-
హైదరాబాద్పై కుట్ర
ముషీరాబాద్, ఉప్పల్, లింగోజిగూడ: విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్పై కుట్ర జరుగుతోందనీ, జూన్ 20 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి లూటీ చేయాలని బీజేపీ యతి్నస్తోందనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు (కేటీఆర్) ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాడు కేవలం ఐదు ఎంపీ సీట్లతోనే తెలంగాణ సాధించామనీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు కేసీఆర్ చేతిలో పెడితే ఢిల్లీ మెడలు వంచి ఆర్నెల్లు తిరగకుండానే తెలంగాణలో అనూహ్య మార్పులు తీసుకువస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం రాంనగర్ చౌరస్తా సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా జరిగిన రోడ్షోలో, ఉప్పల్ రింగ్ రోడ్డులో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో, అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ఘాట్లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలయ్యాయా? కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. గ్యారెంటీలు అమలయ్యాయా అంటూ సభకు విచ్చేసిన ప్రజలను అడగగా అమలు కాలేదంటూ జవాబిచ్చారు. హైదరాబాద్లో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా.. అని ఆలోచించుకోవాలని సూచించారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే బీజేపీ ధరలు పెంచుడు తప్ప పదేళ్లల్లో చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. అభివృద్ధి ఎక్కడ అని అడిగితే గుడి కట్టినం అంటున్నారు.. ఓటు ఎందుకు వేయాలని అడిగితే నమో అని అంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాత్రం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.70 రూపాయలు ఉన్న పెట్రోల్ రూ.110 అయిందని ఈసారి బీజేపీని గెలిపిస్తే రూ.400 దాటుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర కూడా తగ్గాలి కానీ రోజురోజుకూ పెట్రోల్ రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. తన ఆరోపణలు తప్పయితే రాజీనామా చేసి మీ ముఖాన కొట్టి పోతానని సవాల్ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల తరువాత వారి ఉసే ఉండదన్నారు. రాహుల్ అమాయకుడే రాహుల్ గాంధీ అమాయకుడనీ, రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయనకేమీ తెలియదని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రాసి ఇచ్చింది మాత్రమే చదవుతు న్నారని కేటీఆర్ అన్నారు. నిర్మల్ సభలో రాహుల్ గాం«దీతో మొత్తం అబద్ధాలే చెప్పించారని, అమలు చేయని పథకాలు కూడా అమలు చేసినట్లు అయన తో చెప్పించడం దురదృష్టకరమన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న పక్కా సమాచారం తనకుందని పేర్కొన్నారు.ఇవాళ మా ఇంట్లో 5 సార్లు కరెంటుపోయింది రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా కరెంట్ పోలేదనీ కానీ ఇప్పుడు ఎప్పుడు పడి తే అప్పుడు కరెంట్ పోతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు మాఇంట్లో కూడా 5సార్లు కరెంట్ పోయింది.. ఇదీ పరిస్థితి’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ వచి్చంది కరెంటు పోయింది’’అన్నచందంగా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించగా, కొంత మంది లాంతర్లు పట్టుకుని చూపించారు. -
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: చీరకట్టుకొని జూబ్లీహిల్స్లో బస్ ఎక్కి టికెట్ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్రెడ్డి మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఆదివారం(మే5) ట్వీట్ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్ రేవంత్కు చురకలంటించారు. -
చిల్లర మాటలు.. ఉద్దెర పనులు
సిరిసిల్ల/సుభాష్నగర్, రసూల్పుర (హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి పాలన చిల్లర మాటలు.. ఉద్దెర పనులు అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ‘మోసపోతే గోస పడతామని కేసీఆర్ ముందే చెప్పారు.. ఇప్పుడు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. బతుకమ్మ చీరలు లేవు.. రైతుబంధు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో దరిద్రం అడుగుపెట్టినట్లు అయ్యింది..’ అని ధ్వజమెత్తారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుండి 12 సీట్లు ఇస్తే ఆరు నెలల నుండి సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు వస్తుందని చెప్పారు. కేటీఆర్ శనివారం సిరిసిల్లలో, హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్లోని షాపూర్, నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.హామీలేమో కానీ లూటీలు షురూకేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు లేవని, ప్రస్తుతం హైదరాబాదులో కరెంటు కోతలు ప్రారంభమై ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు, జనరేటర్లు కనపడుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500, పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మోసపు హామీలు ఇచ్చి రేవంత్రెడ్డి ఓట్లు వేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీకి తేదీలు మార్చుతున్నాడని, ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాడని విమర్శించారు.కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, నాలుగు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యి లక్ష తులాల బంగారం రేవంత్ బాకీ పడ్డాడని అన్నారు. గ్యారంటీల అమలు పక్కన పెడితే కాంగ్రెసోళ్లు లూటీలు చేయడం చాలూ అయ్యిందని, లూటీ చేయడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కొత్త పరిశ్రమలు తేవడం ఏమో కానీ ఉన్న పరిశ్రమలు గుజరాత్, చెన్నై తరలిపోతున్నాయన్నా రు. ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త జిల్లాలపై స్పష్టత ఇవ్వాలిపరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకు న్నామని, కొన్ని జిల్లాలకు జయశంకర్ (భూపాలపల్లి), కొమురంభీం (ఆసిఫాబాద్) లాంటి మహానుభావుల పేర్లు పెట్టుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కొత్త జిల్లాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, 33 జిల్లాల్లో ఏ జిల్లాలను ఉంచుతారో, ఏ జిల్లాలను తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీజేపీని నమ్మి మోసపోవద్దుకొందరు దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ ఆధునిక దేవాలయాలైన జలాశయాలను నిర్మించి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టారని కేటీఆర్ చెప్పారు. యాదాద్రిని కట్టించిన కేసీఆర్ ఏనాడూ దేవుడి పేరును ఓట్లకు వాడుకోలేదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఛోటే భాయ్.. ప్రధాని మోదీ బడే భాయ్ అని ఎద్దేవా చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇంతవరకు ఏమీ చేయలేదన్నారు.పదేళ్లలో హైదరాబాద్కు రూపాయి ఇవ్వలేని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రజల్లో మతం చిచ్చుపెట్టే బీజేపీని నమ్మి మోసపోవద్దని కోరారు. ‘రాష్ట్రంలో చెయ్యి విరగాలి.. పువ్వు వాడాలి.. కారు జోరు కొనసాగాలి..’ అని కేటీఆర్ కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కంటోన్మెంట్లో ఐదుసార్లు దివంగత ఎమ్మెల్యే సాయన్నను ఆదరించినట్లుగానే ఈసారి జరిగే ఎన్నికల్లో సాయన్న బిడ్డ నివేదితను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఒకే ఏడాదిలో తండ్రిని, చెల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నివేదితను గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. -
ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు
అడ్డగుట్ట, బన్సీలాల్పేట్, నాంపల్లి: లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు బీఆర్ఎస్కు వస్తే ఏడాది లోపే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్లో, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బన్సీలాల్పేట్ కమాన్ వద్ద, నాంపల్లి నియోజకవర్గం నోబుల్ టాకీస్ చౌరస్తాలో జరిగిన రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిందేమీ లేదని, ఇక చేసేది కూడా ఏమీ లేదని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. ఇక పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజారిటీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ చక్రం తిప్పుతారన్నారు.తెలంగాణకు మోదీ ఏం చేశారుమాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జన్ధన్ ఖాతాలు తెరిస్తే ప్రతీ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని, ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని, నల్లధ నం వెలికితీస్తామని చెప్పిన మోదీని.. ఇప్పుడు అడిగితే తెల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్ చేసిందేంటి?ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఒకటే ఒక్క పని కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేయడమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు రూపాయి పని కూడా చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కరకు రాని చుట్టమని నిందించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలను కష్టాల్లోకి తోసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇవి తప్పనికిషన్ రెడ్డి రుజువుచేస్తే రేపటికల్లా నా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.గ్రేటర్ ప్రజలు గ్రేట్గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో తెలివిని ప్రదర్శించి బీఆర్ఎస్కు 16 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని, ఆ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ప్రజలు అప్పుడే కరెంట్ కోతలు...నీటి కష్టాలతో బాధపడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల తరువాత కచ్చితంగా రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ ఆరోపించారు. ’’రాహుల్ గాంధీ ఏమో మోదీని చౌకీదార్ చోర్ అంటే మోదీ బడే భాయ్ అని రేవంత్రెడ్డి అంటున్నారు.రాహుల్ ఏమో గౌతమ్ అదానీ ఫ్రాడ్ హై అని అంటే... గౌతమ్ అదానీ హమారా ఫ్రెండ్ హై అని రేవంత్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ లేదనీ. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం సరికాదని రాహుల్ గాంధీ అంటే... కేసీఆర్ కూతురును అరెస్టు చేయడం కరెక్టేనని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఈ మాటలను బట్టి రేవంత్ తీరు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు’’ అని కేటీఆర్ అన్నారు. -
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement