- సంప్రదాయ భేటీకి డ్రాగన్ దూరం
- లడఖ్లో రాళ్లదాడికి పాల్పడిన డ్రాగన్
న్యూఢిల్లీ: జాతీయ పండుగల సందర్భంగా సరిహద్దుల వద్ద భారత్, చైనాలు ఏటా ప్రత్యేకంగా భేటీ అవుతూఉంటాయి. మొత్తం ఐదు చోట్ల ఇరుదేశాల సైనికాధికారులు కలుసుకుని మాట్లాడుకోవడం, అభినందనలు తెలుపుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ ఈసారి చైనా ఆ సంప్రదాయ భేటీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
మీటింగ్కు రావాల్సిందిగా మంగళవారం భారత బలగాలు.. చైనా అధికారులకు ఫోన్ చేసినప్పటికీ అటు నుంచి స్పందన రాలేదు. పైగా, అదే సమయంలో డ్రాగన్.. భారత జవాన్లపై రాళ్ల దాడికి పాల్పడటం మరింత ఉద్రిక్తతకు కారణమైంది.
జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ప్యాంగ్యాంగ్ సరస్సుకు భారత్ వైపు ఉన్న ఒడ్డున.. ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం చైనా చొరబాటుకు ప్రయత్నించిందని, భారత బలగాలు అప్రమత్తమై చొరబాటును తిప్పికొట్టాయని, అనంతరం చైనా బలగాలు మానవహారంగా ఏర్పడి రాళ్ల దాడికి పాల్పడ్డాయని భారత అధికారులు ప్రకటించారు. అయితే భారత బలగాల అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని వారు తెలిపారు.
ఐదు చోట్ల జరగాల్సిన భేటీలు..: ఇరుదేశాల జాతీయ పండుల సందర్భంలో సరిహద్దు వెంబడి ఉన్న ఐదు ప్రాంతాల్లో భారత్-చైనా సైన్యాలు సమావేశం కావడం రివాజుగా వస్తోంది. జమ్ముకశ్మీర్లోని లడఖ్లోని దౌలత్ బేగ్, చుషూల్, అరుణాచల్ప్రదేశ్లోని కిబిథూ, బుమ్లా, సిక్కింలోని నాథూలా వద్ద ఈ భేటీలు జరుగుతాయి. భారత స్వాతంత్ర్యదినోత్సవం నాడు ఈ ఐదు ప్రాంతాల్లో ఏ ఒక్కచోటా సమావేశం జరగలేదని ఆర్మీ ప్రకటించింది.
అమెరికా మాట: భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను వారు మాత్రమే పరిష్కరించుకోగలరని అమెరికా పేర్కొంది. యూఎస్ స్టేడ్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి హెయిథర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ముఖాముఖి చర్చల ద్వారా భారత్-చైనాలు సమస్యను పరిష్కరించుకోగలవని, ఆమేరకు ఇరు దేశాలనూ తాము ప్రోత్సహిస్తున్నామని ఆమె చెప్పారు.
భారత బలగాలపై చైనా రాళ్ల దాడి
Published Wed, Aug 16 2017 9:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement