-
3 లక్షలు.. 3రోజులు.. 3ముక్కలు
సాక్షి, హైదరాబాద్: మూడు లక్షలు... మూడు రోజులు... మూడు ముక్కలు... నగరంలో విలాసాలకు అలవాటు పడిన సంపన్నులే టార్గెట్గా సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని మాఫియా సాగిస్తున్న వ్యాపారమిది. మారియట్ హోటల్లో కాసినో బట్టబయలు అయిన ఘటనలో ప్రధాన నిందితుడే ఈ సంజయ్ అగర్వాల్. రాజధానిలో పేకాట శిబిరాల నిర్వహణపై నిషేధాజ్ఞలు ఉండడంతో ఆసక్తి ఉన్న వారిని కేరళ, గోవాలకు తరలిస్తూ.. అక్కడే ఆటకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీనెల రెండో శనివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఇలా కేరళబాట పడుతున్నారు. పేకాట కోసం రూ. 3 లక్షలు చెల్లిస్తే.. విమాన ప్రయాణంతోపాటు ఇతర వసతులు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఇంటి నుంచి రిసీవ్ చేసుకుని వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం ఇంటి వద్ద దిగబెడుతున్నారు. సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతానికి చెందిన సంజయ్కుమార్ అగర్వాల్ను ఈ తతంగానికి సూత్రధారిగా గుర్తించిన నగర పోలీసులు ఆయనకు సంబంధించి వివరాలపై ఆరా తీస్తున్నారు. క్రికెట్ బుకీలతోనూ సంబంధాలు, గోవా ట్రిప్లపైనా వివరాలు సేకరిస్తున్నారు. టూరు సాగుతుందిలా... మూడు రోజులపాటు కేరళ వెళ్లి మూడు ముక్కలాట ఆడుకోవాలనుకునేవారు నాలుగు రోజుల ముందే పేరు నమోదు చేసుకోవాలి. ప్రయాణానికి రెండు రోజుల ముందు రూ.3 లక్షలు చెల్లించాలి. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ముందుకు క్యాబ్ వస్తుంది. శంషాబాద్ తీసుకెళ్లి విమానం ఎక్కిస్తారు. రాత్రికల్లా కొట్టాయం లేదా త్రివేండ్రంలో దిగగానే అక్కడి నుంచి మళ్లీ క్యాబ్లలో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కొండలు, కోనలు, నదుల మధ్యన ఉండే రిసార్ట్స్కి తీసుకువెళ్తారు. సికింద్రాబాద్, సీతాఫల్మండి, కంటోన్మెంట్, బేగంపేట్, సింథికాలనీ, ఆబిడ్స్, బేగంబజార్ తదితర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారవేత్తలు, బిల్డర్లు, ప్రజాప్రతినిధులు మొత్తంగా 100 మంది వరకు ప్రతీనెల కేరళ వెళ్లి వస్తున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకునేందుకు 10 మంది ఏజెంట్లు ఉన్నట్లు పేకాటరాయుళ్లు చెబుతున్నారు. ఇందులో ఐదుగురు పాతబస్తీ బేగంబజార్కు చెందిన వారు కాగా మిగతావారు సింథికాలనీ, బేగంపేట, సీతాఫల్మండికి చెందినవారుగా సమాచారం. నగదు రూపంతోపాటుగా కార్డు స్వైపింగ్, పాత కస్టమర్ల నుంచి చెక్కులు కూడా నిర్వాహకులు స్వీకరిస్తున్నారు. ఎవరీ అగర్వాల్? సీతాఫల్మండి నామాలగుండు ప్రాంతానికి చెందిన సంజయ్ అగర్వాల్ తొలుత నగరంలో విచ్చలవిడిగా నడిచిన పేకాట క్లబ్ల్లో పనిచేసేవాడు. అలా రూ.200లకు పని చేస్తూ క్రమేణా పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయికి ఎదిగాడు. ప్రధానంగా విలాసాలకు అలవాటు పడిన సంపన్నులను టార్గెట్ చేసుకునేవాడు. విమానాల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడం, గోవాలో పలు క్రికెట్ బెట్టింగ్లు ఈయన నేతృత్వంలో జరిగినట్లు ప్రచారంలో ఉంది. గతంలో ఇలాంటి కేసుల్లోనే జైలుకు వెళ్లిన అగర్వాల్... బెయిల్పై వచ్చాక కూడా అవే అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సకల సదుపాయాలు పేకాట కోసం వెళ్లినవారందరికీ శుక్రవారం రాత్రి నుంచే రాజభోగాలతో కూడిన వసతులు అందుబాటులో ఉంచుతారు. పేకాటకు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే ముందుగా చెల్లించిన రూ.3 లక్షలు వాడుతారు. మద్యం, ఆహారం, భోజనం అంతా నిర్వాహకులు ఉచితంగానే ఏర్పాటు చేస్తారు. రిసార్టులో చేరింది మొదలు.. తిరిగి బయటకు వచ్చే వరకు ముంబై, రష్యా నుంచి రప్పించిన యువతుల నగ్న ప్రదర్శనల మధ్య పేకాట సాగుతుంది. ముందుగా చెల్లించిన రూ. 3 లక్షలు పేకాటలో చేజారితే అంతే సంగతులు. డబ్బు గెల్చుకున్నవారు ఉంటే నగరానికి వచ్చాక చెల్లిస్తారు. స్వర్గం చూపించారు సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో నాలుగుసార్లు కేరళ వెళ్లాను. మూడుసార్లు త్రివేండ్రం, ఒకసారి కొట్టాయం సమీపంలోని రిసార్ట్కు వెళ్లి వచ్చాను. వివిధ రాష్ట్రాలతోపాటు రష్యా తదితర దేశాలకు చెందిన పలువురు యువతులతో సపర్యలు చేయిస్తారు. మద్యం సేవిస్తూ పేకాట ఆడుతుండగానే.. యువతుల నగ్న నృత్యప్రదర్శనలు ఉంటాయి. అత్యంత ఖరీదైన మద్యం మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ముందస్తు ఆట డబ్బులు చెల్లిస్తే చాలు ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే వరకు అన్నివిధాలా వాళ్లే చూసుకుంటారు. – పేకాట ప్రియుడు, సీతాఫల్మండి -
రసాభాసగా ఆర్కిటెక్చర్ల సమావేశం
హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ తెలంగాణ చాప్టర్ పేరుతో హోటల్ మారియట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాప్టర్కు సంబంధించిన కమిటీ నాయకులు తెలంగాణ చాప్టర్ పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై తెలంగాణకు చెందిన ఆర్కిటెక్చర్లు కొందరు నిరసన తెలియజేశారు. తెలంగాణ చాప్టర్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్చర్లతో నూతన కమిటీని ఏర్పా టు చేస్తున్నారని, ఇక్కడి వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ సీనియర్ ఆర్కిటెక్చర్లు డి.టి. వినోద్కుమార్, విజయ్కుమార్లు ఆందోళనకు దిగారు. అనంతరం ఇండియన్ ఆర్కిటెక్చర్స్ అఖి ల భారత అధ్యక్షులు ప్రకాశ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఈ సమావేశం తెలంగాణ చాప్టర్ ప్రారంభోత్సవం కాదని పేర్కొన్నారు. తరువాత నిరసనల మధ్యే ఉమ్మడి రాష్ట్ర ఆర్కిటెక్చర్ల సమావేశం కొనసాగింది. -
నైషితారెడ్డి ప్రకృతి‘చిత్రం’
ఉదయించే సూరీడు... చెట్ల చాటున చందమామ... కొండల నడుమ పారుతున్న సెలయేరు... ఒకటేమిటి... ప్రకృతిలోని అందాలన్నింటినీ కాన్వాస్పై ఆవిష్కరించారు ఇంజినీరింగ్ విద్యార్థిని నైషితారెడ్డి. హోటల్ మారియట్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆమె పెయింటింగ్స్తో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు దిలీప్రెడ్డి, డీఐజీ నవీన్చంద్ర, హిందూ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నైషిత వేసిన 30 చిత్రాలు చూసి ముగ్ధులయ్యారు. నైషిత తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, జయ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement