మార్పు కోసం బీజేపీని గెలిపించాలి
అడ్డాకుల: రాష్ట్రంలో సమూల మార్పు కోసం బీజేపీని, దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అభ్యర్థి ఎగ్గని నర్సింహులు గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పార్టీ మండలాధ్యక్షుడు మున్నూర్ రమేష్ పిలుపునిచ్చారు. మండలంలోని కాటవరం శివారులో శుక్రవారం ఏర్పాటు చేసిన శక్తి కేంద్రాల ఇన్చార్జ్లు, మండల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టే ప్రచారంపై మండల నాయకులతో చర్చించారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాల గురించి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ బీజేపీకి మద్దతు కూడగట్టే విధంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ నాలుగున్నరేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులతో పథకాలు చేపట్టి.. టీఆర్ఎస్ ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలన్నారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, వేఘనాత్, చెన్నగౌడ్, సూర్యనారాయణ, అరవింద్కుమార్రెడ్డి, రాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
14న ఎగ్గని నామినేషన్
దేవరరద్ర రూరల్: బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎగ్గని నర్సింహులు ఈ నెల 14న నామినేషన్ వేస్తున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనల తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.