విజ్ఞాన యాత్రలో ప్రమాదం : ఇద‍్దరి దుర‍్మరణం | Sakshi
Sakshi News home page

విజ్ఞాన యాత్రలో ప్రమాదం : ఇద‍్దరి దుర‍్మరణం

Published Wed, Jan 18 2017 10:57 AM

విజ్ఞాన యాత్రలో ప్రమాదం : ఇద‍్దరి దుర‍్మరణం - Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా స్కూల్ విద్యార్థుల విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దామరచర‍్ల మండలం రాళ‍్లవాగుతాండా వద‍్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.

సూర్యాపేటకు చెందిన సాహితీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. రాళ‍్లవాగు తాండా వద‍్ద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు రోడ్డు దాటుతున్న ముగ్గురిని  ఢీకొట్టింది. ఈ ఘటనలో సాహితీ స్కూల్‌ కరస్పాండెంట్‌ శాంతి, 9వ తరగతి విద్యార్థిని ప్రాణేశ‍్వరి అక‍్కడికక‍్కడే మృతిచెందారు. మరో విద్యార్థి ప్రియాంక తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వైద్యం నిమిత్తం ఆస‍్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద‍్యులు తెలిపారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటనా స‍్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement