సాక్షి, న్యూఢిల్లీ: కేవలం నెల రోజుల్లో మన పెట్టుబడి అమాంతంగా మూడు రెట్లు అవుతుందంటే ఎవరికి ఆశపుట్టదు ? సరిగ్గా ఈ దురాశనే అవకాశంగా మార్చుకుని దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడింది ఓ ముఠా. వివిధ ప్రాంతాలకు చెందిన రెండు లక్షల మందికిపైగా ప్రజలను మోసగించి ఏకంగా రూ.562 కోట్లు దండుకుంది. ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అక్కడే జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 95 కేసులు నమోదైనట్టు తేలింది. మోసపోయినవారిలో ఢిల్లీవాసులు 2,800 మంది ఉన్నారు. వీరి నుంచి రూ.25 కోట్ల మేర దోచుకున్నారు.
క్రైంబ్రాంచ్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ జాయింట్ కమిషనర్ ప్రవీర్జైన్ తెలిపిన ప్రకారం వివరాలు.. నిందితులను గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందిన అశోక్ జడేజా, కమిజిభాయ్ జడేజా, ప్రవీణ్ పోపట్, కేశారాంగా గుర్తించారు. ముఠాలో కీలక సభ్యుడైన అశోక్ జడేజా తనకు సిక్దార్మాత అతీతశక్తులు ఉన్నాయని, ఇచ్చిన డబ్బును మూడింతలు చేస్తానంటూ సకోతర్మాతా సమాజ సభ్యులను మోసగించేవారు. మూడు రోజుల నుంచి నెలలోపు డబ్బు మూడింతలు అవుతుందంటూ వారిని నమ్మబలికేవారు. దీంతో అమాయకులు ఎంతోమంది వీరికి డబ్బును సమర్పించుకున్నారు.
అశోక్ జడేజా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని దేవ్యాప్తంగా ఏజెట్లను పెట్టుకుని మరీ డబ్బు వసూలు చేశాడుు. మతాన్ని, మూఢవిశ్వాసాలను అడ్డపెట్టుకుని ముఠా చేసిన మాయలో ఢిల్లీవాసులు సైతం పెద్ద సంఖ్యలో పడ్డారు. పక్కా వ్యూహాన్ని రచించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీస్ ఈఓడబ్ల్యూ విభాగం పోలీసులు గుజరాత్ పోలీసు సిబ్బంది సహాయంతో వీరిని అరెస్టు చేశారు. గుజరాత్లో నేరాలకు సంబంధించి వీరంతా ప్రస్తుతం అక్కడే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి.
రూ.562 కోట్లు దండుకున్నారు
Published Tue, Dec 17 2013 11:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement