డెర్బీ: వరుసగా మూడు విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్... ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ దారుణ పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న శ్రీలంక... మహిళల ప్రపంచకప్లో భాగంగా నేడు ముఖాముఖి పోరులో తలపడనున్నాయి. తాజా విజయాలతో పాటు తాము ఆడిన చివరి నాలుగు వన్డే సిరీస్లను గెలుచుకున్న భారత జట్టు తమ జోరును మరింతగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
ఇప్పుడు తమకన్నా బలహీనంగా కనిపిస్తున్న లంకపై కూడా నెగ్గితే సెమీఫైనల్స్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. భారత్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో టాపర్గా ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో విశేషంగా రాణిస్తున్న భారత అమ్మాయిలు ఫేవరెట్గానే కనిపిస్తుండగా... అన్నింట్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న లంక ఏమేరకు పోటీనివ్వగలదో వేచి చూడాలి. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోకుండా ఆడాల్సిన అవసరం ఉందని కెప్టెన్ మిథాలీ అభిప్రాయపడుతోంది.
ఊపు మీదున్న భారత్
ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్ రూపంలో జట్టుకు పటిష్ట లైనప్ ఉంది. ముఖ్యంగా స్మృతి తన కెరీర్లోనే అద్భుత ఫామ్లో ఉంది. మూడు మ్యాచుల్లో ఆమె 198 పరుగులు చేసింది. ఇక పేసర్ జులన్, ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ ప్రభావం చూపగలిగే బౌలర్లే. మరోవైపు ఇప్పటిదాకా విజయం రుచి చూడని లంక మరోసారి చమరి ఆటపట్టుపైనే ఆధారపడింది. కివీస్తో జరిగిన తొలి మ్యాచ్లో 53, ఆసీస్పై అజేయంగా 178 పరుగులతో ఆమె ఆకట్టుకుంది. అయితే ఈ మూడు మ్యాచ్ల్లోనూ జట్టు దాదాపు 200కు పైగా పరుగులు చేయగలిగింది. భారత్పై కూడా ఇదే రీతిన చెలరేగి ఫలితం దక్కించుకుంటామని కెప్టెన్ ఇనోక రణవీర పేర్కొంది.
జట్లు (అంచనా): భారత్: మిథాలీ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మంధన, హర్మన్ప్రీత్, దీప్తి, మోనా మేశ్రమ్, సుష్మా వర్మ, జులన్ గోస్వామి, మాన్సి జోషి, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్. శ్రీలంక: ఇనోక రణవీర (కెప్టెన్), నిపుణి హన్సిక, హాసిని పెరీరా, చమరి ఆటపట్టు, శశికళ, దిలాని, హర్షిత, ఒషాడి, ఇషాని, అమ కంచన, శ్రీపాలి.
మరో విజయంపై దృష్టి
Published Wed, Jul 5 2017 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement