-
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
నేడు జగనన్న విద్యా దీవెన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ముందెన్నడూ లేనివిధంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
అక్షరానికి అగ్రపీఠం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగాన్ని అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ విద్యా రంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా రంగానికి తనదైన శైలిలో ఊపిరిలూది ప్రగతి బాట పట్టించారు. ఇంటాబయటా వెల్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. దాదాపు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా రూ. 66,722.36 కోట్లు వ్యయం చేశారు. నాడు–నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు. నవశకానికి నాంది.. ♦ 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం. ♦ ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ కేటాయింపు ♦ టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే. ♦ 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి. ♦ ఈ ఏడాది ముగిసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ♦ నాడు నేడులో తొలి విడత కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ♦ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున జమ. ♦ పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కారం. ♦ 10 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా సందర్శించే అవకాశం. ♦ 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 47 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.15,762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద మరో రూ. 4,267 కోట్లు చెల్లించింది. ♦ ప్రైవేటు వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ కోర్సుల్లో 35 శాతం సీట్లలో రిజర్వేషన్ కోటా అమలు. ♦ గత నాలుగున్నరేళ్లల్లో 1,925 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థికంగా అండ. ♦ నైపుణ్య వర్సిటీ, ప్రత్యేక శిక్షణ సంస్థల ఏర్పాటుతోపాటు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు 2021–22 బడ్జెట్లో రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించారు. మైక్రోసాఫ్ట్తో ఒప్పందం.. ఎడ్యుస్కిల్, సేల్స్ఫోర్స్తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య కోర్సులు పూర్తి చేశారు. ఒక రాష్ట్రంలో 1.64 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే కావడం విశేషం. దీంతో 2018–19లో క్యాంపస్ ఎంపికల్లో 37 వేల మంది ఉద్యోగాలు పొందితే, 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇక 2022–23లో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. దేశ సగటు కంటే మెరుగ్గా జీఈఆర్.. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుండడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో మన రాష్ట్రం దేశ సగటుకంటే చాలా ముందుంది. 2019–20లో ఇండియా సగటు 27.1 శాతం ఉంటే.. రాష్ట్రంలో 35.2 శాతం, 2020–21లో దేశ సగటు 27.3 శాతం ఉంటే రాష్ట్రంలో 37.2 శాతం జీఈఆర్ నమోదు కావడం విశేషం. మరోవైపు కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలు కూడా విద్యా అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. -
‘దీవెన’తో దిమ్మతిరిగి..
సాక్షి, అమరావతి : ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు దుష్ప్రచారం చేయడంలో గోబెల్ను సైతం రాజగురువు రామోజీరావు మించిపోయారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకుని తన విషపుత్రిక ఈనాడులో అబద్ధాలను అదేపనిగా అబద్ధాలను ప్రజలపై రుద్దేందుకు ఎల్లో మీడియా గత ఐదేళ్లుగా తెగ ప్రయాసపడుతోంది. ఇప్పుడు ఎంతో సమున్నతంగా ఉన్న ప్రభుత్వ విద్యా రంగంపై నిస్సిగ్గుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అసత్యాలను వండివారుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ‘దీవెనే శాపమైన వేళ..’ అంటూ విద్యాదీవెన పథకంపై తన అక్కసునంతా రంగరించి ప్రదర్శించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ఉన్నతాశయంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే ప్రస్తుత ప్రభుత్వం జమచేస్తోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అమల్లోగాని, నిధుల విడుదలలో గాని, లబ్ధిపొందుతున్న విద్యార్థుల సంఖ్యలోగాని ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు నూటికి నూరుశాతం విద్యాదీవెన ద్వారా మేలు జరుగుతోంది. అపరిమితంగా ఫీజు రీయింబర్స్మెంట్.. ఇక పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఎలాంటి పరిమితీలేదు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందినీ చదివించవచ్చు. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3.05 లక్షల వరకూ రీయింబర్స్మెంట్ చేస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఇంజినీరింగ్ కోర్సులకు గరిష్టంగా రూ.35 వేలు, ఫార్మాకు రూ.68 వేలు మాత్రమే చెల్లించింది. అలాగే, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనే కాదు, ఎందులోనూ సంతృప్తస్థాయి అన్నమాటే లేదు. ఇక ప్రభుత్వం ఫీజులు ఇచ్చేవరకూ వేచి చూడకుండా పిల్లల తల్లులు కట్టాలంటూ కొన్ని కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయంటూ ఈనాడు వక్రీకరణకు దిగింది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బును జమచేసిన తర్వాత వారంలోగా ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలి. మూడు వారాల్లోగా చెల్లించకుంటే కాలేజీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాయి. దాంతో తదుపరి విడత ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును నేరుగా కాలేజీ ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. దీంతో తల్లితండ్రులపై కాలేజీలు ఒత్తిడి తీసుకువచ్చే ఆస్కారమే లేదు. అలాగే, ఫీజు చెల్లించేంత వరకూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనాడు చెప్పిందీ అబద్ధమే. ఇలా చేయడానికి కాలేజీలకు ఎలాంటి అధికారంలేదు. వివక్ష లేకుండా వసతి దీవెన.. ఇదేకాక.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందిస్తోంది. గత ప్రభుత్వంలో అయితే కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 మాత్రమే ఇచ్చేవారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలకు వార్షికాదాయాన్ని రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.లక్ష పరిమితి పెడితే, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ వసతి దీవెన అమలుచేస్తోంది. వసతి దీవెన డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే జమచేస్తోంది. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం చెల్లింపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు పాలైనా, ఇవ్వాల్సిన అరకొర ఫీజులను ఇవ్వకుండా బకాయి పెట్టినా.. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏనాడూ రామోజీ తన ఈనాడులో ఒక్క కథనాన్ని కూడా ప్రచురించలేదు. కానీ, ఈ ప్రభుత్వం ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ఫీజులు చెల్లించడంతో పాటు, 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సైతం చెల్లించింది. అంతేకాక.. సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తూ పేద విద్యార్థులకు అండగా నిలిచింది. పైగా దేశంలో నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఒక్కటే. అయినా, ఇదేమీ పట్టని రామోజీ మాత్రం ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. నిజానికి.. టీడీపీ పాలన ఐదేళ్లలో చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు సగటున ఏడాదికి రూ.2,428 కోట్లు అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా చెల్లిస్తున్న సగటు మొత్తం రూ.4,044 కోట్లు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10,332 కోట్లు వెచ్చిస్తే.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.15,592.87 కోట్లు ఖర్చుచేసింది. 26.98 లక్షల మందికి విద్యాదీవెన కింద రూ.11,317.11 కోట్లు.. 25.17 లక్షల మందికి వసతి దీవెన కింద మరో రూ.4,275.76 కోట్లు చెల్లించింది. ♦ 2022 అక్టోబరు–డిసెంబరు కాలానికి చెల్లించాల్సిన రూ.698.68 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే చెల్లించింది. ♦ జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి రూ.702.99 కోట్లను ఈ ఏడాది మే 24న చెల్లించింది. ♦ ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికం మొత్తాన్ని ఆగస్టులో చెల్లించింది. ♦ ఇప్పుడు జూలై–సెప్టెంబరు త్రైమాసికం సొమ్ము చెల్లింపు తుపాను కారణంగా వాయిదాపడింది. ఇది ఈనెల 29న భీమవరంలో జరిగే కార్యక్రమంలో 26.98 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన, 25.17 లక్షల మందికి జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇంత ఠంఛనుగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు చెల్లింపులు చేస్తుంటే రామోజీకి దిమ్మతిరిగిపోతోంది. దీంతో విద్యార్థులకు నష్టం జరిగిపోతోందంటూ ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. -
నత్తనడకన ఉపకార దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది. ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది. విద్యార్థులు ఈపాస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది. కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement