వన్డేల్లో కోహ్లీకి రెండో ర్యాంక్ | Sakshi
Sakshi News home page

వన్డేల్లో కోహ్లీకి రెండో ర్యాంక్

Published Mon, Oct 20 2014 10:57 AM

వన్డేల్లో కోహ్లీకి రెండో ర్యాంక్

దుబాయ్: తాజాగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంక్ కు ఎగబాకాడు. భారత్ తో జరగాల్సిన ఐదు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ అర్థాంతరంగా ముగించి స్వదేశానికి పయనం కావడంతో మూడు మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఆ మూడు మ్యాచ్ ల్లో కోహ్లీ 191 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.  తొలి రెండు మ్యాచ్ ల్లో మోస్తరుగా రాణించిన కోహ్లీ.. నాల్గో వన్డేలో 127 పరుగులు చేయడం అతనికి లాభించింది.  ఈ మ్యాచ్ లో కోహ్లీ రాణించడంతో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.

 

ఇదిలా ఉండగా మరో భారత్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ మునుపటి ఆరో ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు. మరో భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలిసారి టాప్ -10 లో స్థానం దక్కించుకున్నాడు. కాగా, వన్డేల్లో 113 పాయింట్లతో టీమిండియా-దక్షిణాఫ్రికాలు రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement