ధర్మశాల: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రివ్యూ కోరాడంటే దానికి తిరుగుండదని గతంలో ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. తాజాగా ఆదివారం ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇది మరోసారి రుజువైంది. అంపైర్ ఔట్ ఇస్తున్న సందర్భంలోనే పూర్తిగా ఔట్ సిగ్నల్ ఇవ్వకముందే మిస్టర్ కూల్ ధోని డీఆర్ఎస్ కు వెళ్లాడు. ధోని రివ్యూ సక్సెస్ కావడంతో సోషల్ మీడియాలో మాజీ కెప్టెన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘డీఆర్ఎస్.. ధోని రివ్యూ సిస్టమ్’ ఎప్పటికీ సరైన నిర్ణయాన్నే తీసుకుంటుందంటూ ధోనిని ప్రశంసిస్తున్నారు.
ఇన్నింగ్స్ 33వ ఓవర్ లంక ప్లేయర్ సచిత్ పతిరన బౌలింగ్ చేశాడు. కాగా ఆ ఓవర్ చివరి బంతిని టీమిండియా క్రికెటర్ జస్ప్రిత్ బూమ్రా ఎదుర్కోగా.. బంతి ప్యాడ్లకు తాకడంతో లంకేయులు అప్పీలు చేశారు. అంపైర్ ఔట్ గా ప్రకటిస్తుండటాన్ని గమనించిన ధోని డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. రీ ప్లే చూసి చెక్ చేసిన అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. బూమ్రాను నాటౌట్ గా ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం భారత క్రికెట్ అభిమానుల వంతయింది. వాట్ ఏ రివ్యూ ధోని అంటూ కొందరు కామెంట్ చేయగా, ధోని ఎందుకంత విలువైన ఆటగాడో రివ్యూ నిరూపించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ మ్యాచ్లో భారత్ దారుణంగా ఓటమి పాలైనా, తన ఆటతీరుతో ధోని విమర్శకుల నోళ్లు మూయించాడు.
DRS by @msdhoni before ump raised the finger ☝🏻. @cricketaakash said Dhoni Review System (DRS), very well said. Boss of the ODIs for a reason 🏏🙏🏻#INDvSL pic.twitter.com/m50If2q7ws
— Mitul Srivastava (@im_Ms7) 11 December 2017
The review for Bhumrah just now, proved once again, why is #MSD such an asset even now!
— Vishal Pandey (@VishalP1011) 10 December 2017
Wonderful cricketing mind and a marvelous game reader! #IndvsSL #Dhoni #Dharamshala
ధోని రివ్యూ కోరాడంటే దానికి తిరుగుండదు