-
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
విజయ్ ఏమంటాడోనని తెగ భయపడిపోయా..: డైరెక్టర్
పాప్ సురేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ కన్గళ్. ప్రతాప్ నిర్మించిన ఈ మూవీలో డాలీ ఐశ్వర్య హీరోయిన్గా నటించారు. చార్లెస్ ధనా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు ప్రజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇరవిన్ కన్గళ్ఆడియో లాంచ్ దర్శకులు కథ సరిగా చెప్పట్లేదు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, కథానాయకుడు పాప్ సురేష్ మాట్లాడుతూ చిన్న చిత్రంగా ప్రారంభించిన ఈ చిత్రం విడుదలవుతుందా? అనే సందేహం కలిగిందన్నారు. అలాంటిది ఇప్పుడీ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రమని పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు పాప్ సురేష్ కథను చాలా బాగా చెబుతారని, నటుడు ప్రజన్ చెప్పారని.. నిజానికి ఇప్పుడు దర్శకులు కథను చెప్పడం లేదన్నారు. ఇంతకు ముందు కథ చెప్పగానే చిత్రం చూసినట్లు ఉండేదన్నారు. కొందరైతే చెప్పిన కథను అలానే తెరకెక్కించలేకపోతున్నారని, అక్కడే సమస్య తలెత్తుతుందన్నారు. తిరుపాచ్చి సినిమాలో ఓ స్టిల్ టాప్ 5లో ఉన్నా.. తాను తిరుపాచ్చి చిత్రానికిగానూ విజయ్కు కథ చెప్పి తెరకెక్కించానని, అయితే చిత్రం పూర్తి అయిన తరువాత ప్రసాద్ ల్యాబ్లో తానూ, విజయ్ కలిసి చిత్రాన్ని చూశామని అనంతరం విజయ్ ఏమంటారోనని బిక్కు బిక్కుగా ఉన్నానన్నారు. అయితే ఆయన మీరు కథ చెప్పిన దాని కంటే మూడు రెట్లు బాగా చిత్రం వచ్చిందని చెప్పారన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది టాప్ 10 దర్శకుల్లో మీరు ఉంటారని చెప్పారన్నారు. అయితే ఆ ఏడాది టాప్ ఐదుగురి దర్శకుల్లో తాను ఉన్నానని చెప్పారు. కాగా ఇరవిన్ కన్గళ్ చిత్రాన్ని ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేరరసు పేర్కొన్నారు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
అటు డాక్టర్గా ఇటు హీరోగా.. త్వరలోనే డబుల్ టక్కర్..
ధీరజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డబుల్ టక్కర్. మీరా మహతి దర్శకత్వం వహిస్తుండగా ఏర్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. స్మృతి వెంకట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని, గౌతమ్ రాజేంద్రన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. నటి కోవై సరళ, ఎంఎస్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం యానిమేషన్ పాత్రలతో కలిసి నటీనటులు నటించడం అన్న వినూత్న ప్రయోగంతో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్గా తెరపై రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. ఇందులో హీరో ధీరజ్ మాట్లాడుతూ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, షారుక్ ఖాన్ వంటి ప్రముఖ హీరోల సినిమాల ఆడియో ఆవిష్కరణ వేడుకలు తరువాత ఇదే వేదికపై డబుల్ టక్కర్ చిత్ర ఆడియో ఆవిష్కరణ నిర్వహించే అవకాశం కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సపోర్ట్ చేసిన దర్శకుడు రవికుమార్, జయం రవిలకు ప్రేమతో కూడిన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడండి.. ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. జయంరవి మాట్లాడుతూ.. డబుల్ టక్కర్ టైటిల్.. హీరో కోసమే పెట్టినట్లు అనిపిస్తోందన్నారు. డాక్టర్ అయిన ధీరజ్ ఇప్పుడు యాక్టర్గా మారి రెండు రంగాల్లో రాణిస్తున్నానన్నారు. తన మంచి మిత్రుల్లో ధీరజ్ ఒకరని, ఆయనతో కలిసి త్వరలో ఒక చిత్రం చేయాలనిపిస్తోందన్నారు. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చదవండి: కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్కు పెళ్లయిపోయింది -
పాత సినిమాల పోస్టర్లు అలా ఉండేవి.. కానీ ఇప్పుడు?: వైరముత్తు
మాపిల్ లీఫ్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు ఈవీ గణేష్ బాబు కథానాయకుడిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కట్టిల్. ప్రముఖ ఎడిటర్ బి.లెనిన్ కథ, కథనాలు అందించిన ఈ చిత్రంలో సృష్టిడాంగే హీరోయిన్గా నటించారు. వైరముత్తు మదన్ పాటలను రాసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. తుపాకీ శబ్ధాల మధ్య పిల్లనగ్రోవిలా ఉంటుందీ సినిమా ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీత రచయిత వైరముత్తు మాట్లాడుతూ కట్టిల్ వంటి చిన్న చిత్రాలు బాగా ఆడితేనే తమిళ సినిమాకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలతోనే ప్రతిభావంతులైన నూతన కళాకారులు లభిస్తారన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చూడాలని ఆసక్తిని కలిగిస్తాయని.. అలాంటి తుపాకీ శబ్దాల మధ్య గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో పిల్లల గ్రోవి వాయిస్తున్నారని పేర్కొన్నారు. మంచి కథాంశంతో రూపొందిన చిన్న చిత్రాలు మన మనసుల్ని ఉల్లాసపరిచి గాల్లో తేలేలా చేస్తాయన్నారు. కట్టిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణలో ప్రముఖులతో యూనిట్ సభ్యులు అలాంటివి చూస్తున్నారా? ఇలాంటి చిత్రాలే ఆలోచనలను పెంచుతాయన్నారు. పాత సినిమాల పోస్టర్లను చూస్తే అందులో మహిళలకు ప్రాముఖ్యత నిచ్చేవిగా ఉన్నాయన్నారు. ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాలను చూడగలుగుతున్నామా..? అని ప్రశ్నించారు. మహిళలకు సమానత్వం కలిగించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజయినప్పుడే అది మంచి కాలం అనీ, అలాంటి కాలాన్ని గణేష్ బాబు కట్టిల్ చిత్రంతో తీసుకొచ్చారని వైరముత్తు పేర్కొన్నారు. ఆయన భావాలను, బాధను తెరపై ఆవిష్కరించిన చిత్రం కట్టిల్ అనీ, ఈ చిత్ర గీత రచయిత మదన్ కార్తీకి, దర్శకుడు గణేష్ బాబుకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఈ నటి మాటల్లోనే ఆన్సర్ దొరికేసింది! -
ఫ్రెండ్షిప్ నేఫథ్యంలో వస్తున్న కుంబారి.. ఆడియో రిలీజ్!
రాయల్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై టి.కుమారదాస్ నిర్మిస్తున్న చిత్రం 'కుంబారి'. ఈ చిత్రంలో విజయ్ విశ్వ, నటి నలీఫ్ జియా, మహిళా సంజీవి నాయకిగానూ, జాన్ విజయ్ పరుత్తివీరన్ సరవణన్, శ్యామ్స్, మధుమిత, సెంథి, కాదల్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కవి జోసెఫ్ కథ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ చిత్రానికి జై ప్రకాష్ జై సన్, పృథ్వీ కలిసి సంగీతమందించారు. తాజాగా ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్ కుమార్, ఎస్సార్ ప్రభాకరన్, శరవణ శక్తి, జీవ, అప్పుకుట్టి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా? ) ఈ సందర్భంగా నిర్మాత కుమార్ దాస్ మాట్లాడుతూ.. స్నేహం కథాంశంగా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రేమ, వినోదం, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్తో పాటు మంచి జనరంజకమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. సాధారణంగా చిన్న చిత్రాలని పక్కన పెట్టేస్తున్నారని, ఇలాంటి చిన్న చిత్రాల ద్వారానే ప్రముఖ స్టార్స్ తయారవుతున్నారని ఆయన అన్నారు. అప్పట్లో చిన్న చిత్రంలో నటించిన శివాజీరావు అనే వ్యక్తి ఇప్పుడు సూపర్ స్టార్గా రాణిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ విశ్వ మాట్లాడుతూ.. కుంబారి చిత్ర షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసినట్లు చెప్పారు. నిర్మాత చిత్ర బడ్జెట్ గురించి ఆలోచించ వద్దని మొదట్లోనే చెప్పారన్నారు. చిత్రం బాగా వచ్చిందని ఆయన వెల్లడించారు. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement