-
వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర
సాక్షి, ఏలూరు (ఆర్ఆర్పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్కుమార్. కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా విజయ్కుమార్ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్ సీఆర్ఆర్ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు. 1975లో రంగస్థల ప్రవేశం 1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 3 నందులు.. 8 గరుడలు.. రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్కుమార్ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర విజయ్కుమార్ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్కుమార్ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్కుమార్ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్కుమార్ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి. – పస్తుల విజయ్కుమార్, రంగస్థల నటుడు -
ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఘన విజయం అందుకున్న వర్మ, ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టుగా భావించారు. కానీ వర్మ చెప్పినట్టుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రారంభించాడు. ఎప్పుడు మొదలైందో.. ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, రేపు(09-08-2019) ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని చెపుతున్నాడు వర్మ. టైటిల్తోనే వివాదానికి తెర తీసిన వర్మ నిజంగా వివాదాలకు తావివ్వకుండానే ఈ సినిమా రూపొందిస్తున్నాడేమో చూడాలి. The most non controversial film “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు " 1st Song trailer release Tmrw Friday 9th at 9 Am — Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2019 -
వస్తానన్నా.. వచ్చా : రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నంత పనీ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కు ఆంధ్ర ప్రదేశ్లో అడ్డంకులు ఎదురుకావటంతో విజయవాడలోని పైపులరోడ్డులో ప్రెస్మీట్ పెట్టేందుకు వర్మ ప్రయత్నించాడు. కానీ పోలీసులు అడ్డుకొని వర్మను అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల ఫలితాల తరువాత కూడా పైపుల రోడ్డులో ప్రెస్మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వర్మ, ఎండ తీవ్రత కారణంగా ఫిలిం చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు. వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్లో విడుదల కానుంది. I finally on Paipula road in Vijaywada garlanded NTR in NTR circle అనుకున్నది చేసేసా.. https://t.co/tJUI7mTCfX 💪💪💪 — Ram Gopal Varma (@RGVzoomin) 28 May 2019 -
పసుపు–కుంకుమ తీసుకుని ఉప్పు–కారం ఇచ్చారు
భీమవరం: ఏపీ మహిళలు పసుపు–కుంకుమ తీసుకుని టీడీపీకి ఉప్పు–కారం ఇచ్చారని ప్రముఖ సినీదర్శకుడు రామ్గోపాల్వర్మ చెప్పారు. ఈ నెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేయగా కొంతమంది అడ్డుకున్నారని.. అందువల్లనే ఎన్టీరామారావు ఆగ్రహించి చంద్రబాబును చిత్తుగా ఓడించారని తెలిపారు. ఏపీలో సైకిల్కు పంక్చరైనందునే తాను కారులో వచ్చినట్టు చమత్కరించారు. ఎన్టీఆర్ జీవితం చివరి అంకంలో జరిగిన ఘటనలను ప్రజలకు తెలియజేసేందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశాను తప్ప తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని వర్మ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏనాడూ తనకున్న పవర్ను దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకోలేదన్నారు. -
ప్రజాసేవ చేయను: వర్మ
సాక్షి, భీమవరం: రాజకీయాల్లోకి రానని, ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సైకిల్ టైరు పంక్చర్ అయింది. అందుకే కారులో వచ్చామ’ని చమత్కరించారు. చంద్రబాబు అసలు స్వరూపం బయట పడుతుందన్న భయంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్కు పంక్చర్ పడిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతులు కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదని స్పష్టం చేశారు. మహర్షి లాంటి సినిమాను మహేష్బాబు లేకుండా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో త్వరలో సినిమా చేయబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్లో విడుదలకానుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement