రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు

Published Tue, Jun 23 2015 7:09 AM

రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు - Sakshi

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రజనీ వియ్యంకుడు (అల్లుడు తండ్రి) కస్తూరి రాజా 2012లో ‘మై హూ రజనీకాంత్’ అనే హిందీ సినిమా నిర్మాణం కోసం తన వద్ద రూ. 40 లక్షలు రుణం తీసుకున్నారని, ఆ తర్వాత మరో రూ. 25 లక్షలు రుణం అడిగారని.. ఆ రుణం తాను చెల్లించలేకపోతే తన కుమారుడు ధనుష్ మామ అయిన రజనీ చెల్లిస్తారని తనకు హామీ ఇచ్చారని ఫైనాన్సియర్ ముకుంద్ బోత్రా కేసు దాఖలు చేశారు.

కస్తూరి రాజా ఇచ్చిన చెక్కులు చెల్లలేదని ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జడ్జి.. రజనీకి, కస్తూరి రాజా న్యాయవాదికి నోటీసులు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement