-
అమెరికా వృద్ధిలో భారతీయుల వాటా ఎంత?
అమెరికాలో నివసిస్తున్న మన భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్య పౌరసత్వం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అనేకమంది మనవారు అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నా అందరికీ అక్కడి పౌరసత్వం లేదు. మనదేశంలో పుట్టి అక్కడ జీవిస్తున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీ ఆర్ ఎస్ నివేదిక తెలుపుతోంది.2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ వున్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం వుందని చెబుతున్నారు.అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14శాతం. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సాఫ్ట్ వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ మనవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. తెలుగువారు కూడా బాగా పెరుగుతున్నారు.1.35 శాతంతో దాదాపు 50లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. కొత్తగా 65,960 మంది అధికారిక అమెరికా పౌరులయ్యారు. అగ్రరాజ్య పౌరసత్వం పొందాల్సిన మనవాళ్ళు ఇంకా చాలామంది వున్నారు.17 వ శతాబ్దం నుంచే మనవాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు, కొందరు అక్కడే జీవిస్తున్నారు.వాళ్ళ అవసరాల కోసం మనవారిని వాళ్ళ సేవకులుగా తీసుకెళ్లడం అప్పటి నుంచే ప్రారంభమైంది."వాళ్లు సేవకులు కాదు బానిసలు" అని మన చరిత్రకారులు అంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనవారిని వాళ్ళ కాలనీలకు తరలించుకొని తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మరో రూపం తీసుకుంది. కొంతమంది ఉపాధి కోసం, కొంతమంది విద్య కోసం అమెరికా బాట పట్టారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఆ సంఖ్య క్రమంగా గణనీయంగా పెరిగింది.1900 ప్రాంతంలో సిక్కులు ఎక్కువగా కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద చికాగో ప్రయాణం, ఉపన్యాసం పెద్ద ప్రభావాన్ని చూపించింది. వేదాంత సొసైటీ స్థాపనకు దారితీసింది. సిక్కులను కూడా అమెరికాలో ఒకప్పుడు హిందువులనే పిలిచేవారు. ఒక దశలో,భారతదేశం నుంచి వలసలను అరికట్టాలని కూడా అమెరికా చూసింది. ఇమిగ్రేషన్ చట్టాన్ని మరింత బలంగా నిర్మాణం చేయడంతో మన వాళ్ళ అమెరికా వలసలు తగ్గిపోయాయి. 1920ప్రాంతంలో భారతీయ అమెరికన్ల జనాభా కేవలం 6,400. ప్రస్తుతం 50లక్షలు. ఈ వందేళ్లలో మనవాళ్ళ జనాభా ఎన్నిరెట్లు పెరిగిందో? దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.మన జనాభా పెరగడానికి కారణాలలో విద్య ప్రధానమైంది. దానికి మూలం మన ప్రతిభ. 1920ల్లో మన ప్రతిభ చూపించి వాళ్ళను గెలిచినవారిలో మన యల్లాప్రగడ సుబ్బారావు పేరెన్నిక కన్నవారు. గోవింద్ బిహారీ లాల్ కూడా చాలా గొప్పవారు. జర్నలిజంలో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు. అక్కడి నుంచి మొదలైన మన భారతీయ ప్రతిభా ప్రయాణం నేడు ఐటీ దిగ్గజాలు సత్య నాదెండ్ల, సుందర పిచ్చయ్య వంటివారు వరకూ సాగింది. మన దేశ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ప్రస్తుతం అగ్రరాజ్య ఉపాధ్యాక్షురాలుగా పదవిని అలంకరించారు. బానిసల గతి నుంచి బాసుల స్థాయికి మన భారతీయులు ఎదగడం గర్వకారణం.వ్యాపార, వాణిజ్యాలలో మనవారు అక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు.మానవవనరులలో మనది గౌరవనీయమైన స్థానం. వైట్ హౌస్ లోనూ మనవారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో ఆర్ధిక సహాయం అందించేవారిలో మనవాళ్ళు కీలకంగా వున్నారు. కాకపోతే, రాజకీయ భాగస్వామ్యంలో మాత్రం వెనుకబడి వున్నారు. అమెరికాలో ఓటు హక్కున్న మనవాళ్ళు చాలామంది అస్సలు ఓటే వెయ్యరని మన వాళ్లే అంటారు. ఇది ఏ మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఎన్నికల్లో నిలుచుండే అభ్యర్థులకు డబ్బులిస్తే సరిపోదు. ఎన్నికల్లో నిలబడాలి, ముఖ్యంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.సాఫ్ట్ వేర్ రంగం తాజాది. వైద్యం, విద్య, పరిశోధన, మార్కెటింగ్ విభాగాల్లోనూ మనవాళ్ళు గౌరవనీయమైన సంఖ్యలోనే వున్నారు.అంతర్జాతీయ సంబంధాలలో అమెరికా ఒకప్పుడు పాకిస్తాన్ కే ఎక్కువ మద్దతు చూపించేది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా అధికారం పీఠం ఎక్కిన తర్వాత మన విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు అల్లడం మొదలుపెట్టారు. అందులో అమెరికా బంధాలు కీలకమైనవి. చైనాతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని ఆయన ముందే గ్రహించి ఈ అడుగు వేశారు. మన్ మోహన్ సింగ్ అదే బాటలో నడిచారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక సరికొత్త రూపును తెచ్చారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ తో వ్యక్తిగత స్నేహాన్ని నెరిపారు. ట్రంప్ ఎన్నికలకు అమెరికా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ట్రంప్ ను ఇండియా ఆహ్వానించి గుజరాత్ లో లక్షమందితో పెద్ద సభ ఏర్పాటు చేసి, ట్రంప్ ను తన్మయంలో మునకలు వేయించారు.అమెరికాలో ప్రధానంగా వున్న రాజకీయ పార్టీలు రెండు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ , రెండోది రిపబ్లికన్ పార్టీ. మనవాళ్ళు మొదటి నుంచి ఎక్కువ శాతం సహజంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు అందించారు. క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం ప్రారంభించారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ సమయంలో ఈ పరిణామం జరిగిందని అంటారు. బిల్ క్లింటన్, బరాక్ ఒబామా నుంచి జో బైడెన్ వరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు భారతదేశం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించి నట్లు కనిపించినా, వారి ప్రేమ ఒకింత పాకిస్తాన్ వైపే ఎక్కువగా ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తారు. వీరితో పోల్చుకుంటే డోనాల్డ్ ట్రంప్ కు భారత్ పట్ల ఆకర్షణ, అనురాగం ఎక్కువని కొందరు అంటారు.రేపు జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ - బైడెన్ మధ్య హోరాహోరి పోరు వుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్ కు, అక్కడ నివసించే భారతీయులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఒక వర్గం అంటోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్. మనతో అగ్రరాజ్యానికి చాలా అవసరం వుంది. గతంతో పోల్చుకుంటే మన అవసరం ఆ దేశానికి పెరుగుతోంది. అమెరికా - భారత్ మధ్య వాణిజ్య, వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాల్సి వుంది. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ నివసించే మన వారికి పన్నుల రాయతీలోనూ, వ్యాపార ప్రోత్సాహకాలలోనూ, పౌరసత్వ కల్పనలోనూ, రాజకీయ భాగస్వామ్యంలోనూ ఇంకా సహకారం ఎంతో పెరగాల్సి వుంది. ఇమిగ్రేషన్, వీసాల అనుమతులు, ఉద్యోగాల కల్పనలో అగ్రరాజ్యం ఇంకా ఉదారంగా వ్యవహరించాలి.ప్రస్తుతం,అమెరికాలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయులు భవిష్యత్తులో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అగ్రరాజ్యంలో భారతీయుల అధికారిక అమెరికా పౌరుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని అంచనా వెయ్యవచ్చు.ఇప్పటికే పౌరసత్వం వున్న కొందరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు.దానికి కూడా పరిష్కారం లభించాలి. ఉభయ పౌరసత్వం ( అమెరికా - భారత్ ) పట్ల కూడా అడుగులు పడవచ్చు.- మాశర్మ. సీనియర్ జర్నలిస్టు -
అమెరికాకు వెళ్తే పొట్ట తిప్పలేనా?
