-
ఎగ్జిట్ పోల్నిజమెంత?
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్డీయే విజయాన్ని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు దాదాపుగా వెల్లడి అయ్యాయి. దీంతో ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి, ఎంత ఖచ్చితత్వంతో వాస్తవ రూపం దాల్చాయని పరిశీలించేందుకు అవకాశం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఆధిక్యాలను పరిశీలిస్తే.. ఎన్డీయే 347, యూపీఏ 90, ఇతరులు 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే ఇండియా టుడే–మై ఆక్సిస్, చాణక్య–న్యూస్24 అంచనాలు చాలావరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఎన్డీయేకి 339 నుంచి 365 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే యూపీఏకి 77–108, ఇతరులకు 69–95 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. కానీ చాణక్య సరిగ్గా అంచనా వేసింది. ఎన్డీయేకి 350, యూపీఏకి 95, ఇతరులకు 97 వస్తాయని స్పష్టమైన అంకెలు ఇచ్చింది. ఒకవేళ ఆధిక్యతలే కనుక య«థాతథంగా ఫలితాలుగా మారినట్టయితే చాణక్యకి, ఎన్డీయే సంఖ్య (350)కి మధ్య కేవలం మూడు సీట్ల తేడాయే ఉంటుంది. అలాగే యూపీఏ సంఖ్య (95)కు 5, ఇతరుల సంఖ్య (97)కు 8 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఎన్డీయే, యూపీఏ ట్యాలీలు రెండూ కూడా ఇండియా టుడే అంచనా వేసిన సీట్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. గత ఎన్నికలను పరిశీలిస్తే.. ► 2004లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పూర్తిగా తల్లకిందులయ్యాయి. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధించింది. ► 2009లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేపై యూపీఏకి స్వల్ప మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కానీ ఆయా సంస్థల అంచనాలు మరోసారి తప్పయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 100కు పైగా సీట్ల మెజారిటీ సాధించింది. ► 2014లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని ఊహించాయి. అయితే టుడేస్ చాణక్య మినహా ఏదీ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపడుతుందని చెప్పలేకపోయాయి. అసలు ఫలితాలు వచ్చేశాయి.. మరి వివిధ చానళ్లలో ప్రసారమైన ఎగ్జిట్ పోల్స్లో ఏది నిజమయ్యాయి? ఏది తప్పాయి? జనం మూడ్ను అవి పసికట్టగలిగాయా. -
మోదీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. దక్షిణాసియాలో శాంతి, పురోగతి కోసం తాను మోదీ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా ఇమ్రాన్ ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ సొంతంగా మేజిక్ మార్క్ 272 స్ధానాలు దాటి 300 స్ధానాలు గెలుపొందే దిశగా ఫలితాలు సాధిస్తోంది. ఏడు దశల్లో పోలింగ్ జరిగిన 542 లోక్సభ స్ధానాలకు గాను బీజేపీ ఇప్పటికే 14 స్ధానాల్లో గెలుపొంది మరో 288 స్ధానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. -
‘సర్వే అనకుండా.. లగడపాటిని లోపలేయాలి’
సాక్షి, అమరావతి : కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో బయటపెట్టిన వివరాలకు ఆధారాలు చూపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లగడపాటిపై ధ్వజమెత్తారు. లగడపాటి ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు.. ఎన్ని శాంపిల్స్ తీసారు? శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలన్నారు. లేక పోతే చీటింగ్ కేసు నమోదు చేసి లోపలేయాలన్నారు. ఇంకో సారి సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు. వీవీప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయననో జోకర్ స్థాయికి తీసుకెళ్లిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గత డిసెంబరులో కాంగ్రెస్ 3 హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ ఫలితంపై ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజాతీర్పుపై స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. ఒకట్రెండు తప్ప అన్ని సర్వేలూ జగన్కే పట్టంగట్టాయి. లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్న టీడీపీ ఊహలకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది. ఏప్రిల్ 11న తొలి దశలో ఎన్నికలు జరిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ఈ 41రోజులపాటు నెలకొన్న టెన్షన్కు మరికొద్దిగంటల్లో తెరపడనుం ది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది బరిలో ఉండగా.. 25 ఎంపీ స్థానాలకు 319 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు లోపాయకారి ఒప్పందం తో పోటీ చేయగా..వైఎస్సార్సీపీ ఒంటరిగానే బరి లో దిగింది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై దాదాపు స్పష్టమైన అంచనా వెలువడనుంది. దీంతో తెలంగాణతోపాటు ఏపీ పరిణామాలపైనా తెలుగుప్రజల్లో ఉత్సుకత నెలకొంది. ఓట్ల లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్య ర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలి పోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్ల లోనే ఓట్లలెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియో జకవర్గంలో అత్యధికంగా 33 రౌండు పూర్తి చేయా ల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశ ముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమ లూరు, గన్నవరం, నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రైండ్లకు పైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. -
హస్తినలో హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు వెల్లడి కావడానికి ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు ఏమై ఉంటుందా అంటూ దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. మరో వైపు హస్తినలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మంగళవారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఉత్సాహంతో విందు సమావేశం జరపగా.. విపక్షాల కూటమి ఈవీఎంల అం శంపై ఆందోళన భేటీలు నిర్వహించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా ఉండటంతో ఎన్డీయేలో జోష్ కనిపిస్తుండగా.. విపక్షాల్లో మాత్రం నైరాశ్యం అలముకుంది. 2014 కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేయడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం రాత్రి ఇక్కడి అశోకా హోటల్లో ఎన్డీయేలోని కేంద్ర మంత్రి మండలి సభ్యులకు, ఎన్డీయే పక్షాల నేతలకు విందు ఏర్పాటు చేశారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు అద్దం పడు తున్నాయని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నారు. అలాగే, ఫలి తాల వెల్లడి తర్వాత అనుసరించాల్సిన వ్యూహాల్ని చర్చించేం దుకు ఈ విందు సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఒకవేళ వాస్తవ ఫలితాల్లో తమకు సంఖ్యాబలం తగ్గిన పక్షంలో విపక్ష కూటమిలోని పార్టీలను గానీ.. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలను గానీ ఆహ్వానించేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతో భేటీ అయ్యారు. ఈ రెండు సమావేశాల్లోనూ ఆయన చాలా ఉత్సాహంగా కనిపించినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం అవుతాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. డీలాపడిన విపక్షాల కూటమి... యూపీయే కూటమి 130 స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందని, ఈ కూటమితో భావసారూప్యం ఉన్న పార్టీల బలం కూడా 40 సీట్లకు మించదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించ డంతో కేంద్రంలో ఎన్డీయేతర ప్రభుత్వం రావడం అసాధ్యమన్న వాదనలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో 22 పార్టీల విపక్ష కూటమి నైరాశ్యంలో మునిగిపోయింది. ఈవీఎంల అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి ప్రధాన పార్టీల అధినేతల నుంచి స్పందన కరువు కావడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతోపాటు డీఎంకే అధినేత స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వంటి ప్రధాన నేతలు ఈ భేటీకి హాజరు కాలేదు. ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం మరోసారి కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించాయి. అయితే, ఇంతటి కీలక సమావేశానికి ప్రధాన పార్టీల అధినేతలు రాకపోవడంతో విపక్షాల శిబిరం డీలాపడినట్టు స్పష్టంగా కనిపించింది. కలిసొస్తారా.. ‘చే’జారుతారా? ఎన్డీయేకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలను పునరాలోచనలతో పడేశాయి. ముఖ్యంగా వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్లు విపక్ష కూటమితో కలిసొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్డీయేతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షతో ఉన్న మాయావతి.. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి ఫలితాలు విపక్షాల వైపు మొగ్గు చూపినా మాయావతి సారథ్యాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితి లేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మాయావతి సారథ్యానికి మద్దతు ఇస్తున్నట్టు సమాజ్వాదీ పార్టీ కనిపిస్తున్నా.. లోపల మాత్రం వారి ఆలోచన వేరుగా ఉందని అంటున్నారు. బీఎస్పీ గానీ మాయావతి గానీ బలోపేతమయ్యే పరిస్థితి వస్తే తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. అందువల్ల వారి మొగ్గు విపక్ష కూటమి వైపు కంటే ఎన్డీయే వైపే ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్లకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందన్న వార్తలతో సమాజ్వాదీ పార్టీ కూడా విపక్ష కూటమితోపాటు ఉండే అవకాశం కష్టమనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీల్లో ఏదో ఒక పార్టీ విపక్ష కూటమితో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఏ కూటమి చేరువలో ఉంటే ఆ కూటమివైపే ఇతర పార్టీలు చేరువ కావడానికి మొగ్గు చూపిస్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ తమ రాష్ట్రాల ప్రయోజనాల మేరకు షరతులతో కూడిన మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ములాయం, అఖిలేష్కు క్లీన్చిట్పై అనుమానాలు... ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించాయి. ఫలితాల తర్వాత వారి అవసరం ఉంటుందేమోనని భావించే ఎన్డీయే తెరవెనక రాజకీయం నడిపి ఉంటుందని ఆయా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో వివిధ పార్టీల బలబలాలను ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చూపడాన్ని కూడా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. దీనివెనుక ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష కూటమి ఆశలను సజీవంగా ఉంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు సంబంధిత నియోజకవర్గంలో మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ను మంగళవారం ఈసీ ముందుంచింది. తమ డిమాండ్ను ఈసీ పరిష్కరించని పక్షంలో బుధవారం ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గురువారం ఓట్ల లెక్కింపు కావడంతో ఈ పరిణామాలన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి. త్యాగానికి కాంగ్రెస్ సిద్ధం? ఫలితాల్లో ఎన్డీయేకి కొన్ని సీట్లు తక్కువైతే ఎస్పీ, బీఎస్పీల్లో ఒక పార్టీ ఎన్డీయేవైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లే షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మళ్లీ అధికారంలోకి రాకూడ దని కాంగ్రెస్ భావిస్తే ఎలాంటి త్యాగానికైనా ఆ పార్టీ సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కర్ణాటకలో తక్కువ సంఖ్యలో సీట్లు సాధించినప్పటికీ, జేడీఎస్కు ప్రభుత్వ సారథ్య బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. కేంద్రంలో కూడా అదే పరిస్థితి వస్తే మాయావతి లేదా మమత రేసులో ముందుండే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత ఆజాద్ పలు పార్టీల నేతలతో సంప్ర దింపులు జరుపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ సహా ఫెడరల్ ఫ్రంట్ నేతలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement