పెర్త్: ప్రపంచ కప్లో టీమిండియాకు తొలిసారి సవాల్ ఎదురైంది. ఏకపక్ష ఘనవిజయాలతో దూసుకెళ్తున్న భారత్ తొలిసారి చెమటోడ్చి నెగ్గింది. అయినా ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించి వరుసగా నాలుగో విజయం సాధించింది. గ్రూపు-బిలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ధోనీసేన 4 వికెట్లతో విజయం సాధించింది. భారత టాపార్డర్ తడబడినా ధోనీ (45 నాటౌట్) కెప్టెన్ ఇన్నంగ్స్ తో జట్టును గెలిపించాడు. తాజా విజయంతో భారత్ దాదాపుగా నాకౌట్ బెర్తు సొంతం చేసుకుంది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి మరో 65 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. కష్టసాధ్యంకాని లక్ష్యఛేదనలో భారత్ తడబడింది. 20 పరుగులకే ఓపెనర్లు ధవన్ (9), రోహిత్ (7) ఇద్దరూ అవుటయ్యారు. జెరోమ్ టేలర్ వరుస ఓవర్లలో వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఈ దశలో కోహ్లీ (33), రహానె (14) కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా వెంటవెంటనే వెనుదిరిగారు. అనంతరం ధోనీ.. రైనాతో కలసి జట్టు స్కోరును 100 దాటించాడు. జట్టు విజయం దిశగా పయనిస్తున్న సమయంలో రైనా (22), జడేజా (13) అవుటవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. మరో వికెట్ పడుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే ధోనీ, అశ్విన్ తో కలసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహీ మరోసారి బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అవతారమెత్తాడు. షమీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన విండీస్ను భారత బౌలర్లు 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ చేశారు. విండీస్ జట్టులో కెప్టెన్ జాసన్ హోల్డర్ (57) టాప్ స్కోరర్. ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ 21 పరుగులకే అవుటయ్యాడు. సామీ 26, కార్టర్ 21 పరుగులు చేశారు. విండీస్ ఓ దశలో 85/7తో పీకల్లోతు కష్టాల్లోపడింది. హోల్డర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో విండీస్ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లు షమీ మూడు, ఉమేష్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
టాపార్డర్ తడబడినా.. ధోనీ గెలిపించాడు
Published Fri, Mar 6 2015 7:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
Advertisement