"తినుటకు ఉన్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి రమ్మనుటకు ఉన్నచాలు తగ ఆలును బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకు ఉన్నచాలు ! " అన్నాడు కవి. ఇది అత్యాశకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే పాత కాలం నాటిమాట. ఇపుడు కాలం మారింది , మనుష్యుల మనస్తత్వాలు మారాయి. మామూలు నడకతో లాభం లేదని అంతా పరుగులు తీస్తున్న రోజులు ఇవి. కుటుంబంతో కలిసి కూర్చొని ఉన్నదేదో తినాలంటే కుదరడం లేదు, మనిషి లేనిదాని కోసం అర్రులు చాస్తున్నాడు, కొత్తకొత్త రుచులు కోరుకుంటున్నాడు. ‘ గడుకంబలైన దొర్కక ఆకలిని దీర్ప కల్లు దాగితిమి మా కరువు దీర ‘ అన్నది మా మాతామహుడు వరకవి భూమగౌడు కాలంనాటి మాట. అంతటి దారిద్యం, కరువుకాలం నేను మాత్రం చూడలేదు. నా చిన్నప్పుడు , మా తల్లి దండ్రులు ఉన్నప్పుడు బడికి పోవడానికి ముందు మేము ఊదుకుంటూ తాగింది వేడివేడి గడుకంబలి, అంచుకు పెట్టుకున్నది వక్కకారం. మధ్యాహ్నం బడి వదలగానే ఆకలితో పరుగు పరుగున ఇంటికి వచ్చి ఆవురావురుమని ఆరగించింది పప్పన్నం. సాయంత్రం బడి చుట్టి కాగానే పొలోమని బయటికి వచ్చి ఆడిపాడి అలసిసొలసి ఇంటికి వచ్చి , చేతులు కూడా సరిగా కడుక్కోకుండా తిన్నవి, రాత్రి దీపాలకన్న ముందే కట్టెల పొయి వెలిగించి మా అమ్మ చేసిపెట్టిన జొన్నరొట్టెలు కాయగూరల కూరతో. మధ్య మధ్య సర్వపిండి , మొలక బియ్యం, వరి కుడుములు, మక్క కంకులు, జొన్నపిసికిళ్ళు, అనుప, అలిసంద గుడాలు లాంటి చిరుతిళ్ళు సరేసరి, చుట్టాలు వచ్చినప్పుడు ఒక కోడి ప్రాణం హరీ ! పండగల ప్రత్యేక వంటకాలు దసరా గారెలు, ఉగాది బూరెలు, సంక్రాతి చకినాలు ఉండనే ఉంటాయి. జీవితంలో ఎక్కువ భాగం హైదరాబాద్లో.. ఆ తర్వాత మజిలీ మారింది అమెరికాకు. దేశం కానీ దేశం వచ్చాక.. ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య భోజనం. ఇండియాలో ఏ మాటకు ఆ మాట.. ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇంట్లో భార్యలు చేసింది పుష్టిగా తినడమే కాకుండా.. బాక్సుల్లోనూ ఇంటి భోజనం తీసుకుని వస్తారు. ముంబై లాంటి చోట్ల అయితే వేడివేడిగా సమయానికి ఇంటి భోజనం తెచ్చిచ్చే "డబ్బావాలా"లు కూడా ఉన్నారు. ఎటొచ్చి అమెరికాలో ఈ పరిస్థితి లేదు. బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. ఆడా,మగా అంతా సమానమే. అంటే భర్తకు సమయానికి వండి పెట్టే భార్య కనిపించడం అరుదు. ఎవరి మానాన వాళ్లు ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరుగులు తీస్తారు. ఇక ఇంటి భోజనమా.? ఆ మాట వారాంతాల్లో తప్ప చాలా మందికి సాధ్యం కాదు. మరి బయటికెళ్లిన వాళ్లు ఏం తినాలి? అమెరికాలో ప్రతీ గల్లీలో ఫుడ్ సెంటర్లు కనిపిస్తాయి. ఆఫీసు క్యాంటీన్లు, బస్స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు ఎక్కడ చూసినా.. ఏదో బ్రాండ్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లన్నింటిలో కలిపి ఎక్కువగా కనిపించేవి ఇవి సబ్వే స్టార్బక్స్ మెక్ డొనాల్డ్స్ డంకిన్ బర్గర్ కింగ్ టాకో బెల్ డొమినో పిజ్జా హట్ వెండీస్ డైరీ క్వీన్ సగటు భారతీయుడి కంటే.. నాలుగింతలు నాన్వెజ్ ఎక్కువగా తింటారు. అక్కడి వాళ్ల అలవాటు ఇది. ఇక ఎక్కువ మంది ఉదయం పూట లాగించేవి శాండ్విచ్లు. కాల్చిన బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్ లేదా వెజ్ పీస్లు. పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్. కొందరు ఓట్స్ తింటారు. పళ్ల ముక్కలు తినేవాళ్లు కూడా బాగానే కనిపిస్తారు. మన దగ్గరి కంటే ఎక్కువగా కాఫీలు పీపాల కొద్దీ తాగేస్తుంటారు. అయితే కాఫీలో పాలు, చక్కెర కలుపుకుని కమ్మగా తాగే మనకు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే, చల్లటి ప్రాంతం కాబట్టి చాలా మంది రోజుకు ఐదారు కాఫీలు తాగేస్తుంటారు. మధ్యాహ్నం భోజనంలో ఎక్కువ మంది తినేవి బర్గర్లు, పిజ్జాలు. ఇందులో వందల వెరైటీలున్నాయి. ఏది తిన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన నంజుకోవచ్చు. గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చీస్ కూడా బాగానే తింటారు. ఉడికించిన కోడిగుడ్లు, బంగాళ దుంప, ఫ్రైడ్ చికెన్, బార్బెక్యూలు ఎక్కువగా కనిపించే, తినే ఫుడ్లు. తినే తిండికి అదనంగా గ్లాసుల కొద్దీ కూల్డ్రింకులు తాగుతూనే ఉంటారు. కూల్డ్రింక్ సర్వసాధారణం అని వచ్చిన వారానికి తెలిసిపోయింది. హాట్ డాగ్స్, లాబ్స్టర్ రోల్స్, బఫెలో వింగ్స్ వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా.. మన వాళ్లు కూడా నంజుకుని తినేస్తున్నారు. సాయంత్రం అయితే మాత్రం చాలా మంది ఇష్టపడేది డ్రింక్తో కలిపి తినే ఫుడ్. వీటికి అదనంగా మిల్క్ షేక్లు, ఐస్క్రీంలు. మరి ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి పరిస్థితి కాస్తా విచిత్రంగా మారుతుంది. వీకెండ్లో వీలైనన్ని కూరలు వండుకోవడం, బకెట్ నిండా సాంబారు తయారు చేసుకోవడం, దోశ/ఇడ్లీ పిండి రుబ్బుకోవడం, శనగలు/రాజ్మా లాంటివి నానబెట్టుకోవడం.. ఓ రకంగా శని/ఆది ఇంటి చాకిరిలో మునిగి తేలుతారు. ఇళ్లలో మన బీరువాల కంటే పెద్ద ఫ్రిడ్జ్లుండడం వల్ల తయారు చేసిన వాటన్నింటిని మళ్లీ వినియోగించుకునేలా ఐస్ట్రే తరహాలో ఉన్న బాక్స్ల్లో పెట్టి ప్యాక్ చేస్తారు. వాటిని ఏ రోజు అవసరం బట్టి ఆ రోజు తీసి మైక్రోఓవెన్లో పెట్టి వేడి చేసుకుని తింటారు. వీలైనన్ని సార్లు ఇంట్లో... తప్పనిసరి పరిస్థితుల్లో బయట తినడం మనవాళ్ల అలవాటు. కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఖర్చు తగ్గించుకుందామనుకున్న వాళ్లు.. చిన్న హీటర్ బాక్సుల్లో నూడుల్స్/కూరగాయ ముక్కలు వేసుకుని ఆఫీసుకు వస్తారు. సరిగ్గా లంచ్ సమయానికి పావుగంట ముందు దానికి ప్లగ్ పెడితే.. వేడి వేడి భోజనం రెడీ. ఇప్పుడు అమెరికాలోనూ ఇండియన్ ఫుడ్ బాగా పెరిగింది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్లతో పాటు స్వీట్లు, హాట్లు.. అన్నీ దొరుకుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ అంటే న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్లోని హూస్టన్, డాలస్లలో ఎక్కడ పడితే అక్కడ బోలెడు ఇండియన్ రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఏ మాటకా మాట.. రుచి కూడా బాగుండేలా బ్రహ్మండంగా చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే చాలా మంది విద్యార్థులకు ఇక్కడే పార్ట్టైమ్ ఉద్యోగాలు. పైగా మోటెల్స్లో, ఔట్స్కర్ట్స్లో దాబాల తరహాలో ఇంట్లోనే ఉండే రెస్టారెంట్లను కూడా మనవాళ్లు మెయింటెయిన్ చేస్తున్నారు. ఏ రోజుకా రోజు ఓ పది రకాల వెజ్/నాన్వెజ్ ఐటమ్లు కావాల్సినన్నీ లాగించొచ్చు. దీన్నే అక్కడి పరిభాషలో బ్రంచ్ అంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ సమయం దాటిన తర్వాత.. లంచ్ కంటే కొంచెం ముందు.. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంటలోపు పూటుగా తినే రకం అన్నమాట. పది నుంచి 15 డాలర్లు ఇస్తే.. మన నోటికి , కడుపుకు సంతృప్త స్థాయిలో తిని రావొచ్చు. పిల్లలు పెద్దలై దేశ సరిహద్దులు దాటాక , మేమే వాళ్లకు అమెరికా లో అతిథులమయ్యాక , వాళ్ల మాట వినాలి కదా. ఇండియాలో తిన్నట్టు వెజిటేరియనే కావాలి అంటే కుదరదు. అది వాళ్ళు ఇంట్లో గ్రిల్ మీద కాల్చిన మాంసాహారమైనా తిన్నాం. బయట స్ట్రీట్ ఫుడ్ పాయింట్, రెస్టారెంట్ లకు తీసుకుపోయినా వాళ్ళ వెంట నడిచాము. అది మెక్ డోనాల్డ్స్ సాండ్ విచ్, మెక్సికన్ చిపొట్లే , మాంగోలియన్ చికెన్, ఇటాలియన్ పిజ్జా తాజాతాజా ఫుడ్ ఏదైనా తిన్నాం. జపనీస్ సుశి పచ్చి చేపయినా కళ్ళు మూసుకొని నోట్లో పెట్టాము. సముద్రతీర విహారయాత్రల్లో ప్రాణంతో ఉన్న ఎండ్రకాయలు, పాముల్లాంటి జీవులను మా కళ్ళముందే క్రూరంగా, వేడివేడి కడాయి నూనెలో వేయించి ఇస్తుంటే మాత్రం తినడానికి మాకయితే మనసొప్పలేదు. అలా ఒకానొక ఆదివారం ఓ అమెరికన్ రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు, అరగంట వెయిటింగ్ తర్వాత లభించిన సీట్లలో కూర్చొని, మా పిల్లలు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వచ్చిన బర్గర్ లాంటి ఫుడ్ , దాని ఊరూ పేరూ తెలియకుండా నోట్లో పెట్టిన మరుక్షణం మాకో అనుమానం వచ్చింది. నేను కాస్త నమిలి చూసాక తెలిసింది, ఎప్పుడో సర్వీస్ లో ఉన్నప్పుడు పాతబస్తీలో ఓ మిత్రుడితో కలిసి వెళ్లి సరదాగా తిన్నప్పటి ఫుడ్ రుచి అది అని. నేను అదే మాట మా వాళ్ల చెవిలో వేశాను. వెంటనే వాష్ రూం వైపు పరుగున వెళ్ళి బొళ్లుమని వాంతి చేసుకున్నారు, ఏదో ఘోరం జరిగినట్లు. ఎవరి దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళవాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అది ఆరోగ్య కరమైందా కాదా, అయితే ఆ ఆహారం మనకు సరిపడుతుందా లేదా? అన్నదే, అంతేకానీ అందులో అపచారమేమీ లేదు ‘ అని ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
ఇండియా ప్రయాణం
భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్ రాజ్ అనుభవాలతో ఇ.ఎం. ఫార్స్టర్ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్ సీనియర్లో (ప్రస్తుత మధ్యప్రదేశ్లో భాగం) మూడో తుకోజీరావ్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్స్టర్ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు. ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ కవితా సంకలనం ‘పాసేజ్ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్స్టర్ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్ లీన్ . ‘ఎ పాసేజ్ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం. నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్ద మనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్ అజీజ్. అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్ ఫీల్డింగ్. అజీజ్ తబ్బిబ్బయి పోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్ పట్టణానికి వచ్చిన మిసెస్ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్. గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్త్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్ అయిన మూర్ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్ మూర్ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి! కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది. ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమై పోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్ను నిందిస్తాడు అజీజ్. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్మన్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు. ‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్స్టర్ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్స్టర్ హైదరాబాద్లోని ఉర్దూ హాల్ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్స్టర్ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది! -
అమెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్ అర్థమవ్వాలంటే మాత్రం..!
నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి ఏ కన్నీళ్లెనకాల ఏముందో తెలుసునా! అంటాడు సినిమా కవి ఆచార్య ఆత్రేయ ( మూగ మనసులు ). హాస్యం ప్రపంచ భాష, మనుషులందరికీ అర్థమయే భాష. అది అందరినీ కలపడంలో మేటి. స్నేహితులను పెంచుకోడానికి దానికదే సాటి. స్నేహితులు పెరగాలంటే హాస్య గుణం ఉండాలి మరి. ఆత్మీయులు కలుసుకున్నప్పుడే హాస్యం పండుతుంది. కానీ కొత్తగా కలుసుకున్న వారి మాటలు పొడిపొడిగా ఉంటాయి. బంధుమిత్రుల కలయికల్లో హాస్యం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది. మన కుటుంబ జీవితాల్లో బావ బావమరదులు, వదినా మరదళ్ళను హాస్యరస పోషకులు అనవచ్చు. అమెరికన్స్ మంచి హాస్యప్రియులు. అన్ని వయసులవారు జోక్స్ వేసుకొని హాయిగా నవ్వుకుంటారు. మనసును తేలిక చేసుకుంటారు, ఆహ్లాదంతో ఆరోగ్యాన్నీ పొందుతారు. అమెరికన్ల హాస్యం స్త్రీపురుష సంబంధాలు, శృంగారం, వివాహం, విడాకులు, త్రాగుబోతుల చుట్టూ ఎక్కువగా తిరిగినట్లు అనిపిస్తుంది. వాళ్ల జోక్స్ అర్థంచేసుకోడానికి కాస్త బుర్రకు పని చెప్పాల్సిందే. నేను విన్న కొన్ని పాపులర్ జోక్స్ చూడండి. ప్రేమించు , యుద్ధం వద్దు. రెండూ కావాలనుకుంటే పెళ్ళి చేసుకో ! ఔను ప్రేమ గుడ్డిదే అది స్పర్శతో ముందుకు పోయేది కదా ! ప్రస్తుతం దీనస్థితిలోనున్న చాలామంది భర్తలు ఒకప్పుడు ఎంతో భాగ్యవంతులైన బ్రహ్మచారులు. స్త్రీలు మౌనంగా ఉండే భర్తలను ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలన్నీ భర్త వింటున్నాడని వారి నమ్మకం. స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కలిగి ఉంటారు అదేమిటంటే ‘ స్త్రీ జాతిని నమ్మరాదు’ స్త్రీతో వాదించొద్దు ఆమె అలసిపోయినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ! ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది ఏం చేయమంటారని భార్య భర్తను అడిగిందట. అయన గారు ఇచ్చిన సలహా ‘ అలా షాపింగ్ కు వెళ్ళిరా! ’ అని. సందేహం లేదు వివాహం గొప్ప వ్యవస్థే అయినా వ్యవస్థతో కలిసి బతికేదెవరు ! వ్యభిచారమంటే ఏదో కాదు ప్రజాస్వామ్యాన్ని ప్రేమకు వర్తింపజేయడమే ! వివాహం ఎవరికైనా సంతోషకరమైందే, విడాకులు అంటే ఒక విపత్తు లాంటిదిగా భావించడం సహజమే. అయితే పాశ్చాత్యుల జీవితాల్లో ఇవి చాలా సామాన్య విషయాలుగా కనబడుతాయి. మీవాడు మావాడు కలిసి మనవాణ్ణి కొడుతున్నారు వెళ్లి ఆపండి ! అన్నదట ఒక భార్య భర్తతో . ఇద్దరు స్నేహితురాళ్లు మాట్లాడుకుంటుండగా అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్త ఏం చేస్తున్నావు ? అన్నాడట. ఆమె వెంటనే తన స్నేహితురాలితో ‘ వెంగళప్పని చెప్పానుగా , ఈయనే మా ఆయన ‘ అందట. మద్యపానం అమెరికన్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది అనవచ్చు. ఈ విషయంలో మన వాళ్ళు కూడా వారితో పోటీ పడుతున్నట్లే ఉంది అది వేరే విషయం. ఔను త్రాగుడు దుర్వ్యసనమే, దాన్ని మరిచిపోవడానికి మళ్ళీ తాగక తప్పడం లేదు అన్నాడట ఒక మహానుభావుడు. మితిమీరిన మద్యం అలవాటు తగ్గించుకోడానికి ఒక వ్యక్తి సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడట. అది బాగా పనిచేసింది. ప్రతి బుధవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య అతను త్రాగకుండా ఉండగలిగాడట. అమెరికాలో కావాలనుకుంటే ఏ విషయం మీదైనా పుస్తకాలు దొరుకుతాయి. కాకపోతే మనకు చదివే ఆసక్తి, ఓపిక ఉండాలి. త్రాగుడు, జూదంలో నిన్ను మించిన వాడు లేడు, నీ అనుభవాలతో ఒక పుస్తకం రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడట. దానికి త్రాగుబోతు జవాబు ‘ రాయడమెందుకు, మార్కెట్లో ఒకటి కొనుక్కుంటే చాలదా ! ’ అని. అమెరికాలో అయిదు రోజుల పనిదినాలు అవడం వల్ల శని , ఆదివారాలు సెలవులే, శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి బయట పడే సమయం. కార్యాలయంలో బాస్ సరిగ్గా 4 గంటలకు సమావేశం పెట్టడం నచ్చక ఇదేమిటని అడిగారట అక్కడ పనిచేసే ఉద్యోగులు. దానికి బాస్ చెప్పిన సమాధానం ‘ వారంలో అదే చాల అనుకూలమైన సమయం ఎందుకంటారా , నేను ఏది చెబితే అది ఎదురు చెప్పకుండా వాదనలు చేయకుండా వింటారు కదా! ’ వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?) -
‘మై డియర్ ఫ్యామిలీ మెంబర్’.. దేశ ప్రజలకు ప్రధాని లేఖ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ‘మై డియర్ ఫ్యామిలీ’ మెంబర్ అని ఒక్కొక్కరనీ వ్యక్తిగతంగా సంబోధిస్తూ లేఖ మొదలు పెట్టారు. 140 కోట్ల మంది ప్రజలే తనకు స్ఫూర్తినిస్తూ ముందుకు నడుపుతున్నారని తెలిపారు. ‘ఈ పదేళ్ల పాలనలో ప్రజల సహకారంతో ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో విజయాలు సాధించాం. వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాలి. రైతులు, పేదలు, యువకులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ పదేళ్లలో చాలా కృషి చేశాం. పీఎం ఆవాస్ యోజన, ఇంటింటికి నీళ్లు, కరెంటు, గ్యాస్ అందించాం. ఆయుష్మాన్ భారత్తో ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నాం. భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించాం. ట్రిపుల్ తలాక్, నారీ శక్తి వందన్ చట్టాలతో మహిళా సాధికారత కల్పించాం. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం. మీ మద్దతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు బలాన్నిచ్చింది. వికసిత్ భారత్కు మీ సలహాలు నాకు కావాలి. మనందరం కలిసి దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తామన్న నమ్మకం నాకు ఉంది’అని మోదీ లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్ల స్కీమ్ ఉండాల్సింది.. అమిత్ షా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement