-
Lok sabha elections 2024: నాలుగో విడత బరిలో 1,717 మంది: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభకు నాలుగో విడతలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పోలింగ్లో 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 సీట్లకు మొత్తం 4,264 నామినేషన్లు అందాయి. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిసిన తర్వాత 1,717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ దశలో ఒక్కో స్థానానికి సగటున 18 మంది పోటీ పడుతున్నట్లు శుక్రవారం న్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో 979 మంది.. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా 1,488 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 625 ఆమోదం పొందగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మల్కాజ్గిరి స్థానానికి అత్యధికంగా 177 నామినేషన్లు, నల్గొండ, భువనగిరి స్థానాలకు 144 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ స్థానాలకు 1,103 నామినేషన్లు అందాయి. పరిశీలన అనంతరం 503 నామినేషన్లు ఆమోదం పొందగా మొత్తం 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో .. నాలుగో విడత పోలింగ్ జరిగే బిహార్లోని 5 పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీలో ఉన్నారు. జమ్మూకశీ్మర్లోని ఒక్క సీటుకు 24 మంది, జార్ఖండ్లోని 4 నియోజకవర్గాలకు 45 మంది, మధ్యప్రదేశ్లోని 8 సీట్లకుగాను 74, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 298 మంది, ఒడిశాలోని 4 సీట్లకు 37 మంది, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాల్లో 130 మంది, పశి్చమబెంగాల్లోని 8 సీట్లకు 75 మంది బరిలో నిలిచారు. -
గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో మీకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి చేకూరనుంది అంటూ గ్యారంటీలు, ష్యూరిటీల పేరిట ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా వ్యక్తిగతంగా ఇంత లభిస్తుందంటూ గ్యారంటీ కార్డులు ఇవ్వడం, ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఈ విధంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. పలు రాజకీయ పార్టీలు ఈ విధమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ పేరిట ప్రత్యేకంగా ఒక వెబ్లింక్, యాప్ను డెవలప్చేసి అందులో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బాబు ఆరు ష్యూరిటీల పేరిట మీ కుటుంబానికి ఇంతమొత్తం లబ్ధిచేకూరుతుందంటూ గ్యారంటీ కార్డులు, మెసేజ్లు పంపుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. 1. ఓటర్లు మిస్డ్ కాల్, మొబైల్ నంబర్, టెలిఫోన్ నంబర్లను ఇవ్వడం ద్వారా నమోదు అవ్వండి అంటూ పత్రికా ప్రకటనలివ్వరాదు. 2. కరపత్రాల రూపంలో గ్యారంటీ కార్డులను పంచుతూ ఓటర్ల నుంచి పేరు, వయసు, మొబైల్ నంబర్, ఎపిక్ నంబర్, నియోజకవర్గం పేరు సేకరించరాదు. 3. ప్రభుత్వ పథకాల లబ్ధి పేరుతో రేషన్కార్డు, బూత్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, నియోజకవర్గం పేరు వంటి వివరాలు తీసుకోరాదు. 4. రాజకీయ పారీ్టలు వెబ్ ప్లాట్ఫాం, యాప్ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించరాదు. 5. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పథకాల వివరాలతో పత్రికా ప్రకటనలు, కరపత్రాలు ఇవ్వరాదు. -
నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారం..
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత వెంటనే బస్సుయాత్ర తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో బీఆర్ఎస్ రూపొందించిన షెడ్యూల్ మేరకు శుక్రవారం రాత్రి రామగుండంలో రోడ్ షోకు కేసీఆర్ హాజరవుతారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రచారం నిలిపివేసిన కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్న కేసీఆర్ రాత్రికి రామగుండం చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం సాయంత్రం మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో జరిగే రోడ్ షోల్లో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ వరకు గతంలో నిర్ణయించిన షెడ్యూలుకు అనుగుణంగానే కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10న సిరిసిల్లలో రోడ్షో, సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. గురువారం జమ్మికుంట, వీణవంకలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండగా, ఈసీ ఆదేశాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రజా స్పందన ఎలా ఉంది? బుధవారం రాత్రి ఫామ్హౌస్కు చేరుకున్న కేసీఆర్ గురువారం పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడి పార్టీ ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించారు. ఇప్పటివరకు బస్సుయాత్ర, రోడ్ షోలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. రాబోయే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. ప్రచార లోపాలను సరిదిద్దుకుని పార్టీ యంత్రాంగంతో మరింత సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాజా సర్వేల ప్రకారం బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించారు. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలతో జరిగే నష్టాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. -
కేసీఆర్ ప్రచారంపై నిషేధం.. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని సూచన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు 48 గంటల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మే ఒకటో తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని, మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. బస్సు యాత్రలో భాగంగా మానుకోటలో ఉన్న కేసీఆర్కు అధికారులు ఈసీ ఆదేశాలను అందజేశారు. దీంతో మహబూబాబాద్ రోడ్ షోలో రాత్రి 7.45 గంటలలోపు ప్రసంగాన్ని ముగించిన కేసీఆర్.. ఈసీ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈసీ విధించిన గడువు ముగిశాక కేసీఆర్ తిరిగి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో.. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఏప్రిల్ 5న ‘పొలం బాట’పేరిట కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. నేత కార్మీకులను ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్ రూ.500 చొప్పున బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్ను వేటాడతామంటూ మాట్లాడారు. ఇలా సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్.. ఏప్రిల్ 6న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్పై కేసీఆర్ అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విచారణ జరిపి ఏప్రిల్ 10న నివేదిక సమర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ నివేదిక ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్కు ఏప్రిల్ 16న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘విలేకరుల సమావేశంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే కాంగ్రెస్ ప్రత్యేకంగా పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణ, సిరిసిల్ల ఎన్నికల ఇన్చార్జులుగా పనిచేస్తున్న అధికారులకు తెలంగాణ మాండలికం పూర్తిగా అర్థం కాదు. నేను చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిషులోకి తప్పుగా అనువదించడంతోపాటు వక్రీకరించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాలు, పథకాలను మా త్రమే విమర్శించాను’’అని కేసీఆర్ ఈసీకి సమా ధానం ఇచ్చారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ.. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో, 2023 అక్టోబర్లో బాన్సువాడ సభలో చేసిన వ్యాఖ్యలపైనా హెచ్చరికలు చేశామని గుర్తు చేసింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. సీఎం రేవంత్పై బీఆర్ఎస్ ఫిర్యాదు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నకిలీ పత్రాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని, ఆయనపై చ ర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి బుధవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్ల మూసివేతకు సంబంధించి గతేడాది మే 12న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లోని అంశాలను వక్రీకరిస్తూ.. నకిలీ సర్క్యులర్ను ఉద్దేశపూర్వకంగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు రేవంత్రెడ్డి తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సుయాత్ర రీ షెడ్యూల్పై కసరత్తు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజుల బస్సుయాత్రను కేసీఆర్ చేపట్టారు. మిర్యాలగూడలో మొదలైన యాత్ర వరుసగా 8 రోజుల పాటు సాగి బుధవారం రాత్రి మహబూబాబాద్కు చేరుకుంది. కానీ ఈసీ ఆదేశాలతో రెండు రోజులపాటు బస్సుయాత్రను నిలిపివేశారు. షెడ్యూల్ ప్రకారం.. కేసీఆర్ బుధవా రం రాత్రి వరంగల్లో బస చేసి.. గురువారం జమ్మి కుంట, వీణవంకలలో, శుక్రవారం రామగుండంలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉంది. ఈసీ నిషేధం నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని రీషెడ్యూల్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మార్పులపై గురువారం స్పష్టత ఇస్తామని ప్రకటించింది.తెలంగాణ గొంతుపై నిషేధమా?: కేటీఆర్కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తప్పుపట్టారు. ‘ఎక్స్’వేదికగా తన స్పందనను పోస్ట్ చేశారు.‘‘ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతు కేసీఆర్పైనే నిషేధమా? ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్కు కమిషన్కు వినిపించలేదా? వేలాది మంది పౌరులు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదు లు చేస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. రేవంత్ బూతులు ఎన్నికల కమిషన్కు ప్రవచనాల్లా అనిపించాయా? అసభ్య పదజాలం వాడుతున్న తెలంగాణ సీఎం రేవంత్పై ఎలాంటి చర్యలూ ఉండవా? బడే భాయ్.. చోటే భాయ్ కలసి చేసిన కుట్ర కాదా ఇది. కేసీఆర్ పోరుబాటతో బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు వణికిపోతున్నాయి? మీ అహంకారానికి, వ్యవస్థల దుర్వి నియోగానికి తెలంగాణ ప్రజలు దీటైన సమాధానం ఇస్తారు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రశ్నిస్తే ప్రచారం వద్దంటున్నారు: హరీశ్రావు‘‘కాంగ్రెస్, బీజేపీల మీద కేసీఆర్ గట్టిగా కొట్లాడుతున్నారనే రెండు రోజులు ప్ర చారం ఆపారు. మోదీ మత విద్వేషాలు రెచ్చ గొడితే.. రేవంత్ బూతులు మాట్లాడితే ఎన్ని కల కమిషన్కు కనిపించవా? ప్రశ్నించే కేసీఆర్ను మాత్రం ప్రచారం చేయొద్దు అంటు న్నారు. రెండు రోజులు కేసీఆర్ ప్రచారం ఆగినంత మాత్రం జరిగేదేంటి?’’అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెలో ఉంటారని చెప్పా రు. కేసీఆర్ బస్సుయాత్ర చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ గజగజ వణుకుతున్నాయన్నారు. కేసీఆర్ అంతటి వ్యక్తిని దుర్భాషలు ఆడుతున్న రేవంత్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.పోలింగ్ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీకరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలుకొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే.. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలోని ఖానాపూర్ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ముథోల్. పెద్దపల్లి లోక్సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి. వరంగల్ లోక్సభ స్థానంలోని స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట్. మహబూబాబాద్ లోక్సభ స్థానంలోని డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్ (ఎస్టీ), నర్సంపేట్. ఖమ్మం లోక్సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ).
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement