 మంది విద్యార్థులున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి అక్షరాలా రూ.1,23,44,78,70,000లు అవసరమవుతుంది. సులభంగా చెప్పాలంటే రూ.1,234 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఏటా అమ్మఒడి కింద రూ.6,452 కోట్లు ఖర్చుచేస్తుండగా, దీనికి రెండింతలు ఇస్తానని చంద్రబాబు అలవోకగా ఓ అందమైన అబద్ధపు హామీని ఇచ్చిపడేశారు. ప్రభుత్వ విద్యపై చంద్రబాబు కక్ష.. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు చంద్రబాబునాయుడు కొమ్ముకాశారు. 2014–19 మధ్య సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని, వాటిని కల్పించే పరిస్థితి లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ప్రకటించారు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం ఒక ఎత్తయితే.. 117 జీఓను రద్దుచేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు విద్యకు దూరం కావడం ఖాయం. ఇక గతంలో ఒక స్కూలుకు మంజూరైన పోస్టులను పిల్లలున్నా లేకున్నా కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ, జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం బడిలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నేపథ్యంలో.. తక్కువ విద్యార్థులు, ఎక్కువమంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ఎక్కువ విద్యార్థులున్న స్కూలుకు వారిని బదిలీ చేసేందుకు వీలుగా 2022 జూన్లో జీఓ–117 తీసుకొచ్చింది. దీంతో పోస్టులను రద్దుచేయకుండా అదనపు ఉపాధ్యాయులను ఎక్కువమంది పిల్లలున్న స్కూలుకు బదిలీ చేయవచ్చు. పేద విద్యార్థులకు ఎంతో మేలుచేసిన ఈ జీఓను ఉపాధ్యాయ వర్గాలూ స్వాగతించాయి. ఫలితంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులోకి వచ్చారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 117 జీఓను రద్దుచేస్తే.. ప్రభుత్వ విద్య నాశనం కావడంతో పాటు, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసేందుకు ఆస్కారం ఉంది.జగన్ సర్కారులో విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం2019లో ప్రభుత్వం ఏర్పాటుచేశాక సీఎం జగన్ ప్రభుత్వ విద్యపై దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్వాడీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం కరిక్యులమ్లో మార్పులు చేశారు. ఉదా.. » ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తేవడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రభుత్వం ఉచితంగా అందించింది. » ప్రతి పేదింటి బిడ్డను బడికి పంపించాలని, ఇలా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసింది. » విద్యార్థి తప్పనిసరిగా బడిలో ఉండేలా చూసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. » కోవిడ్ రెండేళ్లు మినహా మిగిలిన సంవత్సరాల్లో హాజరును పరిగణనలోకి తీసుకుని నాలుగు పర్యాయాలు రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేసింది.సగటున ఏటా రూ.6,452 కోట్లు జమ ఈ పథకం కింద 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021–22లో 42,62,419 మందికి రూ.6,393.6 కోట్లు, 2022–23 విద్యా సంవత్సరంలో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.9 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.25,809.50 కోట్లు అందించింది. అంటే.. సగటున ఏడాదికి రూ.6,452.37 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే, 2024 మేని ఫెస్టోలో రూ.15వేల అమ్మఒడి మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలుచేయనుంది. కానీ, చంద్రబాబు మాత్రం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఇస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. -
‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
సాక్షి, అమరావతి: వ్యవసాయమే దండగన్న చంద్రబాబు పాలనలో కాలం చెల్లిన ట్రాన్స్ఫార్మర్ల వల్ల వ్యవసాయ మోటార్లు పదే పదే కాలిపోయేవి. సరిగ్గా విద్యుత్ సరఫరా లేక.. నీరు అందక పంటలు ఎండిపోయేవి. అదే చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్ల నాణ్యత పెంచుతానంటూ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా.. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కాపీ కొట్టేసి మరీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంపుసెట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వ్యవసాయంతో పాటు మున్సిపాలిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా విద్యుత్ ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చడం ద్వారా పంపుసెట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. కొత్త సాంకేతికతతో మోటారు తయారీ.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటీరియర్ పరి్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్(ఐపీఎంఎస్ఎం) సాంకేతికతతో ‘ఎనర్జీ ఎఫీషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్’ను ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ తయారు చేసింది. దీని ద్వారా విద్యుత్ను భారీగా ఆదా చేయవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) నిధులతో తొలుత కొన్ని వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్ఎం సాంకేతికత ప్రయోగాత్మక అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చేపట్టింది. ఐపీఎంఎస్ మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయం. పవర్ ఫ్యాక్టర్ మెరుగుదలకు, మోటారు మన్నికను పెంచడానికి దోహదపడతాయి. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లు కాగా.. ఐపీఎంఎస్ మోటారు సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుంది. ఇండక్షన్ మోటారుతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. టీటీడీ, మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ ఆదా పంపుసెట్లు ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ సామర్థ్య సాంకేతికతలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల.. విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీటీడీలోని పాత పంప్సెట్ల స్థానంలో ఈ ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చుతోంది.అలాగే ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వినియోగిస్తున్న మోటార్ల స్థానంలో విద్యుత్ను ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లను అమర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూనుకుంది. దీనిపై మున్సిపల్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయ మోటార్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫీడర్లను ఆధునీకరించింది. వాటి ద్వారా మోటార్లకు వెళ్లే విద్యుత్లో ఇంకా ఏవైనా లోపాలుంటే స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకుని వెంటనే సరిచేయడం ద్వారా పంపుసెట్ల నాణ్యత పెరుగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తుంటే.. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు మోసపూరిత హామీలతో మరోసారి రైతులను, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement