-
వాళ్లది విద్వేషం! ఆ ఒక్కమాటతో..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదేదో స్పష్టంగా చెప్పేస్తారు. తన మనసులో ఉన్నమాట దాచుకోరు. చల్లకొచ్చి ముంత దాచే వ్యవహారం ఆయనతో కాదు. వలంటీర్ల అభినందన సభలో ఆయన తన మనోగతాన్ని చాలా గట్టిగా మొహమాటం లేకుండా వెల్లడించారు. వచ్చే రెండు నెలలు ప్రజలకు అందించవలసిన సేవలను, చెప్పవలసిన విషయాలను వలంటీర్లకు వివరించి వచ్చే ఎన్నికల యుద్దానికి సన్నద్దం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఒకరకంగా ఇది ధైర్యంతో కూడిన విషయం. విపక్షాలు చేసే విమర్శలతో నిమిత్తం లేకుండా ఆయన.. పేదల తరపున పనిచేసే ప్రభుత్వానికి వలంటీర్లు వారధులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వలంటీర్లు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేవలం స్వచ్చంద కార్యకర్తలు. వారు తమ అభిప్రాయాల ప్రకారం రాజకీయంగా నడుచుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రపంచంలోనే ఒక సరికొత్త చరిత్ర సృష్టించిన జగన్ దాని వల్ల కూడా తన ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పకనే చెప్పేశారు. సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లకు అభివందనం పేరుతో వారి సేవలను దృష్టిలో ఉంచుకుని అవార్డులను ప్రకటించారు. వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైనవో ప్రజలకు తెలియచెప్పవలసిన బాద్యత వలంటీర్లపై ఉందని అన్నారు. ఈ అభినందన సభలో జగన్ మాట్లాడిన ప్రతి మాటకు విశేష స్పందన కనిపించింది. సీఎం., సీఎం. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. సభ జరిగిన తీరు చూస్తే వలంటీర్లు ఎంత కమిటెడ్గా ఉన్నది, జగన్ పట్ల ఎంత అభిమానంతో ఉంది అర్ధమవుతుంది. వారిని చూడగానే ప్రభుత్వ స్కీములు పొందిన పేదలంతా ముఖ్యమంత్రి జగన్ ను చూసినట్లు సంతోషపడుతున్నారు. ప్రత్యేకించి వృద్దులైతే వారి సంతోషానికి అవధులు ఉండడం లేదు. గతంలో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గంటల తరబడి వేచి చూసి పెన్షన్ పొందడానికి నానా కష్టాలు పడవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వలంటర్ ప్రతి నెల మొదటి తేదీన ఇంటికి వచ్చి మూడువేల పెన్షన్ ఇస్తుండడంతో వారికి ఎంతో గౌరవం, సంతృప్తి ఇస్తోంది. ఇదే విషయాన్ని జగన్ తన స్పీచ్ లో కూడా ప్రస్తావిస్తూ, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని హెచ్చరించారు. గతంలో వలంటీర్ల వ్యవస్తను ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వలంటీర్లు అంటే మూటలు మూసే ఉద్యోగమని, ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారని టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వ్యక్తులంటూ తీవ్రంగా అవమానించారు. ఎన్నికలు దగ్గరబడుతున్న తరుణంలో వారు తమ వైఖరి మార్చుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నా, వారిలో ఈ వలంటీర్లపై పేరుకున్న విద్వేషాన్ని మాత్రం దాచుకోలేకపోతున్నారు. ఈనాడు రామోజీరావు ఈ అల్పజీవులపై విషం చిమ్ముతూ టీడీపీ, జనసేన ఎజెండాను మోస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ వారందరిని తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ వారి సేవలను అభినందిస్తూ మాట్లాడారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కల వంటివైతే, వలంటీర్లుతో కూడిన ప్రస్తుత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తులసి మొక్క వంటివని సీఎం జగన్ కొనియాడారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో నిరుపేదలకు వలంటీర్లకు అండగా నిలవాలని ఆయన కోరారు. మేనిఫెస్టోల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి తాము ఎంతో కష్టపడి నవరత్నాల అమలుకు 70 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని, అలాంటిది చంద్రబాబు నాయుడు ఏకంగా 1.26 లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నారని, అది ప్రజలను మోసం చేయడమేనని, ఈ విషయం ప్రజలకు వలంటీర్లు తెలియచెప్పాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నమ్మితే ఇంతే సంగతన్నది ప్రజలకు అర్ధం కావాలని అన్నారు. తాము బటన్ నొక్కుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అంతకు మించి పంచుతామని అంటున్నారని, దీనిన ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ బిడ్డ పై చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా,మరో జాతీయ పార్టీ పరోక్షంగా ఏకం అవుతున్నాయని, కాని నాకు మాత్రం రెండున్నరలక్షల మంది సైన్యం ఉన్నారని జగన్ అన్నప్పుడు వలంటీర్లు అంతా హర్షద్వానాలతో హోరెత్తించారు.వలంటీర్ల సేవలకు తాను సాల్యూట్ చేస్తున్నానని అంటూ, పెత్తందార్లకు,పేదలకు మద్య జరుగుతున్న యుద్దంలో పేదలే గెలవాలని జగన్ అన్నారు. ఒకవైపు పోరాట పటిమను ప్రదర్శించడానికి వలంటీర్లలో స్పూర్తి నింపే విధంగా, మరో వైపు ప్రత్యర్ధి రాజకీయ పక్షాల డొల్లతనాన్ని ఎండగడుతూ జగన్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. రెండు నెలల్లో జరిగే యుద్దానికి అంతా సిద్దం కావాలని , సిద్దం సభ తరహాలో ఆయన నినదించారు.తన ప్రభుత్వం ఎక్కడా అవినీతి లేకుండా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర వివిధ స్కీముల కింద నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో వేసిందని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు టైమ్ లో అంతా అవినీతిమయంగా ఉండేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా టైమ్ చూసి దెబ్బగొట్టడం అంటే ఇదేనేమో!. వలంటీర్లపై టీడీపీ,జనసేన తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందుకు భిన్నంగా వలంటీర్లను గౌరవించి వారి ఆదరణను చురగొనే యత్నం జగన్ చేశారని అనుకోవచ్చు!!. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. గతంలో జన్మభూమి కమిటీలను రాజకీయ లక్ష్యంతోనే చంద్రబాబు ఏర్పాటు చేశారు.కాకపోతే వారు పూర్తిగా అవినీతి మయం అయి టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశారు.కాని వలంటీర్లు ఎక్కడా అవినీతి లేకుండా సేవలు అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. దాంతో విపక్షాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నాయి. అంతేకాక.. చంద్రబాబు ఒకసారి తాను వేసిన రోడ్డు మీద నడుస్తూ వేరే వాళ్లకు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.చివరికి తాను మంజూరు చేసిన మరుగు దొడ్డిని వాడుతూ వేరే వారికి ఓటు వేయరాదని ఆయన వాదించారు. ఈ పరిస్థితిలో జగన్ ఎక్కడా ప్రజలను బెదించడం లేదు. తాను చేసిన సేవలను ప్రజలకుగుర్తు చేయాలని మాత్రమే కోరుతున్నారు. తద్వారా ఆయన తనవాదన రెడీ చేసుకుని వలంటీర్ల అభినందన సభలో ఇంత స్పష్టంగా వారిని ఆకట్టుకునే రీతిలో స్పీచ్ ఇచ్చారని అనుకోవచ్చు. వచ్చే ఎన్నికలలో వలంటీర్ల ప్రభావం ప్రజలపై బాగా ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ ,జనసేన భయపడుతున్నాయి. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా వారిపై కక్షపూరిత ప్రచారం చేశాయి. తద్వారా జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా వారిని రెచ్చగొట్టారని అనుకోవచ్చు. దాని ఫలితమే అభినందన సభలో జగన్ పట్ల వలంటీర్లు అంత అభిమానాన్ని కనబరుచుకున్నారని భావించవచ్చు. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
వలంటీరుగా రాణిస్తున్న ట్రాన్స్జెండర్ శ్రేయదాస్
ట్రాన్స్జెండర్ అంటే సమాజంలో ఓ రకమైన చిన్నచూపు. ‘మూడో’రకం మనుషులంటూ హేళనభావం. అనుచితంగా ప్రవర్తిస్తారని, బెదిరించి డబ్బు వసూలు చేస్తారనే అపవాదు. కానీ అందరు ట్రాన్స్జెండర్లూ అలా ఉండరు. మానవత్వం మూర్తీభవించి ఆపన్నులకు అండగా నిలిచేవారు, సమాజానికి సేవ చేయాలని తపనపడే వారూ ఉన్నారు. యాచనకు దూరంగా స్వశక్తితో హుందాగా, గౌరవంగా బతుకుతున్న వారూ ఉన్నారు. అలాంటి వారిలో శ్రేయదాస్ ఒకరు. సాక్షి, అనంతపురం డెస్క్: ఉరవకొండ పట్టణానికి చెందిన శ్రేయదాస్ గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నారు. తన క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రశంసలు చూరగొంటున్నారు. తన పనితీరుతో అధికారుల మన్ననలూ పొందుతున్నారు. ఈమె బహుశా రాష్ట్రంలోనే వలంటీరుగా పనిచేస్తున్న ఏకై క ట్రాన్స్జెండర్! గౌరవంగా బతకాలన్న దృఢసంకల్పం, సమాజానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కన్నీటి పయనం.. శ్రేయదాస్ సొంతూరు ఉరవకొండ పట్టణమే. చిన్నప్పుడు అబ్బాయి లాగా ఉండేవారు. తల్లిదండ్రులూ అలాగే అనుకున్నారు. మిగిలిన అబ్బాయిలతో కలసి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. పదో తరగతి వరకు అక్కడే చదివారు. కానీ తాను అబ్బాయిని కాదన్న విషయం శ్రేయదాస్కు తెలుసు. ఆ విషయం ఇంట్లో చెప్పాలంటే భయం. చివరికి ఎలాగోలా విషయం బయటపడింది. కొంతకాలానికి తల్లి కూడా చనిపోయింది. కుటుంబ సభ్యుల నుంచి ఛీదరింపులు ఎక్కువయ్యాయి. చివరకు తండ్రి కూడా అండగా నిలవలేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. తలదాచుకోవడానికి అద్దె ఇల్లు కూడా దొరకని పరిస్థితి. చాలాకాలం పాటు స్థానిక కందారమ్మ ఆలయమే ఆశ్రయమైంది. ‘ఉన్నత’ లక్ష్యం ఇంటి నుంచి బయటకొచ్చేసిన తర్వాత శ్రేయదాస్ పొట్ట నింపుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. మిగిలిన ట్రాన్స్జెండర్ల లాగా యాచించడం తనకు ఇష్టం లేదు. కానీ ఆకలి తీరాలంటే ముందున్న మార్గం అదొక్కటే. అయిష్టంగానే సుమారు మూడేళ్ల పాటు యాచనతో బతుకు నెట్టుకొచ్చారు. ఓ దుకాణం వద్దకు యాచించడానికి వెళ్లిన ఆమె ఇంగ్లిష్ నేమ్బోర్డును స్పష్టంగా చదవడాన్ని అక్కడే నిల్చొన్న ఓ వ్యక్తి గమనించారు. ఏమి చదివారంటూ ఆరా తీశారు. టెన్త్ చదివానని, పైచదువులు చదవాలన్న కోరిక ఉందని చెప్పారు. దీంతో గుంతకల్లులోని సత్యసాయి జూనియర్ కళాశాలలో అడ్మిషన్ చేయించారు. ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో పీజీ (ఎంఏ) అడ్మిషన్ పొంది ఫస్టియర్ ఉత్తీర్ణులయ్యారు. ఇతరత్రా కారణాల వల్ల సెకండియర్లో డిస్కంటిన్యూ అయ్యారు. తన చదువుకూ ‘జెండర్’ సమస్య అడ్డొచ్చినప్పటికీ పట్టుదలతో అధిగమించి ముందుకు సాగారు. స్వశక్తితో జీవనయానం హేళన చేసిన చోటే ప్రశంసలు శ్రేయదాసుకు వలంటీరుగా గౌరవ వేతనంతో పాటు ట్రాన్స్జెండర్గా పింఛన్ కూడా వస్తోంది. ఇంట్లోనే టైలరింగ్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా మెలకువలు నేర్చుకుని బ్యూటీషియన్గానూ మారారు. ఇళ్ల వద్దకే వెళ్లి బ్యూటీషియన్గా సేవలందిస్తున్నారు. డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నారు. ఈమెకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించింది. సొంతింటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇలాంటి’ వలంటీరునా గ్రామ/వార్డు వలంటీర్ల నియామక నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో శ్రేయదాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన అధికారులు గ్రామ వలంటీరుగా అవకాశం కల్పించారు. 2019 ఆగస్టు 15న గ్రామ వలంటీరుగా సేవలు ప్రారంభించారు. మొదట్లో తనను చాలామంది హేళన చేశారు. ‘ఇలాంటి’ వలంటీరునా తమకు కేటాయించిందంటూ ప్రజలు కూడా చిన్నచూపు చూశారు. కానీ అందరి అపోహలను ఆమె పటాపంచలు చేశారు. ఉత్తమ సేవలతో హేళన చేసిన చోటే ప్రశంసలు చూరగొంటున్నారు. ఈ క్రమంలో ‘సేవామిత్ర’ అవార్డు కూడా పొందారు. ‘ఆపదమిత్ర’గా జిల్లాస్థాయి శిక్షణ తీసుకున్నారు. అందులోనూ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. గౌరవంగా బతుకుతున్నా.. వలంటీరుగా చేరినప్పుడు చాలామంది హేళన చేశారు. సొంత కమ్యూనిటీ నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా కొందరి ప్రోత్సాహం, అధికారుల సహకారంతో ధైర్యంగా ముందుకు సాగాను. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ భారతి మేడం, వీఆర్వో అరుణ మేడం సహకారం మరువలేనిది. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు క్లస్టర్ పరిధిలోని ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆత్మీయురాలిగా చూస్తుండడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో గౌరవంగా బతుకుతున్నా. ట్రాన్స్జెండర్లు అందరూ చెడ్డవారు కాదు. మాలోనూ మంచోళ్లు ఉన్నారు. కాబట్టి కొందరి ప్రవర్తనను బట్టి అందరినీ చెడ్డవాళ్లుగా ముద్ర వేయొద్దు. సమాజంలో గౌరవం, సమాన అవకాశాలు లభిస్తే నాలాగా స్వశక్తితో బతకడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. – శ్రేయదాస్, గ్రామ వలంటీరు, సచివాలయం–3, ఉరవకొండ -
ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై వాగింది!
వాళ్లు ఎండావానచలిని లెక్క చేయరు. తమ పరిధిలోని యాభై మందికి ఓర్పు.. ఓదార్పులే కాదు, సాయం చేసిన సందర్భాలనేకం. వ్యయప్రయాసలకు ఓర్చుకుని లబ్ధిదారుల కోసం బహుదూరం ప్రయాణించిన సందర్భాలూ.. గ్రామస్తుల కోసం సాహసాలు చేసిన సందర్భాలూ చూశాం. వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వాళ్లను చూసే ఉంటాం!. అన్నికంటే ముఖ్యంగా.. కరోనా లాంటి మహమ్మారి సైతం వాళ్ల సంకల్పం ముందు చిన్నబోయింది. వాలంటీర్ల సైన్యం.. ఏపీ ప్రజానీకపు కుటుంబ సభ్యులు. అలాంటి సంక్షేమ సారథుల పట్ల.. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా వాగడం సరైందేనా దత్తపుత్రా?.. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుంటే ఫలితాలు ప్రజలకు అందుతుంటాయి. పేదల సంక్షేమానికి పథకాలు పెడితే.. అవి లబ్ధిదారులకు చేరుతాయి. కానీ, మధ్యలో దళారుల చేతివాటం, అవినీతి పరుల అక్రమాలు, నేతల పక్షపాత ధోరణి లాంటి వ్యవహారాలతో చొరబడే అవకాశాలు ఉంటాయి. ఆ లోటుపాట్లను అర్థం చేసుకున్నారు గనుకే.. ప్రభుత్వానికి- ప్రజలకు నడుమ ఒక వారధి ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తలిచారు. సంక్షేమ సంధాన కర్తలుగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగమై.. విప్లవాత్మక మార్పుతో ముందుకు పోతున్న ఈ విధానం గురించి బహుశా ఏమీ తెలియనివాళ్లు.. అర్థం చేసుకోని వాళ్లే ఇలా కారుకూతలు కూస్తుంటారేమో.. పిచ్చి రాతలు రాస్తుంటారేమో!. #PawanSaySorryToVolunteers ప్రభుత్వం అందించే గౌరవ వేతనంతో స్వచ్ఛందంగా పని చేస్తూ.. క్రమశిక్షణ కలిగిన సైన్యమిది. ప్రతినెలా 1వ తేదీన అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టడమే కాదు. పొలాల్లోని రైతులు,ఆసుపత్రుల్లోని రోగులు సహా అందరినీ పరామర్శిస్తూ వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల నుంచి ఇతర సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నారు. కాబట్టే... ఇపుడు రాష్ట్రంలో అర్హత ఉండి పథకం అందలేదనే వారెవరూ లేరు. వివక్షతో దూరమైన వారు లేరు. లంచాలివ్వాలని బాధపడేవారు లేరు. అందుకేనేమో!! జనానికి చేరువైన ఈ జగనన్న సైన్యంపై దొంగల ముఠాలో.. ఆ ముఠాలో ఒకడైన పవన్కు వణుకు మొదలైనట్లుంది. #PawanSaySorryToVolunteers వాలంటీర్ వ్యవస్థ విధులివే తెలుస్కో.. వాలంటీర్లూ అహర్నిశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త రైస్ కార్డులివ్వటంతో పాటు రైస్ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కల్పించటం చేస్తోంది. ఇదీ చదవండి: కరోనా టైంలో.. వలంటీర్లు ఉన్నారనే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆర్థిక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు. #PawanSaySorryToVolunteers ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్లకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం. వాలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వాలంటీర్లదే. ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛంద సైనికుల్లా రంగంలోకి దూకి సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు. ఇదీ చదవండి: 12 కిలోమీటర్ల కొండమార్గంలో ఆ వాలంటీర్.. 64లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వ పెన్షన్లను అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు. 2019నుంచి 2.66లక్షల మంది మహా సైన్యం వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తోంది. మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాలంటీర్లను చులకనగా చూడడం.. టార్గెట్ చేయడం దేని? బహుశా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే క్రమంలోనే కదా ఇదంతా జరుగుతోంది కాబోలు. ఇంతకన్నా ఘోరమైన కుట్ర ఉంటుందా?.. ఏమన్నావ్ పవన్.. వాలంటీర్లు సంఘవిద్రోహశక్తులా? వాళ్ల పనితనం గురించి ఏనాడైనా చూశావా?.. పోనీ వాళ్ల సేవలకు సంబంధించిన కథనాలు చదివావా?.. #PawanSaySorryToVolunteers ఇదీ చదవండి: బ్రెయిన్ డెడ్ అయిన వలంటీర్ అవయవదానం ఏమన్నావ్.. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులా?.. వ్యక్తిగత సమాచారం తస్కరిస్తారా? రాష్ట్రంలో వేల మంది మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమా?. వాళ్లేమైనా నీలాగా ప్యాకేజీ స్టార్ అనుకుంటున్నావా?.. లేదంటే పవిత్రమైన వివాహ బంధానికి తూట్లు పొడిచేవాళ్లు అనుకుంటున్నావా? వాళ్లు ప్రజల మనుషులు.. రియల్ పవర్ స్టార్లు.. అందుకే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసే ఘనతను ప్రభుత్వ ఖాతాలో కాకుండా ఆ ‘‘సేవా బలగం’’కే కట్టబెట్టి ప్రతీ ఏటా వాళ్లకు తగిన గౌరవం అందించి సీఎం జగన్ సత్కరిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నారు. #PawanSaySorryToVolunteers ఇదీ చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో ఓసారి వాలంటీర్ల గురించి ఇలాగే వాగాడు. కానీ, జగన్ ఆలోచనకి ఉన్న పవర్ గుర్తించాడు గనుకే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను కొనసాగిస్తానన్నాడు. కానీ, ఇప్పుడాయన దత్తపుత్రుడు మాత్రం ఘోరంగా అనుమానించి.. అవమానించాడు. ఆ వాగిన వాగుడుకు గట్టిగానే కౌంటర్ పడక మానదు. #PawanSaySorryToVolunteers (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Live: వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
వాలంటీర్లంటే వణుకెందుకు బాబూ ?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement