* దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
* హాజరైన వైఎస్సార్సీపీ అధినేత జగన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీప్రముఖులు
శంషాబాద్ రూరల్: మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు షష్టిపూర్తి బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడ్రోజులపాటు నిర్వహించిన ఈ వేడుక చివరి రోజున.. సీఎం కె.చంద్రశేఖర్రావు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై రామేశ్వర్రావు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చైనా పర్యటన ముగించుకుని రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ అక్కడ్నుంచి నేరుగా శ్రీరామనగరం వచ్చారు. వేదికపై శ్రీ త్రిదండి చిన జీయర్స్వామి ఆశీస్సులు పొందారు. సుమారు అరగంటపాటు కేసీఆర్ ఇక్కడ గడిపారు. వేదిక వద్ద జగన్ ను కలిసిన చిరంజీవి కాసేపు ముచ్చటించారు. అంతకుముందు వేదికపై చినజీయర్స్వామి, శ్రీ అహోబిల జీయర్స్వామి జ్యోతి ప్రజల్వన చేసి రామేశ్వర్రావు దంపతులకు మంగళ శాసనాలు అందజేశారు.
కార్యక్రమానికి రామోజీ గ్రూపు చైర్మన్ రామోజీరావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు జైపాల్రెడ్డి, చిరంజీవి దంపతులు, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, టి.ప్రకాష్గౌడ్, శ్రీనివాస్గౌడ్, రసమయి బాలకిషన్, రాంచంద్రారెడ్డి, రాజకీ య, సినీ ప్రముఖులు డి.శ్రీనివాస్, దగ్గుపాటి వెంకటేశ్వర్రావు, నాగం జనార్దన్రెడ్డి, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వడ్డె నవీన్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దంపతులు, కలెక్టర్ రఘునందన్రావు హాజరయ్యారు.
రామేశ్వర్రావు షష్టి పూర్తి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభారాణి ఇక్కడి దివ్యసాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకే ఇక్కడికి చేరుకున్న ఆమె.. కేసీఆర్ రాకముందే వెళ్లిపోయారు. చిరంజీవి దంపతులు కూడా దివ్యసాకేతాలయంలో పూజలు నిర్వహించారు.
ఘనంగా రామేశ్వర్ రావు షష్టిపూర్తి
Published Thu, Sep 17 2015 2:57 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement