లండన్: ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల ముగిసిన తర్వాత టీమిండియా క్రికెట్ జట్టు సభ్యులకు 15 రోజుల విరామం దొరికింది. దీంతో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే లోపు ఆ దేశంలోని పలు ప్రాంతాలను చుట్టి రావడానికి ఫిక్స్ అయ్యారు పలువురు టీమిండియా క్రికెటర్లు. ఇందులో భాగంగా తమ జీవిత భాగస్వాములతో కలిసి ప్రేమ విందును ఆస్వాదిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన సతీమణి, బాలీవుడ్ నటీమణి అనుష్క శర్మతో కలిసి లండన్లో సరదాగా చక్కర్లు కొట్టాడు. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను కోహ్లి.. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మరొకవైపు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్రతిసారీ తన భార్య గురించి గొప్పగా చెప్పే ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఆమెతో కలిసి మధురమైన అనుభూతిని సొంతం చేసుకున్నాడు. లండన్లోని హస్కసన్లో రితికాతో కలిసి విందుకు వెళ్లాడు రోహిత్. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ‘డేట్ నైట్ విత్ మై లవ్’ అని కామెంట్ పెట్టాడు.