న్యూఢిల్లీ : రాజ్యసభలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.00గంటలకు ప్రారంభమైన సభ వెంటనే 2.00 గంటలకు వాయిదా పడింది. బీజేపీకి చెందిన కేంద్రమంత్రితో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టిన పట్టువిడవకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్పై రాజ్యసభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్పై ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లో దూసుకు వెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో ఛైర్మన్ స్థానంలో ఉన్న పి జె కురియన్ మీ స్థానాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళనకు మిగతా ప్రతిపక్ష సభ్యులు మద్దతు తెలిపారు. దాంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే సదరు బీజేపీ నేతల రాజీనామాపై కాంగ్రెస్ పట్టుపట్టింది. అందుకు అధికార బీజేపీ ససేమిరా అంది. దాంతో సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై లోక్ సభ స్పీకర్ 5 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేటు వేశారు. అందుకు నిరసనగా రాజ్యసభలో ఎంపీలు ఆందోళనకు దిగారు.
రాజ్యసభ మళ్లీ వాయిదా
Published Tue, Aug 4 2015 12:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement