రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్ | Sakshi
Sakshi News home page

రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్

Published Thu, Aug 13 2015 5:46 AM

రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్

ముంబై: క్రికెటర్ రోహిత్ శర్మ... ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 30 కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ కొన్నాడు. బాంద్రా-వర్లీ సీ లింక్‌కు దగ్గరి ప్రాంతంలో ఉన్న అహుజా టవర్స్‌లో 29వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్‌లో నాలుగు బెడ్ రూమ్‌లు ఉన్నాయి. ఫ్ల్లాట్‌లో నుంచి చూస్తే బాంద్రా-వర్లీ సీ లింక్ అద్భుతంగా కనిపిస్తుంది. రోహిత్ తనకు అత్యంత అనుకూలమైన నివాసాన్ని ఎంచుకున్నాడని కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్, ఎంటర్‌టైనమెంట్ సీఈఓ బంటీ సజ్దేశ్ అన్నారు.

‘గత కొంత కాలంగా కొత్త ఇంటి కోసం రోహిత్ వెతుకుతున్నాడు. అహుజా టవర్స్‌లో అద్భుతమైన ఫ్లాట్ దొరికింది. ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో వర్లీ కూడా ఒకటి. అలాగే నగరానికి మధ్యలో ఉంటుంది. క్రికెట్ ప్రాక్టీస్, శిక్షణకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతంలో రోహిత్ ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి కేవలం రెండు నిమిషాల డ్రైవింగ్‌లో సీ లింక్‌కు చేరుకోవచ్చు’ అని సజ్దేశ్ వ్యాఖ్యానించాడు. ఈ టవర్‌లో మరికొంత మంది ప్రముఖులు కూడా ఫ్లాట్లను తీసుకున్నారు.
 

Advertisement
Advertisement