-
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ20 వర్చువల్ సమావేశం
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు జీ-20 వర్చువల్ సమావేశం జరగనుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ భేటీకి దూరంగా ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అమలు, ఇజ్రాయెల్- హమాస్ వివాదం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆర్థిక పురోగతి సహా ప్రపంచ నూతన సవాళ్లపై చర్చించనున్నారు. సమ్మిట్లో సభ్య దేశాల నాయకుల నుంచి అద్భుతమైన భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడం లేదు. ఆయనకు బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ చైనాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి సానుకూలంగా దోహదపడేందుకు ఈ సదస్సు సహకారాన్ని పెంపొందిస్తుందని చైనా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వర్చువల్ సమ్మిట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది. సెప్టెంబరులో జరిగిన న్యూ ఢిల్లీ G20 సమ్మిట్లో ఆయన గౌర్హజరైన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది జరిగిన జీ20 బాలి సదస్సుకు కూడా పుతిన్ దూరమయ్యారు. ప్రస్తుతం పుతిన్ హాజరువుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ప్రపంచాభివృద్ధికి జీ20 భారత్ ప్రెసిడెన్సీ దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: భారత్ ప్రెసిడెన్సీలోని జీ20 గ్రూప్ ప్రపంచ జనాభాలో మెజారిటీ అవసరాలను పరిష్కరించడానికి స్పష్టమైన విధాన దిశను నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బహుళజాతి సదస్సులో పలు దేశాల అవసరాలు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సహజంగా చోటుండదని పేర్కొన్న ఆమె, అయితే భారత్ నేతృత్వంలో జీ20 భేటీలో ఈ సమస్యను కొంతమేర అధిగమించినట్లు వివరించారు. అయితే ఈ దిశలో కర్తవ్యం ఇంకా కొంత మిగిలే ఉందని పేర్కొన్నారు. ఆర్థిక, కారి్మక, వాణిజ్య మంత్రిత్వశాఖలు ‘‘బలమైన, స్థిరమైన, సమతుల్య, సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్లో సీతారామన్ ప్రారం¿ోపన్యాసం చేశారు. 2022 డిసెంబర్ 1వ తేదీన ఏడాది కాలానికి భారత్ జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయా అంశాల గురించి సీతారామన్ తాజా సెమినార్లో మాట్లాడుతూ... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను పరిష్కరించాలని, ప్రజలు కేంద్రంగా సంక్షేమ చర్యలు, విశ్వాస ఆధారిత భాగస్వామ్యాలతో భవిష్యత్తు కోసం విధాన మార్గదర్శకాలను రూపొందించాలని జీ20 న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ (ఎన్డీఎల్డీ)లో గ్రూప్లో దేశాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరించాయి. ► ఈ డిక్లరేషన్లో పేద దేశాల పురోగతికి పరస్పర సహకారం, సాంకేతిక పురోగతి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయోజనం పొందడం, ప్రపంచ పురోగతికి బహుళజాతి సంస్థలు తగిన విధాన చర్యలు చేపట్టడం వంటివి ఇందులో ఉన్నాయి. ► ఈ నెలాఖరు నాటికి జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ పాత్ర ముగిసిపోతున్నప్పటికీ, డిక్లరేషన్లోని విధాన మార్గదర్శకాల అమలును వేగాన్ని కొనసాగించాలి. ► మహమ్మారి నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సంక్షోభాలతో సతమతమవుతోంది. ప్రపంచ వృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. రికవరీ జరుగుతున్నప్పటికీ, ఇది నెమ్మదిగా అసమానంగా ఉంటోంది. ► ప్రపంచ వృద్ధి ప్రస్తుత వేగం చాలా బలహీనంగా ఉంది. వృద్ధి రేటు మహమ్మారికి ముందు రెండు దశాబ్దాలలో సగటు 3.8 శాతం కంటే చాలా తక్కువగా ఉంది. మధ్యస్థ కాలానికి సంబంధించి, వృద్ధి అవకాశాలు మరింత బలహీనపడ్డాయి. ► వృద్ధి తిరిగి తగిన బాటకు రావడానికి– బలంగా, స్థిరంగా, సమతుల్యంగా కొనసాగడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా పరస్పర సహకారం, సమన్వయం కీలకం. వేగంగా పురోగమిస్తున్న విమానయానం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో న్యూఢిల్లీలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రవీణా యజ్ఞంభట్ సమావేశం అయ్యారు. దాదాపు 7% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ విమానయానరంగం అభివృద్ధి చెందుతోందని సలీల్ గుప్తే ఈ సందర్భంగా పేర్కొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. భారతదేశం స్థూలదేశీయోత్పత్తి జీడీపీ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో.. విమానయాన రంగ పురోగతి కూడా దేశంలో అంతే వేగంగా పురోగమించే అవకాశం సుస్పష్టమని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ ఉందన్నారు. ఈ రంగంలో ప్రధాన మౌలిక సదుపాయాల పెరుగుదల, విమాన సేవల విస్తరణ బాటన పటిష్టంగా కొనసాగుతోందన్నారు. సమగ్ర వృద్ధిపై ఇక్కడ నిర్వహించిన ఒక సెమినార్లో ఆర్థికమంత్రి తదితర సీనియర్ అధికారులు -
విదేశాలకు మన అత్తరు
యురోపియన్, అమెరికన్ పెర్ఫ్యూమ్స్ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్ టాండన్ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్లో వీరి బ్రాండ్ అఫీషియల్ కానుకల జాబితాలో చేరింది. ఉత్తర్ప్రదేశ్లోని కనౌజ్ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్ పర్ఫ్యూమ్లతో తగ్గిపోయాయి. కనౌజ్లో ఉంటున్న క్రతి, వరుణ్ టాండన్లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు. ‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి. చేస్తున్న ఉద్యోగాలు వదిలి... జర్మనీలోని కార్పొరేట్ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్ కూడా స్వస్థలానికి చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ తీసుకొచ్చాం. ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్లతో సహా బాలీవుడ్ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్ బ్రాండ్ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్. ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులు కూడా... కనౌజ్ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్లోని ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం. ఈకామర్స్ ప్లాట్ఫారమ్లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్లలో రిటైల్ స్పేస్లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం. -
ఉగ్రవాదమే అసలైన సమస్య.. పీ20 మీటింగ్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: 2001 నాటి పార్లమెంట్పై ఉగ్రదాడిని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ప్రపంచం మొత్తం ఉగ్రవాదంతో బాధపడుతోందని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఉగ్రవాద నిర్వచనంపై ఏకాభిప్రాయం సాధించకపోవడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మనం ఎలా కలిసి పని చేయాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటులు ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో 9వ G20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్ (P20)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సరిహద్దులో ఉగ్రవాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని చెప్పిన ప్రధాని మోదీ.. ఉగ్రవాదంతో ప్రపంచం మొత్తం అతిపెద్ద సవాళును ఎదుర్కొంటోందని అన్నారు. మానవత్వానికి ఇది వ్యతిరేకమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించిన మోదీ.. ఘర్షణలు, నిర్బంధాలు సరైన ప్రపంచాన్ని సృష్టించబోవని తెలిపారు. పార్లమెంటరీ విధానాల పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచం పార్లమెంటరీ విధానాల సంగమమని అన్నారు. ఈ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ఏడాదంతా మనం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు. భారత్ 17 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించిందని, 300 సార్లు రాష్ట్ర ఎన్నికలు జరిపినట్లు స్పష్టం చేశారు. పాన్ ఆఫ్రికన్ పార్లమెంట్ కూడా మొదటిసారి పీ20 సమ్మిట్లో పాల్గొంది. జీ20 విభాగంలో పాన్ ఆఫ్రికన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement