కాంగ్రెస్ నేతలకు సోనియా వార్నింగ్ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతలకు సోనియా వార్నింగ్

Published Thu, Feb 12 2015 11:18 PM

కాంగ్రెస్ నేతలకు సోనియా వార్నింగ్ - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై వాదులాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. బహిరంగంగా తిట్టిపోసుకోవడం మానుకోవాలని సూచించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంతో కాంగీయులు ఒకరిఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో మేడమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్న పీసీ చాకో గురువారం సోనియాను కలిశారు. ఢిల్లీ ఓటమిపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతల బహిరంగ వాదులాటపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.     ఈ భేటీ ద్వారా పార్టీ నాయకులకు గట్టి సందేశం పంపారు.

Advertisement
Advertisement