-
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. -
పుష్ప స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ను ఆడాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 201 పరుగుల టార్గెట్ను ఆర్సీబీ 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్లో రన్ ఛేజింగ్లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో లక్ష్య చేధనలో కోహ్లి ఇప్పటివరకు 24 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 23 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో ధావన్ను కింగ్ కోహ్లి అధిగమించాడు. →అదే విధంగా ఐపీఎల్ సీజన్లో అత్యధిక సార్లు 500 పైగా పరుగులు చేసిన క్రికెటర్గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. వార్నర్ ఇప్పటివరకు 7 సీజన్లలో 500 పైగా పరుగులు చేయగా.. విరాట్ కూడా సరిగ్గా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు మ్యాచ్లు ఆడినహ్లి 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాన్నాడు. -
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్...నవ్వులు పూయిస్తున్న వీడియో
-
రాజమౌళి దర్శకత్వంలో వార్నర్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి యాక్టింగ్ అంటే పిచ్చి. లాక్డౌన్ సమయంలో ఎన్నో టిక్టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేశ్బాబు, దర్బార్లో రజినీకాంత్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీఫేస్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి వైరల్ అయ్యేవి. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఓ యాడ్లో నటించాడు. ఆ ప్రకటనలో దర్శకధీరుడు రాజమౌళి నటించడం మరో విశేషం. నవ్వులు పూయిస్తున్న యాడ్ ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి’ అంటూ రాజమౌళి వార్నర్కి ఫోన్చేసి అడుగుతాడు. దానికి వార్నర్ బదులిస్తూ.. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనతో ఓ సినిమా చేయమని అడుగుతాడు. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో రాజమౌళి ఊహించుకుంటాడు. సెట్స్లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని భయపడిపోయినట్లు యాడ్లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’ అని వార్నర్ అన్నప్పుడు రాజమౌళి చూసే చూపు నవ్వులు పూయిస్తుంది. కొన్ని సార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయంటూ క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అటు సినీ ప్రియులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. Favours are subject to market risk. pic.twitter.com/QSPToEGYzg — CRED (@CRED_club) April 12, 2024 -
IPL 2024: కోహ్లి, వార్నర్ సరసన చేరిన హిట్మ్యాన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అలరించాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఓ అరుదైన క్లబ్లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 1000 పరుగులు (34 మ్యాచ్ల్లో 1026 పరుగులు) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్కు ముందు విరాట్ కోహ్లి మాత్రమే ఢిల్లీపై 1000 పరుగులు మార్కును తాకాడు. కోహ్లి ఢిల్లీపై 28 ఇన్నింగ్స్ల్లోనే 1030 పరుగులు చేశాడు. రోహిత్ ఢిల్లీపై 1000 పరుగులు పూర్తి చేయడంతో మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఒకటి, అంతకంటే ఎక్కువ జట్లపై 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్మ్యాన్ ఢిల్లీతో పాటు కేకేఆర్పై కూడా 1000 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్కు ముందు డేవిడ్ వార్నర్ (పంజాబ్, కేకేఆర్), విరాట్ కోహ్లి (ఢిల్లీ, సీఎస్కే) మాత్రమే ఐపీఎల్లో ఒకటి అంతకుమించి జట్లపై 1000 పరుగులు పూర్తి చేశారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. 235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు సమం
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రిస్ గేల్ రికార్డును వార్నర్ సమం చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 52 పరుగులు చేసిన వార్నర్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. వార్నర్ ఇప్పటివరకు 110 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించగా.. క్రిస్ గేల్ కూడా 110 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో గేల్ రికార్డును వార్నర్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. వీరి తర్వాతి స్ధానాల్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి టీ20ల్లో ఇప్పటివరకు 101 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(52), రిషబ్ పంత్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పృథ్వీ షా(43) పరుగులతో రాణించాడు. వార్నర్,పృథ్వీ షా తొలి వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీఎస్కే బౌలర్లలో పతిరాన 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, ముస్తఫిజర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు -
ఢిల్లీ క్యాపిటల్స్పై రాజస్తాన్ మెరుపు విజయం (ఫొటోలు)
-
స్టోయినిస్కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్కు ఘోర అవమానం..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్లకు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్లో వరుసగా మూడోసారి ఈ పాక్ స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. ది హండ్రెడ్ లీగ్ 2024 సీజన్ డ్రాఫ్ట్లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్, ఆసీస్ యువ సంచలనం టిమ్ డేవిడ్లు సైతం అమ్ముడు పోలేదు. అయితే ఈ డ్రాఫ్ట్లో బాబర్, రిజ్వాన్ను ఎవరూ పట్టించుకో పోయినప్పటికి.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, ఇమాద్ వసీం మాత్రం అమ్ముడుపోయారు. షాహీన్ ఆఫ్రిదీని లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా షాహీన్.. వెల్ష్ ఫైర్ ప్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్, నసీం షాను బర్మింగ్హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. కాగా ఈ డ్రాప్ట్లో వెస్టిండీస్ ఆటగాళ్లకు బారీ డిమాండ్ నెలకొంది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, హెట్మైర్ వంటి విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్లోనే అమ్ముడుపోయారు. పూరన్ను నార్తర్న్ సూపర్ఛార్జర్స్ సెలక్ట్ చేసుకోగా.. ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్మెయర్ లండన్ స్పిరిట్కు ఆడనున్నారు. వీరితో పాటు విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సదరన్ బ్రేవ్ జట్టుకు, రోవ్మాన్ పావెల్ ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించనున్నారు. మరోవైపు మహిళల ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచ్ ఘోష్లను మాత్రం ఈ డ్రాప్ట్లో ఎంపికయ్యారు. మంధానను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకోగా.. రిచా ఘోష్ను బర్మింగ్హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసింది. -
బుట్టబొమ్మ స్టెప్పులు.. వార్నర్ పోటీగా హాలీవుడ్ పాప్ సింగర్!
బుట్టబొమ్మ పాట చెప్పగానే మనోళ్లకు అల్లు అర్జున్ గుర్తొస్తే.. విదేశీయులకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గుర్తొస్తాడు. ఎందుకంటే మనవరకు తెలిసిన ఈ పాటని వార్నర్.. తనదైన స్టెప్పులతో ఇంటర్నేషనల్ ప్రియులకు పరిచయం చేశాడు. ఇప్పుడు అతడికి పోటీగా హాలీవుడ్ పాప్ సింగర్ వచ్చేశాడు. తాజాగా జరిగిన ఓ పార్టీలో కష్టపడుతూనే బుట్టబొమ్మ స్టెప్పులేశాడు. ఇంతకీ ఎవరా సింగర్? ఏంటా సంగతి? (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. 2020 సంక్రాంతికి రిలీజైంది. అయితే సినిమా కంటే పాటలు అదిరిపోయే రేంజులో పాపులారిటీ సంపాదించుకున్నాయి. లాక్డౌన్ టైంలో పలువురు స్టార్స్ ఈ పాటకు స్టెప్పులేసి రీల్స్ చేశారు. వీళ్లందరి సంగతేమో గానీ ఆసీస్ క్రికెటర్ వార్నర్.. సన్రైజర్స్ హైదరాబాద్ జెర్సీతో వేసిన స్టెప్పులైతే కేక. ఇప్పటికీ వార్నర్ ఎక్కడ కనిపించినా మనోళ్లు.. బుట్టబొమ్మ స్టెప్పు వేయమని అరుస్తుంటారు. అలా డేవిడ్ వార్నర్ కాస్త బుట్టబొమ్మ వార్నర్ అయిపోయాడు. ఇకపోతే యూకే దేశానికి చెందిన ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్.. తాజాగా ముంబయిలో కొన్ని ఈవెంట్స్లో పాల్గొనేందుకు వచ్చాడు. తాజాగా జరిగిన ఓ పార్టీలో 'బుట్టబొమ్మ' పాడిన సింగర్ అర్మాన్ మాలిక్తో కలిసి ఇదే పాటకు స్టెప్పులేశాడు. అయితే అనుభవం లేకపోవడం వల్ల.. చేతులు, కాళ్లు కదపడానికి ఎడ్ షీరన్ కష్టపడ్డాడు. మరి వార్నర్-షీరన్.. వీళ్లిద్దరిలో ఎవరు బుట్టబొమ్మ స్టెప్పు బాగా వేశారని అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by ARMAAN MALIK 🧿 (@armaanmalik) -
ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హీరోలు వీరే.. 2024 సీజన్లో ఎవరు..?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ టాప్ రికార్డు అయిన ఆరెంజ్ క్యాప్పై (అత్యధిక పరుగులు) ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐపీఎల్ తొలి ఆరెంజ్ క్యాప్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మార్ష్ 11 మ్యాచ్ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 616 పరుగులు చేసి సీజన్ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. అనంతరం 2009 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఆ సీజన్లో హేడెన్ 12 మ్యాచ్ల్లో 5 అర్దసెంచరీల సాయంతో 572 పరుగులు చేశాడు. 2010 ఎడిషన్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్ల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 2011, 2012 సీజన్లలో ఆర్సీబీ ఆటగాడు క్రిస్ గేల్ వరుసగా రెండు సార్లు (608, 733) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకోగా.. 2013లో సీఎస్కే ఆటగాడు మైక్ హస్సీ (733), 2014లో కేకేఆర్ రాబిన్ ఉతప్ప (660), 2015లో సన్రైజర్స్ డేవిడ్ వార్నర్ (562) ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2016లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి (973) లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు (ఒక సీజన్లో) చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. 2017లో సన్రైజర్స్ వార్నర్ (692), 2018లో సన్రైజర్స్ కేన్ విలియమ్సన్ (735), 2019లో వార్నర్ (692) ముచ్చటగా మూడో సారి, 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కేఎల్ రాహుల్ (670), 2021లో సీఎస్కే రుతురాజ్ గైక్వాడ్ (635), 2022లో రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ (863), 2023లో గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ (890) ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. -
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. డేవిడ్ వార్నర్కు గాయం!
న్యూజిలాండ్తో మూడో టీ20కు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మూడో టీ20కు దూరమయ్యాడు. వార్నర్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండో టీ20కు విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు మూడో టీ20 నుంచి సైతం తప్పుకున్నాడు. ఈ మెరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది. "వార్నర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అతడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అయితే అతడు కచ్చితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 వరల్డ్కప్కు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో పేర్కొంది. కాగా కివీస్తో జరిగిన తొలి టీ20లో వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వార్నర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో రిషబ్ పంత్ గైర్హజరీలో ఢిల్లీ జట్టును డేవిడ్ భాయ్ ముందుండి నడిపించాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
IPL 2024: ఈ సీజన్లో మా కెప్టెన్ అతడే: ఢిల్లీ క్యాపిటల్స్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పునరాగమనం ఖరారైంది. ఐపీఎల్-2024 సీజన్తో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ధ్రువీకరించింది. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడవ ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ వ్యవహరిస్తాడని ఆ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ స్పష్టం చేశాడు. కాగా టీమిండియా కీలక ఆటగాడైన రిషభ్ పంత్.. డిసెంబరు, 2022లో ఘోర ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. అయితే, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ కోలుకోడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. ఈ క్రమంలో టీమిండియా కీలక సిరీస్లతో పాటు... ఐపీఎల్-2023, వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలకు ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్ దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతూ క్రమక్రమంగా కోలుకున్నాడు. మార్చి 22 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ తాజా ఎడిషన్ నాటికి మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పార్థ్ జిందాల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ పంత్ రీఎంట్రీని ధ్రువీకరించాడు. అయితే.. తొలి అర్ధభాగం మ్యాచ్లలో అతడు వికెట్ కీపింగ్ చేయడని పేర్కొన్నాడు. కేవలం కెప్టెన్సీ, బ్యాటింగ్ సేవలకే పరిమితం అవుతాడని వెల్లడించాడు. ‘‘రిషభ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే వికెట్ కీపింగ్ కూడా మొదలుపెట్టాడు. ఐపీఎల్ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని నమ్మకం ఉంది. రిషభ్ కచ్చితంగా ఈ సీజన్లో ఆడతాడు.. అదే విధంగా కెప్టెన్గానూ సేవలు అందిస్తాడని విశ్వసిస్తున్నా. తొలి ఏడు మ్యాచ్లలో కేవలం బ్యాటర్గానే అతడు బరిలోకి దిగుతాడు. ఒకవేళ తన శరీరం ఆటకు సహకరించకపోతే మాత్రం అతడికి విశ్రాంతినిస్తాం’’అని పార్థ్ జిందాల్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. తాను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను రిషభ్ పంత్ ఇటీవల షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. గతేడాది క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించాడు. అయితే, వార్నర్ సారథ్యంలో ఢిల్లీ పదిహేడు మ్యాచ్లకు గానూ కేవలం 5 మాత్రమే గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ హోం మ్యాచ్లు విశాఖలో.. ఎందుకంటే..? View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
IPL: రోహిత్ శర్మకు ఘోర అవమానం.. జట్టులోనూ చోటు కరువు!
IPL's greatest all-time team: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవడం దక్కింది. ఇండియన ప్రీమియర్ లీగ్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ టీమ్ కెప్టెన్గా మిస్టర్ కూల్ ఎంపికయ్యాడు. పదిహేను మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టుకు నాయకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. మాజీ క్రికెటర్లు వసీం అక్రం, డేల్ స్టెయిన్, మాథ్యూ హెడన్, టామ్ మూడీ తదితరులతో పాటు సుమారు 70 మంది జర్నలిస్టులతో కూడిన నిపుణుల బృందం ఈ జట్టును ప్రకటించింది. అంతాకలిసి నాయకుడిగా ధోనికే ఓటు వేయడం విశేషం. జట్టులో స్థానం సంపాదించింది వీళ్లే ఇక ఈ జట్టులో టాపార్డర్లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి, వెస్టిండీస్ పవర్హౌజ్ క్రిస్ గేల్లకు చోటు దక్కింది. అదే విధంగా మిడిలార్డర్లో సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ధోని స్థానం సంపాదించారు. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్లు ఆల్రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకోగా.. రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్ బౌలింగ్ దళ సభ్యులుగా ఎంపికయ్యారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత ధోని సొంతం. ఇక విరాట్ కోహ్లి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు(7263) సాధించిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు వార్నర్(6397).. ఐపీఎల్ లీగ్ రన్స్కోరర్లలో విదేశీ బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక సురేశ్ రైనా మిస్టర్ ఐపీఎల్గా పేరుగాంచగా.. డివిలియర్స్ 151.68పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టిన ఘనత సొంతం చేసుకున్నాడు. అదే విధంగా.. ధోని 5 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు అత్యధికంగా 133 విజయాలు సాధించిన కెప్టెన్గా చరిత్రకెక్కాడు. ఇక బౌలర్లలో చహల్ 187 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. పేసర్లు మలింగ, బుమ్రా ముంబై ఇండియన్స్ ఐదుసార్లు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్కు ఘోర అవమానం మరోవైపు.. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను అరంగేట్రంలో(2022)నే విజేతగా నిలిపి సత్తా చాటాడు. అయితే, ముంబై ఇండియన్స్కు ఐదు ట్రోఫీలు అందించిన సెంచరీ వీరుడు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఆల్టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, ఏబి డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యజువేంద్ర చహల్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: Mike Tyson: బీస్ట్లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ! -
రఫ్ఫాడించిన రసెల్.. వార్నర్ మెరుపులు వృధా
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు. రఫ్ఫాడించిన రసెల్.. రెచ్చిపోయిన రూథర్ఫోర్డ్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. వార్నర్ మెరుపులు వృధా భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్లో విండీస్ విజయం సాధించింది. టీ20 సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్, వన్డే సిరీస్లు జరిగాయి. టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. -
అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్ రికార్డు!
వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో వార్నర్.. కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వార్నర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 36 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ భాయ్ 12 ఫోర్లు, ఒక సిక్స్తో 70 పరుగులు చేశాడు. కాగా వార్నర్కు ఇది టీ20ల్లో 100వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో వంద అర్ధశతకాల మార్క్ను అందుకున్న తొలి క్రికెటర్గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్గా 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో వార్నర్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(91) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్లో వార్నర్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్గా వార్నర్ రికార్డులకెక్కాడు. అయితే ఓవరాల్గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఉన్నాడు. చదవండి: 'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు' -
వందో మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్దే
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తొలి వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్డార్ఫ్, మ్యాక్స్వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్లో జరుగనుంది. -
AUS VS WI 1st T20: వార్నర్ 'ట్రిపుల్ ‘సెంచరీ’
ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్ వార్నర్ టీ20 కెరీర్లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. వార్నర్కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్ టేలర్ 112 టెస్ట్లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, వార్నర్ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ భారీ స్కోర్ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్లో ఔటయ్యాడు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్ 173/5గా ఉంది. వార్నర్, జోష్ ఇంగ్లిస్ (39), మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్వెల్ 10), స్టోయినిస్ (9) ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (6) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలరల్లో అల్జరీ జోసఫ్ 2, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్ను ఆసీస్ క్లీన్స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
విధ్వంసం సృష్టించిన డేవిడ్ వార్నర్
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాది ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ఆసీస్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లిస్ వికెట్ జేసన్ హోల్డర్కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కోవిడ్తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో మార్ష్కు బదులు వార్నర్ టాస్కు వచ్చాడు. Mitchell Marsh is leading Australia but as he is COVID positive, David Warner came for the toss. pic.twitter.com/MBBgZ1z6RE — Johns. (@CricCrazyJohns) February 9, 2024 ఇదిలా ఉంటే, 2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్ను ఆసీస్ క్లీన్స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
AUS vs NZ: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. డేవిడ్ వార్నర్కు ఛాన్స్
న్యూజిలాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. స్వదేశంలో వెస్టిండీస్తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న ఆసీస్ సీనియర్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ తిరిగి కివీస్ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డే, టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పిన డేవిడ్ వార్నర్కు సైతం ఈ జట్టులో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వెల్లింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 21న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కూడా బ్లాక్ క్యాప్స్తో కంగారులు ఆడనున్నారు. కాగా ఆసీస్ జట్టు ప్రస్తుతం విండీస్తో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. కివీస్తో టీ20 సిరీస్కు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా చదవండి: IND vs ENG: రెండో టెస్టులో ఓటమి.. దుబాయ్కు వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు? ఎందుకంటే? -
ఇలాగే ఉంటే ప్లంబర్ పనికి రావాలి.. మారి చూపించాడు! టెస్టుల్లో టీ20 ఇన్నింగ్స్తో..
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం తమ జట్టును ఎంపిక చేసేందుకు ఆస్ట్రేలియా సెలక్టర్లు కూర్చున్నారు. ఆ సమయంలో డేవిడ్ వార్నర్ అనే కుర్రాడి పేరు ప్రస్తావనకు వచ్చింది. అతను అప్పటికే రెండేళ్లుగా టి20ల్లో రాణిస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆసీస్ సంప్రదాయం ప్రకారం దేశవాళీ క్రికెట్లో నాలుగు రోజుల ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడని ఆటగాళ్లను జాతీయ జట్టుకు ఎంపిక చేసే అవకాశం లేదు. టి20 ఫార్మాట్లో ఎంపిక చేసేందుకైనా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాలనేది గట్టి అభిప్రాయం. దీనిపై సెలక్టర్ల సమావేశంలో తీవ్ర చర్చ సాగింది. అతని దూకుడైన ఆటతో కొత్తగా ప్రయోగం చేయవచ్చని ఒక వాదన. అయితే అది ఫస్ట్క్లాస్ క్రికెట్ విలువను తగ్గిస్తుందనేది మరో వాదన. చివరకు మొదటి వాదనే నెగ్గింది. ఆసీస్ చరిత్రలో 1877 తర్వాత ఫస్ట్క్లాస్ స్థాయి క్రికెట్ ఆడకుండానే టీమ్లోకి ఎంపికైన తొలి ఆటగాడిగా వార్నర్ పేరుపొందాడు. అతనూ తన సత్తా చాటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. టి20 శైలి దూకుడుతో టెస్టు క్రికెట్లో అనూహ్య ఫలితాలు సాధించి తర్వాతి ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్లో నంబర్వన్ టెస్టు బ్యాటర్గా నిలిచాడు. అంతే కాదు.. కెరీర్ ఆసాంతం మూడు ఫార్మాట్లలోనూ రికార్డులు కొల్లగొట్టిన అరుదైన ఆటగాళ్ళలో ఒకడిగా వార్నర్ తన పేరు రాసుకున్నాడు. ‘నువ్వు క్రికెట్ను ఇష్టపడ్డావని, బాగా ఆడతావని నాన్న నీకు అవకాశం కల్పించాడు. నువ్వు ఇలాగే ఉంటే ఆట అవసరం లేదు. నేను ప్లంబర్ను. నా పని ఎలా ఉంటుందో నీకు తెలుసు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నాతో పాటు పనికి వచ్చేయ్. నీకూ కొన్ని డబ్బులు వస్తాయి. ఇద్దరం కలసి ఇంటిని నడిపిద్దాం’ 20 ఏళ్ల డేవిడ్కు అతని అన్న స్టీవ్ హెచ్చరిక ఇది. చిన్నతనంలో వార్నర్కు క్రికెట్ను ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటపై అతనికి మొదటనుంచీ ఆసక్తి ఉంది. అభ్యంతరాలు లేకుండా అతని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి అందులో చేర్పించారు. తగిన మార్గనిర్దేశనంతో సరైన శిక్షణ కూడా ఇప్పించారు. ప్రొఫెషనల్ క్రికెటర్ చేయాలనే వారి ఆలోచనకు తగినట్లుగా వార్నర్ సాధన చేశాడు. స్కూల్ స్థాయి క్రికెట్లో అపార ప్రతిభ కనబరచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందేందుకు వార్నర్ అవకాశం దక్కించుకున్నాడు. అయితే బ్రిస్బేన్లోని ఈ కేంద్రంలో క్రమశిక్షణ తప్పడంతో అకాడమీవాళ్లు అతడిని ఇంటికి పంపించేశారు. దాంతో అతని అన్న ఆ రకంగా క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే.. ఆ తర్వాత డేవిడ్ ఏ తప్పూ చేయలేదు. ప్రత్యేక విజ్ఞప్తితో మళ్లీ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. మరో ఆలోచన లేకుండా తీవ్రంగా శ్రమించాడు. మూడేళ్లు తిరిగేసరికి ఏకంగా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికై తనను తాను నిరూపించుకున్నాడు. వార్నర్ సోదరుడితో పాటు అతని తల్లిదండ్రులూ వార్నర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసి ఆనందబాష్పాలు రాల్చారు. మెల్బోర్న్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ పోరులో 43 బంతుల్లోనే 89 పరుగులు చేసిన వార్నర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం విశేషం. ఈ ఇన్నింగ్స్తోనే అతను తన రాకను ప్రపంచ క్రికెట్కు పరిచయం చేశాడు. వేగంగా దూసుకుపోయి.. క్రికెట్లోకి అడుగు పెట్టాక వార్నర్ ఏరోజూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్కూల్, అండర్–13, అండర్–15, అండర్19.. ఇలా జూనియర్ స్థాయి క్రికెట్ నుంచే సంచలన ప్రదర్శనలు కనబరచిన అతను చాలా వేగంగా ఎదిగిపోయాడు. గ్రౌండ్ బయటకు బంతులను పంపించే భారీ షాట్లు, ప్రతీ అడుగులో దూకుడు, అద్భుతమైన ఫీల్డింగ్ వార్నర్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. నాలుగు రోజుల మ్యాచ్ అయినా, వన్డే అయినా, టి20లు అయినా ఒకటే ధాటి.. ఒకే తరహా మెరుపు ప్రదర్శన. సొంత జట్లు సిడ్నీ, న్యూసౌత్వేల్స్ల తరఫున అతను అన్ని రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టులో అవకాశం కూడా తొందరగా వచ్చింది. పెర్త్లోని వాకా మైదానంలో భారత్పై టెస్టులో 69 బంతుల్లో చేసిన శతకం వార్నర్ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైస్ కెప్టెన్సీ అవకాశం వచ్చి చేరింది. కెరీర్ ఆరంభంలో ఉడుకు రక్తంతో ఇంగ్లండ్ ఆటగాడు రూట్పై పబ్లో దాడి చేసినా.. అతని ప్రదర్శన ముందు ఆ ఘటన వెనక్కి వెళ్లిపోయి చెడ్డ పేరును తుడిచిపెట్టింది. వరుసగా ఏడేళ్ల పాటు ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న ఓపెనర్గా వార్నర్ కెరీర్ అద్భుతంగా సాగింది. పాతాళానికి పడేసిన క్షణం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనేది సాధారణంగా ఆటగాళ్ల లక్షణం. కానీ ఏం చేసైనా, ఎలాగైనా ఆటలో గెలవాలనేది ఆస్ట్రేలియన్ల సూత్రం. ఎక్కువ సందర్భాల్లో ఇది బాగా పని చేసినా.. పరిధి దాటినప్పుడు అది సమస్యను తెచ్చి పెడుతుంది. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్టౌన్లో టెస్టు మ్యాచ్.. అంతకు ముందు మ్యాచ్లో ఆసీస్ ఓటమిపాలైంది. పైగా గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా కీపర్ డి కాక్తో వ్యక్తిగత దూషణలతో వార్నర్ గొడవ పెట్టుకున్నాడు. ఆ కసి ఇంకా మనసులో ఉంది. దాంతో ఈ మ్యాచ్లో పైచేయి సాధించే ఆలోచనతో అతను చేసిన ప్రయత్నం కెరీర్ను దెబ్బ కొట్టింది. కెప్టెన్ స్మిత్, మరో ఆటగాడు బాన్క్రాఫ్ట్తో కలసి కుట్రకు వార్నర్ తెర లేపాడు. స్యాండ్ పేపర్తో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేయడం అంతా బహిర్గతమైంది. దాంతో ఏడాది పాటు క్రికెట్ ఆడకుండా నిషేధంతో పాటు జీవితకాలం కెప్టెన్సీ ఇవ్వకుండా వేటు పడింది. దాంతో ఒక్కసారిగా అతను నైతికంగా కూడా నేలకూలాడు. తిరిగొచ్చి కొత్తగా.. సంవత్సర కాలపు నిషేధంలో వార్నర్ తనను తాను మార్చుకున్నాడు. ముందుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడంతో పాటు ఆట కారణంగా కోల్పోయిన వ్యక్తిగత సంతోషాన్ని వెతుక్కున్నాడు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు, స్నేహాలు అతడికి గుడ్ బాయ్ ఇమేజ్ను తీసుకొచ్చాయి. క్రికెటర్గా వార్నర్ ఘనమైన రికార్డు కారణంగా జట్టులో పునరాగమనానికి ఇబ్బంది కాలేదు. ఏడాది పూర్తి కాగానే మళ్లీ జట్టులోకి వచ్చేసిన అతను తిరిగి చెలరేగి తన విలువేంటో చూపించాడు. వన్డే వరల్డ్ కప్, యాషెస్ సిరీస్, సొంతగడ్డపై పాకిస్తాన్తో చేసిన ట్రిపుల్ సెంచరీతో వార్నర్ పరుగుల ప్రదర్శన జోరుగా కొనసాగింది. ఈసారి అన్నింటికంటే పెద్ద మార్పు మైదానంలో అతని ప్రవర్తనే. ఒక్కటంటే ఒక్క వివాదం రాకుండా జాగ్రత్తపడిన అతను గ్రౌండ్లో తన ఆట తప్ప మరొకటి పట్టించుకోలేదు. మాటల్లో దూకుడు, ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే తన కలుపుగోలుతనంతో అందరికీ ఇష్టుడయ్యాడు కూడా. వార్నర్ను మళ్లీ కెప్టెన్ చేసే చర్చలో భాగంగా అతడిని ట్యాంపరింగ్ వివాదంలో కుటుంబంతో సహా బహిరంగ విచారణకు హాజరు కావాలని ఆసీస్ బోర్డు సూచించింది. అయితే తన తప్పునకు తన కుటుంబాన్ని లాగడం అనవసరం అంటూ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తాను సాధించినదాంతో ఇలాగే బాగున్నానంటూ వార్నర్ దండం పెట్టేశాడు. ఐపీఎల్తో భారత అభిమానులకు చేరువై.. ఐపీఎల్ ఆరంభంలో ఢిల్లీ జట్టుకు ఆడిన వార్నర్ ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లోకి ఎంపికయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్తో జట్టుకు వరుస విజయాలు అందించిన అతను 2016లో ఒంటిచేత్తో టీమ్ను ఐపీఎల్ విజేతగా కూడా నిలిపాడు. ఈ క్రమంలో తెలుగు పాటలు, డాన్స్లతో అతను మన అభిమానులకూ చేరువయ్యాడు. ఎంతగా అంటే వార్నర్ అంటే మనోడే అన్నంతగా హైదరాబాద్ ఫ్యాన్స్ అతడిని సొంతం చేసుకున్నారు. కరోనా టైమ్లో అతను తన ఇంట్లో తెలుగు సినిమా పాటలకు చేసిన డాన్స్లు, అతని అమ్మాయిలు కూడా అదే తరహాలో కనిపించడం విశేషంగా ఆకట్టున్నాయి. ఆ తర్వాత ఎప్పుడు మైదానంలోకి దిగినా ఈ వినోదాన్ని అందించడానికి అతను సిద్ధంగా ఉండేవాడు. ముఖ్యంగా పుష్ప తగ్గేదేలే సిగ్నేచర్ సైన్.. శ్రీవల్లి పాటకు డాన్స్ మైదానంలో రొటీన్ అయిపోయాయి. అల్లు అర్జున్ బుట్టబొమ్మ పాటకు కూడా అంతే ఉత్సాహంతో వార్నర్ డాన్స్ చేసి చూపించడం విశేషం. వివిధ కారణాలతో సన్రైజర్స్ టీమ్ వార్నర్ను కాదనుకున్నా.. తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఇంకా అతడిని తమవాడిలాగే చూస్తున్నారనేదానికి ఇటీవల హైదరాబాద్లో జరిగిన వరల్డ్ కప్ వామప్ మ్యాచ్లో అతనికి లభించిన ఆదరణే ఉదాహరణ. అన్నీ సాధించి.. టెస్టు, వన్డే క్రికెట్కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వచ్చే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది. ప్రపంచ క్రికెట్లో ప్రతిష్ఠాత్మక విజయాలన్నింటిలో భాగమైన అతి అరుదైన ఆటగాడిగా వార్నర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు వన్డే వరల్డ్ కప్లు, ఒక టి20 వరల్డ్ కప్, టెస్టుల్లో వరల్డ్ కప్లాంటి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. 2021.. టి20 వరల్డ్ కప్లో మెరుపు బ్యాటింగ్తో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా కూడా నిలిచాడు. ఐపీఎల్ టైటిల్ను, అదీ కెప్టెన్గా సాధించిన ఘనత కూడా వార్నర్ సొంతం. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వార్నర్ 111 టెస్టులు, 161 వన్డేలు, 99 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
హెలికాప్టర్లో నేరుగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన వార్నర్..!
బిగ్బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥 - What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 సాధారణంగా ఏ క్రికెటర్కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్ కోసం బిగ్బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు. గత బీబీఎల్ సీజన్ సందర్భంగా వార్నర్ సిడ్నీ థండర్స్తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్తో జరుగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. David Warner has arrived at SCG in Helicopter for the Big Bash match. - The entertainer is here....!!!!pic.twitter.com/7knZ9BUX58 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిగ్బాష్ లీగ్ అనంతరం వార్నర్ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఈ లీగ్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్కప్ దృష్ట్యా వార్నర్ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. త్వరలో విండీస్తో జరిగే టీ20 సిరీస్కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్ ప్రకటించాడు. వార్నర్ బిగ్బాష్ లీగ్లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు. -
స్టీవ్ స్మిత్కు ప్రమోషన్
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు ఆసీస్ టెస్ట్ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించింది. టెస్ట్ల నుంచి వార్నర్ రిటైర్ కావడంతో ఆసీస్ ఓపెనర్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. స్వదేశంలో విండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన బెయిలీ.. ఇదే సందర్భంగా స్మిత్ న్యూ ఇన్నింగ్స్పై (ఓపెనర్) ప్రకటన చేశాడు. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకునే ఆసీస్ సెలెక్టర్లు స్మిత్కు ఓపెనర్గా అవకాశం ఇచ్చారు. మరోవైపు విండీస్తో సిరీస్కు రెగ్యులర్ ఓపెనర్ మ్యాట్ రెన్షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో వేచి చూడాలి. లెగ్ స్పిన్ బౌలర్గా మొదలైన ప్రస్తానం.. టెస్ట్ల్లో స్టీవ్ స్మిత్ ప్రస్తానం రకరకాల మలుపులు తిరుగూ సాగింది. లెగ్ స్పిన్ బౌలర్గా కెరీర్ ప్రారంభించిన స్మిత్.. దినదినాభివృద్ది చెందుతూ ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్్.. ఇప్పుడు ఓపెనర్గా ప్రమోషన్ పొందాడు. వన్డే జట్టు కెప్టెన్గానూ.. ఆసీస్ సెలెక్టర్లు విండీస్తో టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్కు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించారు. వన్డే సిరీస్కు కమిన్స్తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్లకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
'అతడు ఓపెనర్గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శకం ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో మూడో టెస్టు సిరీస్ అనంతరం తన 13 ఏళ్ల కెరీర్కు వార్నర్ ముగింపు పలికాడు. దీంతో టెస్టుల్లో డేవిడ్ వార్నర్ వారుసుడు ఎవరన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే టెస్టుల్లో ఆసీస్ ఓపెనర్గా వార్నర్ స్ధానాన్ని సీనియర్ స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ను స్టీవ్ స్మిత్నే ప్రారంభించాలని క్లార్క్ తెలిపాడు. కాగా వార్నర్ స్దానం కోసం మార్కస్ హారిస్, కామెరాన్ బాన్క్రాఫ్ట్, మాట్ రెన్షా వంటి ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. "స్టీవ్ స్మిత్ ఓపెనర్గా రావాలని నేను కోరుకుంటున్నాను. అతడు ఓపెనర్గా వస్తే ఏడాదిలోనే టెస్టుల్లో నంబర్వన్ బ్యాటర్గా అవతరిస్తాడు. స్మిత్ అద్భుతమైన ఆటగాడు. మూడో స్దానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఏ స్ధానంలో వచ్చినా మెరుగ్గా రాణించగలడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. అతడు బంతిని చక్కగా గమనించి ఆడుతాడు. స్మిత్ కూడా ఓపెనర్ పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను. అతడు ఓపెనర్గా వస్తే 12 నెలల్లోనే అత్యుత్తమ ఓపెనర్గా నిలుస్తాడు. అంతేకాకుండా బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో పాకిస్తాన్తో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఇప్పుడు కరేబియన్లతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమవుతోంది. జనవరి 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: David Warner: వార్నర్ ‘గ్రేట్’ క్రికెటర్ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
Advertisement