మాజీ ఎంపీ గంగారెడ్డి అంత్యక్రియలు పూర్తి | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ గంగారెడ్డి అంత్యక్రియలు పూర్తి

Published Tue, Mar 21 2017 1:16 PM

EX MP gangareddy accorded state funeral

నిజామాబాద్‌ : ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మాజీ ఎంపీ గంగారెడ్డి అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. జక్రాన్‌ పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి ఫాంహౌస్‌లో  ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, దానం నాగేందర్‌, నాగం జనార్దన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. కాగా గంగారెడ్డి నిన్న తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

గంగారెడ్డి పదో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 1991-96లో మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 11వ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. తిరిగి 12వ లోక్‌సభకు టీడీపీ తరపున గెలుపొందారు. ఆఖరిసారి 1999-2014 లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్‌రెడ్డిపై విజయం సాధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement